Political News

విజయవాడ పునుగులు తిన్న బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్‌, ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ విధానాల గురించి తెలుసుకున్నారు బిల్ గేట్స్.

అయతే, కేవలం టెక్నాలజీకి సంబంధించిన విషయాలే కాకుండా వ్యవసాయ విషయాలను కూడా తెలుసుకున్నారు.. ఈ క్రమంలోనే ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బిల్ గేట్స్ పర్యటించారు. అక్కడి అరటి తోటను పరిశీలించి అమరావతి రైతులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా గేట్స్ కు అమరావతి మహిళా ఒకరు స్థానిక వంటకాలను రుచి చూపించారు. ఆ మహిళ ఇచ్చిన విజయవాడ పునుగులను బిల్ గేట్స్ తిన్నారు. పునుగులు బాగున్నాయని గేట్స్ అన్నారు.

వ్యవసాయంలో డ్రోన్ల వినయోగం గురించి రైతులను గేట్స్ అడిగి తెలుసుకున్నారు. ఇక, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని గేట్స్ కు చంద్రబాబు తెలిపారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, క్యూఆర్ కోడ్‌ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇక, అమరావతి రాజధాని నిర్మాణం గురించి కూడా చంద్రబాబును గేట్స్ అడిగి తెలుసుకున్నారు. భావి తరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల సదుపాయాలతో సువిశాల రాజధాని నిర్మిస్తున్నామని చంద్రబాబు వివరించారు. అమరావతిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని…గ్రేట్‌ వర్క్ అని బిల్ గేట్స్‌ కితాబిచ్చారు. బిల్ గేట్స్ పునుగులు రుచి చూస్తూ పొలాల్లో పర్యటించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

This post was last modified on February 16, 2026 5:08 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Bill Gates

Recent Posts

టాక్సిక్ మనసులో అసలు ఏముందో

ఇంకో మూడు రోజులు దాటితే టాక్సిక్ విడుదల కేవలం నెల రోజుల్లో ఉంటుంది. ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా ఎలాంటి సౌండ్…

21 minutes ago

అర్జున్ కష్టానికి ఫలితం జీరో

సీనియర్ నటుడు అర్జున్ కు యాక్షన్ హీరో అని పేరు. కెరీర్లో ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేశాడు అర్జున్. 90వ…

2 hours ago

ఫిబ్రవరి నెల ఎందుకింత డ్రైగా ఉంది

సంక్రాంతి తర్వాత మళ్ళీ అదే స్థాయిలో కాదు కానీ అందులో సగం ఊపు కూడా ఫిబ్రవరిలో కనిపించడం లేదు. సంతోష్…

2 hours ago

‘బీఆర్ఎస్ కాదు… బీఆర్ఎస్ కార్పొరేటర్లు గొప్పోళ్లు’

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్…

3 hours ago

కార్పొరేట్ రంగంలోకి జేడీ.. ప్రశ్నిస్తున్న జనసైనికులు

సీబీఐ మాజీ సంయుక్త సంచాలకుడు, మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా…

5 hours ago

అక్కడ బీజేపీ – కాంగ్రెస్ పొత్తు

తెలంగాణ రాజ‌కీయాల్లో  చిత్ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష బీజేపీ లు చేతులు క‌లిపాయి. ఫ‌లితంగా…

5 hours ago