ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. తిరుమల మహా ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ నివేదిక నేపథ్యంలో రాజకీయ పక్షాల మధ్య జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలం వాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేశారు. ఇదే అంశంపై రాంబాబుపై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయని వైసీపీ ఆరోపిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ కేసులు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసులో అంబటి రాంబాబు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ వచ్చినా మిగతా కేసుల్లో అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
ఇటీవల కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. సిట్ నివేదిక తర్వాత జంతువుల కొవ్వు కలిసిందని గతంలో చేసిన వ్యాఖ్యలను వైసీపీ ప్రస్తావించగా, టీడీపీ జగన్, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
వాటిని తొలగించేందుకు వెళ్లిన అంబటి రాంబాబును టీడీపీ శ్రేణులు అడ్డుకున్న ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆ సమయంలో సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పలుచోట్ల ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఆ ఘటనను వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. మరోవైపు, చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ శాఖ చెబుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.
This post was last modified on February 8, 2026 3:36 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…