మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్, ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ విధానాల గురించి తెలుసుకున్నారు బిల్ గేట్స్.
అయతే, కేవలం టెక్నాలజీకి సంబంధించిన విషయాలే కాకుండా వ్యవసాయ విషయాలను కూడా తెలుసుకున్నారు.. ఈ క్రమంలోనే ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బిల్ గేట్స్ పర్యటించారు. అక్కడి అరటి తోటను పరిశీలించి అమరావతి రైతులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా గేట్స్ కు అమరావతి మహిళా ఒకరు స్థానిక వంటకాలను రుచి చూపించారు. ఆ మహిళ ఇచ్చిన విజయవాడ పునుగులను బిల్ గేట్స్ తిన్నారు. పునుగులు బాగున్నాయని గేట్స్ అన్నారు.
వ్యవసాయంలో డ్రోన్ల వినయోగం గురించి రైతులను గేట్స్ అడిగి తెలుసుకున్నారు. ఇక, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని గేట్స్ కు చంద్రబాబు తెలిపారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, క్యూఆర్ కోడ్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇక, అమరావతి రాజధాని నిర్మాణం గురించి కూడా చంద్రబాబును గేట్స్ అడిగి తెలుసుకున్నారు. భావి తరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల సదుపాయాలతో సువిశాల రాజధాని నిర్మిస్తున్నామని చంద్రబాబు వివరించారు. అమరావతిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని…గ్రేట్ వర్క్ అని బిల్ గేట్స్ కితాబిచ్చారు. బిల్ గేట్స్ పునుగులు రుచి చూస్తూ పొలాల్లో పర్యటించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
This post was last modified on February 16, 2026 5:08 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…