Political News

ఆలయాలపై నిర్లక్ష్యం చేశారన్న పవన్ ఆరోపణలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణాన్ని చేపట్టి రికార్డు స్థాయి వేగంతో పూర్తి చేశారు. 22 కిలోమీటర్ల ఈ రహదారిని శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నేరుగా అక్కడ పర్యటించే అవకాశం లేకపోవడంతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

సుమారు 8.9 కోట్ల రూపాయల వ్యయంతో మూడు నెలల క్రితం ఈ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి వేడుకలకు ముందుగానే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పినట్టుగానే, రెండు రోజుల ముందే రహదారిని ప్రారంభించడం విశేషం.

రహదారిని ప్రారంభించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల నిర్వహణ మరియు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టుతున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు భక్తులకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.

గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆలయాలు వారసత్వం మరియు పురాతన సంపదకు ప్రతీకలని పేర్కొన్నారు. ఆలయాలను పరిరక్షించే విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో ఆలయ వ్యవస్థను నాశనం చేశారని అన్నారు.

పాలక మండళ్లు సరిగా పనిచేసి ఉంటే అలాంటి తప్పులు జరిగి ఉండేవి కావని అభిప్రాయపడ్డారు. అపచారాలు జరగకుండా చూసుకునే బాధ్యత పాలక మండళ్లపైనే ఉందన్నారు. ప్రస్తుతం అన్ని ఆలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేశామని, గత తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

చంద్రబాబు, ప్రధాని మోడీ నేతృత్వంలో పాలన ప్రారంభమైన నాటి నుంచి ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. జగన్నాథపురంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు. 22 ప్రధాన దేవాలయాలకు రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి పౌర్ణమికి శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

This post was last modified on February 13, 2026 4:00 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago