Political News

ఆలయాలపై నిర్లక్ష్యం చేశారన్న పవన్ ఆరోపణలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణాన్ని చేపట్టి రికార్డు స్థాయి వేగంతో పూర్తి చేశారు. 22 కిలోమీటర్ల ఈ రహదారిని శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నేరుగా అక్కడ పర్యటించే అవకాశం లేకపోవడంతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

సుమారు 8.9 కోట్ల రూపాయల వ్యయంతో మూడు నెలల క్రితం ఈ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి వేడుకలకు ముందుగానే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పినట్టుగానే, రెండు రోజుల ముందే రహదారిని ప్రారంభించడం విశేషం.

రహదారిని ప్రారంభించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల నిర్వహణ మరియు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టుతున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు భక్తులకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.

గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆలయాలు వారసత్వం మరియు పురాతన సంపదకు ప్రతీకలని పేర్కొన్నారు. ఆలయాలను పరిరక్షించే విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో ఆలయ వ్యవస్థను నాశనం చేశారని అన్నారు.

పాలక మండళ్లు సరిగా పనిచేసి ఉంటే అలాంటి తప్పులు జరిగి ఉండేవి కావని అభిప్రాయపడ్డారు. అపచారాలు జరగకుండా చూసుకునే బాధ్యత పాలక మండళ్లపైనే ఉందన్నారు. ప్రస్తుతం అన్ని ఆలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేశామని, గత తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

చంద్రబాబు, ప్రధాని మోడీ నేతృత్వంలో పాలన ప్రారంభమైన నాటి నుంచి ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. జగన్నాథపురంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు. 22 ప్రధాన దేవాలయాలకు రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి పౌర్ణమికి శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

This post was last modified on February 13, 2026 4:00 pm

Share

Recent Posts

మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…

1 hour ago

రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!

ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…

1 hour ago

జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

2 hours ago

వెంకటేష్ ప్రయాణానికి అప్పుడే 40 ఏళ్ళు

సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజు 1986 సంవత్సరం ఆగస్ట్ 14 కలియుగ పాండవులు రిలీజయ్యింది. మాములుగా స్టార్…

2 hours ago

సాక్ష్యాల తారుమారు కేసులో సీదిరి అప్పల రాజుకు బెయిల్

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ శర్మ చేసిన బైక్ యాక్సిడెంట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

3 hours ago

ఆవారాపన్ 2… అంతగా ఏముందబ్బా

కొత్తగా రిలీజైన సినిమాల్లో అడ్వాన్స్ బుకింగ్ పరంగా దూసుకుపోతున్న సినిమాగా ఆవారాపన్ 2 అన్ని రాష్టాల ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago