Political News

‘బూతు’ నేతలపై వెంకయ్య ఫైర్, టార్గెట్ వీళ్ళేనా?

బూతులు మాట్లాడే నేత‌ల‌పై బీజేపీ సీనియ‌ర్ మోస్టు నాయ‌కుడు, మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు సీరియ‌స్ అయ్యారు. బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూతుల్లోనే ప్ర‌జ‌లు బ‌ల‌మైన స‌మాధానం చెప్పాల‌ని సూచించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇలాంటి రాజ‌కీయాల‌లో ఉన్నామా? అని అనిపిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయితే.. ఆయ‌న ఎవ‌రి పేరును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌లేదు. కానీ, ఇటీవ‌ల కాలంలో వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్‌లు చేసిన వ్యాఖ్య‌లు, దుర్భాల‌ష‌ల‌పై వెంక‌య్య ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు.

విశాఖ‌లో ప‌ర్య‌టించిన వెంక‌య్య శ‌నివారం రాత్రి జరిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీ రాజ‌కీయాలు స‌హా తెలంగాణ రాజ‌కీయాల‌పై ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేశారు.

“సీనియ‌ర్ నేత‌లే క‌ట్టు త‌ప్పుతున్నారు“ అని వెంక‌య్య వ్యాఖ్యానించారు. బూతులు మాట్లాడ‌డాన్ని కొంద‌రు ఫ్యాష‌న్ గా భావిస్తున్న‌ట్టు తెలిపారు. ఇది స‌రికాద‌న్నారు. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే పేపర్లు, మీడియాలో క‌నిపిస్తార‌ని కొంద‌రు భావిస్తున్నార‌ని.. ఇది ఎంత మాత్రం స‌రికాద‌ని చెప్పారు. ఇలాంటి వారిని మీడియా కూడా బ‌హిష్క‌రించాల‌ని సూచించారు.

స‌క్ర‌మ‌మైన రాజ‌కీయాలు చేసిన వాజ్‌పేయి, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వ‌రాజ్ వంటివారిని దేశం ఇప్ప‌టికీ.. ఎప్ప‌టికీ గుర్తుపెట్టుకుంటుంద‌న్నారు. నేటి త‌రం నాయ‌కులు కూడా ఆ విధానాల‌ను అల‌వ‌రుచుకోవాల‌ని సూచించారు.

ఆరోగ్య‌క‌ర‌మైన ల‌క్ష‌ణాలు ఉంటే.. రాజకీయాలు కూడా ఆరోగ్యంగానే ఉంటాయ‌ని చెప్పారు. కానీ, ప్ర‌స్తుతం ఇదే లోపించింద‌న్నారు. దీంతో స‌క్ర‌మంగా మాట్లాడ‌లేని నాయ‌కులు “తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడే దుస్థితి వచ్చింది“ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకో ప‌రిమితం అయింద‌ని తాను చెప్ప‌డం లేద‌న్నారు.

అన్ని పార్టీల్లోనూ ఇదే జాడ్యం కొన‌సాగుతోంద‌న్నారు. అన‌వ‌స‌రంగా నోరు చేసుకునే వారికి .. ప్ర‌జ‌లు నిశ్శ‌బ్దంగా ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో బుద్ధి చెప్పాల‌ని సూచించారు. త‌మ హ‌యాంలో రాజ‌కీయ నేత‌ల నుంచి అనేక విష‌యాలు నేర్చుకునే ప‌రిస్థితి ఉండేద‌న్న ఆయ‌న‌.. ఇప్పుడున్న నేత‌ల నుంచి బూతులు నేర్చుకునే ప‌రిస్థితి భావి త‌రాల‌కు ఏర్ప‌డింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ సంస్కృతిని మార్చుకోవాల్సిన అవ‌స‌రం నాయ‌కుల‌పై ఉంద‌ని, వారు మార‌క‌పోతే.. వారిని మార్చాల్సిన అవ‌స‌రం ప్ర‌జ‌ల‌పైనే ఉంటుంద‌న్నారు.

This post was last modified on February 7, 2026 11:54 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

1 hour ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago