Political News

ప్రజా సమస్యలపై కలెక్టరేట్ కు వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి ప్రజల్లో చురుకుగా కనిపించారు. పలు కేసుల్లో రిమాండ్ జీవితం గడిపి బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించి ప్రజా సమస్యలపై పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న 2,400 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని వంశీ డిమాండ్ చేశారు. అర్హులైన కుటుంబాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం ఆలస్యం చేయడం వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇళ్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ను కోరారు.

అలాగే గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూములు కోల్పోయిన రైతుల సమస్యలను ప్రస్తావించారు. గతంలో అమరావతిలో ఇస్తామని హామీ ఇచ్చిన ఇళ్ల పట్టాలను తక్షణం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్న రైతులకు న్యాయం జరగాలని, వారి పునరావాస ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రైతుల తరఫున తాను పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.

వైసీపీ ఓటమి అనంతరం తీవ్ర అవినీతి ఆరోపణలు, పలు కేసులు ఎదుర్కొన్న వంశీ సుమారు 138 రోజులు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నట్లు తెలిసింది. అనంతరం బెయిల్ లభించడంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆరు నెలల తర్వాత మళ్లీ ప్రజల్లోకి వస్తానని ప్రకటించిన ఆయన, ఇటీవల వైఎస్ జగన్ జగ్గయ్యపేట పర్యటనలో పాల్గొనడం ద్వారా రాజకీయ రంగంలో తన ఉనికిని చాటుకున్నారు.

ఇప్పటికీ కొన్ని కేసుల్లో విచారణ కొనసాగుతుండగా, నిబంధనల ప్రకారం వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. రాజకీయాలకు గుడ్‌బై చెబుతారన్న ప్రచారం నడుమ, జగన్ ఇచ్చిన భరోసాతో తిరిగి కార్యాచరణలోకి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో బంధువులు, అభిమానులను కలుసుకుంటూ మద్దతు కోరుతున్న వంశీ, మళ్లీ స్థానిక రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

This post was last modified on February 9, 2026 5:42 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాహుబలి-2 రికార్డు… ఇంకొన్ని రోజులే

తొమ్మిదేళ్ల కిందట ‘బాహుబలి: ది కంక్లూజన్’ బాక్సాఫీస్ దగ్గర మామూలు ప్రభంజనం సృష్టించలేదు. అప్పటిదాకా ఉన్న అన్ని ఇండియన్ బాక్సాఫీస్…

51 minutes ago

‘బరి’ దర్శకుడు భలే చెప్పాడు

ఓటీటీల్లో మలయాళం సినిమాలను కొన్నేళ్లుగా విరగబడి చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అక్కడి సినిమాల్లో కంటెంట్ చూసి ఇలాంటివి తెలుగులో తీయరేంటి…

2 hours ago

పవన్ సినిమాలో బ్రహ్మి… నల్లమలలో జగన్?

ఏపీ అసెంబ్లీలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సినీ కమెడియన్…

2 hours ago

ధోని బిగ్ స్టేట్మెంట్‌కు రెడీగా ఉండాలా?

ఈ రోజు ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభం కాబోతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పెద్ద షాకే ఇచ్చింది. ఆ…

3 hours ago

”ఆ 11 మంది పశ్చాత్తాప పడతారనుకున్నా”

నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శనివారం సమావేశమైన అసెంబ్లీలో విపక్షం వైసీపీకి చెందిన 11 మంది సభ్యులపై అధికార…

4 hours ago

అమరావతి అగ్నిప్రమాదం వెనుక అసలు నిజం

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో కుట్ర కోణమేమీ లేదని తేలిపోయయింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన…

4 hours ago