Political News

‘బూతు’ నేతలపై వెంకయ్య ఫైర్, టార్గెట్ వీళ్ళేనా?

బూతులు మాట్లాడే నేత‌ల‌పై బీజేపీ సీనియ‌ర్ మోస్టు నాయ‌కుడు, మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు సీరియ‌స్ అయ్యారు. బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూతుల్లోనే ప్ర‌జ‌లు బ‌ల‌మైన స‌మాధానం చెప్పాల‌ని సూచించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇలాంటి రాజ‌కీయాల‌లో ఉన్నామా? అని అనిపిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయితే.. ఆయ‌న ఎవ‌రి పేరును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌లేదు. కానీ, ఇటీవ‌ల కాలంలో వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్‌లు చేసిన వ్యాఖ్య‌లు, దుర్భాల‌ష‌ల‌పై వెంక‌య్య ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు.

విశాఖ‌లో ప‌ర్య‌టించిన వెంక‌య్య శ‌నివారం రాత్రి జరిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీ రాజ‌కీయాలు స‌హా తెలంగాణ రాజ‌కీయాల‌పై ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేశారు.

“సీనియ‌ర్ నేత‌లే క‌ట్టు త‌ప్పుతున్నారు“ అని వెంక‌య్య వ్యాఖ్యానించారు. బూతులు మాట్లాడ‌డాన్ని కొంద‌రు ఫ్యాష‌న్ గా భావిస్తున్న‌ట్టు తెలిపారు. ఇది స‌రికాద‌న్నారు. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే పేపర్లు, మీడియాలో క‌నిపిస్తార‌ని కొంద‌రు భావిస్తున్నార‌ని.. ఇది ఎంత మాత్రం స‌రికాద‌ని చెప్పారు. ఇలాంటి వారిని మీడియా కూడా బ‌హిష్క‌రించాల‌ని సూచించారు.

స‌క్ర‌మ‌మైన రాజ‌కీయాలు చేసిన వాజ్‌పేయి, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వ‌రాజ్ వంటివారిని దేశం ఇప్ప‌టికీ.. ఎప్ప‌టికీ గుర్తుపెట్టుకుంటుంద‌న్నారు. నేటి త‌రం నాయ‌కులు కూడా ఆ విధానాల‌ను అల‌వ‌రుచుకోవాల‌ని సూచించారు.

ఆరోగ్య‌క‌ర‌మైన ల‌క్ష‌ణాలు ఉంటే.. రాజకీయాలు కూడా ఆరోగ్యంగానే ఉంటాయ‌ని చెప్పారు. కానీ, ప్ర‌స్తుతం ఇదే లోపించింద‌న్నారు. దీంతో స‌క్ర‌మంగా మాట్లాడ‌లేని నాయ‌కులు “తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడే దుస్థితి వచ్చింది“ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకో ప‌రిమితం అయింద‌ని తాను చెప్ప‌డం లేద‌న్నారు.

అన్ని పార్టీల్లోనూ ఇదే జాడ్యం కొన‌సాగుతోంద‌న్నారు. అన‌వ‌స‌రంగా నోరు చేసుకునే వారికి .. ప్ర‌జ‌లు నిశ్శ‌బ్దంగా ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో బుద్ధి చెప్పాల‌ని సూచించారు. త‌మ హ‌యాంలో రాజ‌కీయ నేత‌ల నుంచి అనేక విష‌యాలు నేర్చుకునే ప‌రిస్థితి ఉండేద‌న్న ఆయ‌న‌.. ఇప్పుడున్న నేత‌ల నుంచి బూతులు నేర్చుకునే ప‌రిస్థితి భావి త‌రాల‌కు ఏర్ప‌డింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ సంస్కృతిని మార్చుకోవాల్సిన అవ‌స‌రం నాయ‌కుల‌పై ఉంద‌ని, వారు మార‌క‌పోతే.. వారిని మార్చాల్సిన అవ‌స‌రం ప్ర‌జ‌ల‌పైనే ఉంటుంద‌న్నారు.

This post was last modified on February 7, 2026 11:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఒక్కొక్క పార్టీకీ `3 గంట‌లు`…

పార్ల‌మెంటులో డీలిమిటేష‌న్ స‌హా.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై చ‌ర్చించేందుకు.. ఎంత‌స‌మ‌య‌మైనా ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రెడీ అయింది. ఈ వ్య‌వ‌హారంపై…

43 minutes ago

జగన్ మకాం మార్పు.. సెంటిమెంటా? రాజకీయ వ్యూహమా?

అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై…

2 hours ago

తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. ముమ్మాటీకీ సైకోయిజ‌మే..

వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ…

2 hours ago

ప్రతాప్ కష్టాలు పగవాడికి కూడా వద్దు

రేపు విడుదల కాబోతున్న  పాపం ప్రతాప్ కు టైటిల్ కు తగ్గట్టే చివరి నిమిషం వరకు అయ్యో పాపం అనిపించే…

2 hours ago

డీలిమిటేష‌న్‌… అంద‌రిలోనూ ఒకే భ‌యం!

దేశంలో పార్ల‌మెంటు, అసెంబ్లీ స్థానాల‌ను పున‌ర్విభ‌జించే డీలిమిటేష‌న్‌,  అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే 2023నాటి నారీ…

3 hours ago

‘సంభవం’… క్రేజీ ఐడియా ఇది

గత కొన్నేళ్లలో మలయాళ దర్శకులు బాగా డెవలప్ అయ్యారు. క్రైమ్, హారర్, సస్పెన్స్ ఈ మూడు అంశాలను తీసుకుని వాటికి…

4 hours ago