ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణాన్ని చేపట్టి రికార్డు స్థాయి వేగంతో పూర్తి చేశారు. 22 కిలోమీటర్ల ఈ రహదారిని శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నేరుగా అక్కడ పర్యటించే అవకాశం లేకపోవడంతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
సుమారు 8.9 కోట్ల రూపాయల వ్యయంతో మూడు నెలల క్రితం ఈ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి వేడుకలకు ముందుగానే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పినట్టుగానే, రెండు రోజుల ముందే రహదారిని ప్రారంభించడం విశేషం.
రహదారిని ప్రారంభించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల నిర్వహణ మరియు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టుతున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు భక్తులకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.
గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆలయాలు వారసత్వం మరియు పురాతన సంపదకు ప్రతీకలని పేర్కొన్నారు. ఆలయాలను పరిరక్షించే విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో ఆలయ వ్యవస్థను నాశనం చేశారని అన్నారు.
పాలక మండళ్లు సరిగా పనిచేసి ఉంటే అలాంటి తప్పులు జరిగి ఉండేవి కావని అభిప్రాయపడ్డారు. అపచారాలు జరగకుండా చూసుకునే బాధ్యత పాలక మండళ్లపైనే ఉందన్నారు. ప్రస్తుతం అన్ని ఆలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేశామని, గత తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
చంద్రబాబు, ప్రధాని మోడీ నేతృత్వంలో పాలన ప్రారంభమైన నాటి నుంచి ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. జగన్నాథపురంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు. 22 ప్రధాన దేవాలయాలకు రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి పౌర్ణమికి శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
This post was last modified on February 13, 2026 4:00 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…