Political News

‘బూతు’ నేతలపై వెంకయ్య ఫైర్, టార్గెట్ వీళ్ళేనా?

బూతులు మాట్లాడే నేత‌ల‌పై బీజేపీ సీనియ‌ర్ మోస్టు నాయ‌కుడు, మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు సీరియ‌స్ అయ్యారు. బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూతుల్లోనే ప్ర‌జ‌లు బ‌ల‌మైన స‌మాధానం చెప్పాల‌ని సూచించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇలాంటి రాజ‌కీయాల‌లో ఉన్నామా? అని అనిపిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయితే.. ఆయ‌న ఎవ‌రి పేరును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌లేదు. కానీ, ఇటీవ‌ల కాలంలో వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్‌లు చేసిన వ్యాఖ్య‌లు, దుర్భాల‌ష‌ల‌పై వెంక‌య్య ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు.

విశాఖ‌లో ప‌ర్య‌టించిన వెంక‌య్య శ‌నివారం రాత్రి జరిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీ రాజ‌కీయాలు స‌హా తెలంగాణ రాజ‌కీయాల‌పై ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేశారు.

“సీనియ‌ర్ నేత‌లే క‌ట్టు త‌ప్పుతున్నారు“ అని వెంక‌య్య వ్యాఖ్యానించారు. బూతులు మాట్లాడ‌డాన్ని కొంద‌రు ఫ్యాష‌న్ గా భావిస్తున్న‌ట్టు తెలిపారు. ఇది స‌రికాద‌న్నారు. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే పేపర్లు, మీడియాలో క‌నిపిస్తార‌ని కొంద‌రు భావిస్తున్నార‌ని.. ఇది ఎంత మాత్రం స‌రికాద‌ని చెప్పారు. ఇలాంటి వారిని మీడియా కూడా బ‌హిష్క‌రించాల‌ని సూచించారు.

స‌క్ర‌మ‌మైన రాజ‌కీయాలు చేసిన వాజ్‌పేయి, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వ‌రాజ్ వంటివారిని దేశం ఇప్ప‌టికీ.. ఎప్ప‌టికీ గుర్తుపెట్టుకుంటుంద‌న్నారు. నేటి త‌రం నాయ‌కులు కూడా ఆ విధానాల‌ను అల‌వ‌రుచుకోవాల‌ని సూచించారు.

ఆరోగ్య‌క‌ర‌మైన ల‌క్ష‌ణాలు ఉంటే.. రాజకీయాలు కూడా ఆరోగ్యంగానే ఉంటాయ‌ని చెప్పారు. కానీ, ప్ర‌స్తుతం ఇదే లోపించింద‌న్నారు. దీంతో స‌క్ర‌మంగా మాట్లాడ‌లేని నాయ‌కులు “తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడే దుస్థితి వచ్చింది“ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకో ప‌రిమితం అయింద‌ని తాను చెప్ప‌డం లేద‌న్నారు.

అన్ని పార్టీల్లోనూ ఇదే జాడ్యం కొన‌సాగుతోంద‌న్నారు. అన‌వ‌స‌రంగా నోరు చేసుకునే వారికి .. ప్ర‌జ‌లు నిశ్శ‌బ్దంగా ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో బుద్ధి చెప్పాల‌ని సూచించారు. త‌మ హ‌యాంలో రాజ‌కీయ నేత‌ల నుంచి అనేక విష‌యాలు నేర్చుకునే ప‌రిస్థితి ఉండేద‌న్న ఆయ‌న‌.. ఇప్పుడున్న నేత‌ల నుంచి బూతులు నేర్చుకునే ప‌రిస్థితి భావి త‌రాల‌కు ఏర్ప‌డింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ సంస్కృతిని మార్చుకోవాల్సిన అవ‌స‌రం నాయ‌కుల‌పై ఉంద‌ని, వారు మార‌క‌పోతే.. వారిని మార్చాల్సిన అవ‌స‌రం ప్ర‌జ‌ల‌పైనే ఉంటుంద‌న్నారు.

This post was last modified on February 7, 2026 11:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబు `లైట్` తీసుకుంటే… న‌ష్టం త‌ప్ప‌దా?!

ఏముందిలే.. అని లైట్ తీసుకుంటే.. రాజ‌కీయాల్లో కుదిరే ప‌నికాదు. ఏ విష‌యాన్న‌యినా.. సీరియ‌స్‌గానే తీసుకోవాలి.. సిన్సియర్‌గానే ఆలోచించాలి. లేక‌పోతే.. ఇబ్బందులు…

2 hours ago

మా మంచి ఎమ్మెల్యే.. ఈ మాట‌ను కాపాడుకోవాలి …!

మా మంచి ఎమ్మెల్యే- ఈ మాట చాలా త‌క్కువ నియోజ‌క‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల సంతృప్తి - అసంతృప్తి…

5 hours ago

జనసేనను వదిలే ప్రసక్తే లేదంటున్న బాలినేని

మాజీ మంత్రి, జ‌న‌సేన నాయ‌కుడు బాలినేని శ్రీనివాస‌రెడ్డి తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన పార్టీలో తాను ఎలాంటి ప‌ద‌వులూ…

6 hours ago

మతిపోయే రేటు చెబుతున్న రామాయణ ?

రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న రామాయణ దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఆ మధ్య వచ్చిన టీజర్ కు మిశ్రమ…

8 hours ago

జ‌గ‌న్‌ను వారెందుకు క‌లిశారు: లోకేష్ ఆరా

మ‌నం ఎంతో పార‌దర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం. ఎవ‌రికీ ఎలాంటిఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా.. జ‌గ‌న్‌ను కొంద‌రు క‌లుస్తున్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతోంది..?…

8 hours ago

జగన్ రైటు… జనమే రాంగా?

ఏపీ రాజ‌ధాని విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌క్కా క్లారిటీతోనే ఉన్నారా? అంటే.. ఔన‌నే ఆయ‌న చెబుతున్నారు. ప్ర‌జ‌లు మెచ్చుతారా..…

9 hours ago