ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం రేపిన రాజకీయ దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ తమకు అనుకూలంగా ఉంది అంటే తమకు అనుకూలం అంటూ వైసీపీ, టీడీపీ నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు.
గతంలోనూ ఇప్పుడు కూడా అనేకసార్లు తిరుమల వెంకన్న తమ కులదైవం అని సీఎం చంద్రబాబు ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే, చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ లాజిక్ మిస్సయిన వైనంపై ట్రోలింగ్ జరుగుతోంది.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు..కౌంటర్లు సహజం. అయితే, కనీస లాజిక్ లేకుండా ఇచ్చే కౌంటర్లు నవ్వుల పాలవుతుంటాయి. గోరంట్ల మాధవ్ చేసిన కామెంట్లు ఆ కోవలోకే వస్తాయి.
వెంకటేశ్వర స్వామి మీద వైఎస్ కుటుంబానికి భక్తి ఎక్కువని, కాబట్టే జగన్ ముత్తాత పేరు వెంకట్ రెడ్డి అని పెట్టుకున్నారని గోరంట్ల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటేనే దేశంలో ఎవరైనా వెంకటేశ్వరుని పేరు పెట్టుకుంటారని అన్నారు.
తమ కులదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పుకునే చంద్రబాబు కుటుంబంలో ఒక్కరికి కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పేరు పెట్టలేదని విమర్శించే క్రమంలో గోరంట్ల ఈ కామెంట్లు చేశారు. వెంకటేశ్వర స్వామి తనకు మాత్రమే దైవమని, తన కుటుంబానికే కులదైవమనే భావనలో చంద్రబాబు ఉన్నారని గోరంట్ల విమర్శించారు.
చంద్రబాబు తండ్రి పేరు ఖర్జూర నాయుడని, చంద్రబాబు తనయుడి పేరు లోకేశ్ అని…ఆయన ఇంట్లో ఎవరికీ వెంకటేశ్వర్లు అనే పేరు ఎందుకు పెట్టలేదని గోరంట్ల ప్రశ్నించారు.
అయితే, జాతకం, పుట్టిన తేదీ, తిథి, నక్షత్రం, వారం ప్రకారం వేద పండితులు లేదా పూజారులు ఒక అక్షరం సూచిస్తారని, దానిని బట్టి పిల్లలకు తల్లిదండ్రులు పేరు పెడతారని, ఈ విషయం గోరంట్లకు తెలియకపోవడం బాధాకరమని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
చంద్రబాబు కుటుంబానికి కుల దైవం వెంకటేశ్వర స్వామి కావడానికి, కుటుంబంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పేర్లు పెట్టకపోవడానికి సంబంధం లేదని అంటున్నారు. ఆ మాటకొస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మతం మారారని, ఆ తర్వాత ఆ కుటుంబంలో ఎవరూ హిందూ ధర్మాన్ని ఫాలో కావడం లేదని గుర్తు చేస్తున్నారు.
This post was last modified on February 7, 2026 4:56 pm
2029లో జరిగే ఎన్నికలకు సంబంధించి వైసీపీ, టీడీపీలు ఇప్పటి నుంచే ఆయుధాలను రెడీ చేసుకుంటు న్నాయా? వాటికి పదును కూడాపెంచుకుంటున్నాయా?…
సోషల్ మీడియా యావలో పడిన చాలా మంది యువకులు, యవతులు తమ ప్రాణాలను కూడా బలి చేసుకుంటున్నారన్నది వాస్తవం. ఇలాంటి…
వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే.. తొలిసారి..…
సినిమా కథలు ఒకలా మొదలై చివరికి ఇంకో స్వరూపం తీసుకోవడం మామూలే. ఐతే మొదట కథ ఇచ్చిన రచయిత అనుమతితో..…
ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపధ్యంలో మరోసారి న్యూక్లియర్ బాంబులపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9…