గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి ప్రజల్లో చురుకుగా కనిపించారు. పలు కేసుల్లో రిమాండ్ జీవితం గడిపి బెయిల్పై బయటకు వచ్చిన అనంతరం కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా జిల్లా కలెక్టరేట్ను సందర్శించి ప్రజా సమస్యలపై పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న 2,400 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని వంశీ డిమాండ్ చేశారు. అర్హులైన కుటుంబాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం ఆలస్యం చేయడం వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇళ్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ను కోరారు.
అలాగే గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూములు కోల్పోయిన రైతుల సమస్యలను ప్రస్తావించారు. గతంలో అమరావతిలో ఇస్తామని హామీ ఇచ్చిన ఇళ్ల పట్టాలను తక్షణం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్న రైతులకు న్యాయం జరగాలని, వారి పునరావాస ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రైతుల తరఫున తాను పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.
వైసీపీ ఓటమి అనంతరం తీవ్ర అవినీతి ఆరోపణలు, పలు కేసులు ఎదుర్కొన్న వంశీ సుమారు 138 రోజులు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నట్లు తెలిసింది. అనంతరం బెయిల్ లభించడంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆరు నెలల తర్వాత మళ్లీ ప్రజల్లోకి వస్తానని ప్రకటించిన ఆయన, ఇటీవల వైఎస్ జగన్ జగ్గయ్యపేట పర్యటనలో పాల్గొనడం ద్వారా రాజకీయ రంగంలో తన ఉనికిని చాటుకున్నారు.
ఇప్పటికీ కొన్ని కేసుల్లో విచారణ కొనసాగుతుండగా, నిబంధనల ప్రకారం వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. రాజకీయాలకు గుడ్బై చెబుతారన్న ప్రచారం నడుమ, జగన్ ఇచ్చిన భరోసాతో తిరిగి కార్యాచరణలోకి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో బంధువులు, అభిమానులను కలుసుకుంటూ మద్దతు కోరుతున్న వంశీ, మళ్లీ స్థానిక రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది.
This post was last modified on February 9, 2026 5:42 pm
సూర్య నటన గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కథలో దమ్ముంటే తను ఏ స్థాయిలో మెప్పిస్తాడో అందరికీ తెలిసిందే.…
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి పార్టీకి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. స్థానిక టీడీపీ నేతలతో…
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్…
టాలీవుడ్ పెద్ద సినిమాలకే బాలీవుడ్ మార్కెట్లో సరైన రిలీజ్ దొరకడం ఈ మధ్య కాలంలో ఒక పెద్ద టాస్క్గా మారింది.…
టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పరిస్థితి ఇప్పుడు 'ముందు నుయ్యి వెనుక గొయ్యి'లా…
దేశ సరిహద్దుల్లో జరిగే పరిణామాల మీద, ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో దేశభక్తి సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకులను మించిన వాళ్లు…