వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పరామర్శ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లిన సందర్భంగా, ఆయనను చూసేందుకు భారీగా చేరుకున్న కార్యకర్తల్లో ఒకరు గుండెపోటుతో మృతి చెందారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చిల్లకల్లు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త డి. రాంబాబు (45) జోగి రమేష్ నివాస సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
జగన్ పర్యటన సందర్భంగా జనసందోహం పెరగడంతో ఇబ్రహీంపట్నం రింగురోడ్ పరిసరాల్లో కొందరు యువకులు బైకులతో స్టంట్లు చేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో బైక్పై స్టంట్ చేస్తూ రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడును ఢీకొని ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
కొద్ది నెలల కిందట వైయస్ జగన్ చేపట్టిన సత్తెనపల్లి పర్యటనలోనూ ఇటువంటి ఘటనే జరిగింది. జగన్ కాన్వాయ్ లోని ఒక వాహనం వృద్ధుడు మృతి చెందాడు. జగన్ పర్యటనలో భారీగా జన సమీకరణ చేయడం, కార్యకర్తలు హల్చల్ చేయడం పరిపాటిగా మారింది.
ఈ క్రమంలోనే కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం గంటలో ప్రయాణించే దూరాన్ని దాదాపు 6 గంటల పాటు దీర్ఘంగా సాగదీయడం, జనాల్ని తరలించడం వంటివి చేస్తున్నారని, ఆ కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
This post was last modified on February 6, 2026 5:45 pm
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…