గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి ప్రజల్లో చురుకుగా కనిపించారు. పలు కేసుల్లో రిమాండ్ జీవితం గడిపి బెయిల్పై బయటకు వచ్చిన అనంతరం కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా జిల్లా కలెక్టరేట్ను సందర్శించి ప్రజా సమస్యలపై పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న 2,400 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని వంశీ డిమాండ్ చేశారు. అర్హులైన కుటుంబాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం ఆలస్యం చేయడం వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇళ్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ను కోరారు.
అలాగే గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూములు కోల్పోయిన రైతుల సమస్యలను ప్రస్తావించారు. గతంలో అమరావతిలో ఇస్తామని హామీ ఇచ్చిన ఇళ్ల పట్టాలను తక్షణం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్న రైతులకు న్యాయం జరగాలని, వారి పునరావాస ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రైతుల తరఫున తాను పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.
వైసీపీ ఓటమి అనంతరం తీవ్ర అవినీతి ఆరోపణలు, పలు కేసులు ఎదుర్కొన్న వంశీ సుమారు 138 రోజులు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నట్లు తెలిసింది. అనంతరం బెయిల్ లభించడంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆరు నెలల తర్వాత మళ్లీ ప్రజల్లోకి వస్తానని ప్రకటించిన ఆయన, ఇటీవల వైఎస్ జగన్ జగ్గయ్యపేట పర్యటనలో పాల్గొనడం ద్వారా రాజకీయ రంగంలో తన ఉనికిని చాటుకున్నారు.
ఇప్పటికీ కొన్ని కేసుల్లో విచారణ కొనసాగుతుండగా, నిబంధనల ప్రకారం వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. రాజకీయాలకు గుడ్బై చెబుతారన్న ప్రచారం నడుమ, జగన్ ఇచ్చిన భరోసాతో తిరిగి కార్యాచరణలోకి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో బంధువులు, అభిమానులను కలుసుకుంటూ మద్దతు కోరుతున్న వంశీ, మళ్లీ స్థానిక రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది.
This post was last modified on February 9, 2026 5:42 pm
Rare & Unexpected:Probably for the first time, PM #Modi Addresses Nation Through a Selfie Video,…
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…