వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పరామర్శ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లిన సందర్భంగా, ఆయనను చూసేందుకు భారీగా చేరుకున్న కార్యకర్తల్లో ఒకరు గుండెపోటుతో మృతి చెందారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చిల్లకల్లు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త డి. రాంబాబు (45) జోగి రమేష్ నివాస సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
జగన్ పర్యటన సందర్భంగా జనసందోహం పెరగడంతో ఇబ్రహీంపట్నం రింగురోడ్ పరిసరాల్లో కొందరు యువకులు బైకులతో స్టంట్లు చేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో బైక్పై స్టంట్ చేస్తూ రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడును ఢీకొని ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
కొద్ది నెలల కిందట వైయస్ జగన్ చేపట్టిన సత్తెనపల్లి పర్యటనలోనూ ఇటువంటి ఘటనే జరిగింది. జగన్ కాన్వాయ్ లోని ఒక వాహనం వృద్ధుడు మృతి చెందాడు. జగన్ పర్యటనలో భారీగా జన సమీకరణ చేయడం, కార్యకర్తలు హల్చల్ చేయడం పరిపాటిగా మారింది.
ఈ క్రమంలోనే కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం గంటలో ప్రయాణించే దూరాన్ని దాదాపు 6 గంటల పాటు దీర్ఘంగా సాగదీయడం, జనాల్ని తరలించడం వంటివి చేస్తున్నారని, ఆ కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
This post was last modified on February 6, 2026 5:45 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…