ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి కల్యాణ్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ నుంచి ఇతర నాయకుల వరకు కూడా పవన్ను టార్గెట్గా చేసుకుని దూకుడు వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం.. తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేసేందుకు రెడీ కావడమేనని తెలుస్తోంది.
ఈ నెల 11న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వాస్తవానికి జనసేన నేరుగా తలపడాలని నిర్ణయించుకుంది. కొత్త కమిటీలను వేసి.. పార్టీ పరంగా అభ్యర్థులను కూడా ఖరారు చేసుకునే బాధ్యతలను నాయకులకు అప్పగించింది. అయితే.. ఆ సమయంలో పవన్పై ఎవరూ కామెంట్లు చేయలేదు. పైగా ఒకరిద్దరు నాయకులు ఏ పార్టీ అయినా.. పోటీ చేసేందుకు అభ్యంతరం లేదన్నారు.
ఇదే సమయంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-జనసేనల మధ్య ఒక అవగాహనకుదిరింది. దీని ప్రకారం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసేన అభ్యర్థులతో పాటు బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ నెల 7-8 తేదీల్లో ఆయన తెలంగాణలో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ భగ్గు మనడానికి రీజన్గా మారింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నుంచి ఇతర నాయకుల వరకు కూడా.. జనసేనను టార్గెట్ చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు తెరమీదికి తీసుకువస్తున్నారు. “పవన్ కల్యాణ్ను పవన్ కాదు.. దిష్టికల్యాణ్“ అని సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ బీజేపీ భిక్షాం దేహీ అని పవన్ ముందు మోకరిల్లిందని.. ఎద్దేవా చేశారు. అంతేకాదు.. పవన్ కేవలం ఏపీ నాయకుడని, ఆయన గతంలో తెలంగాణ భాష, యాస గురించి నీచంగా మాట్లాడారని.. కూడా నాయకులు గుర్తు చేయడం గమనార్హం.
బుధవారం మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేయగా.. గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అదే రేంజ్లో జనసేనపై విమర్శలు గుప్పించారు. అయితే.. కాంగ్రెస్ చేస్తున్న ఈ విమర్శలను జనసేన నాయకులు అదే రీతిగా ఖండిస్తున్నారు. జనసేన పార్టీ ఏపీది మాత్రమే కాదని.. అది జాతీయ సమగ్రత కోసం జనించిన పార్టీగా చెబుతున్నారు. మొత్తానికి ఈ వివాదం ఎటు దారి తీస్తుందన్నది చూడాలి.
This post was last modified on February 6, 2026 7:18 am
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్లో రీల్ తీసుకునేందుకు…
మలయాళంలో చాలా మంచి పేరున్న స్టార్ హీరోల్లో నివిన్ పౌలీ ఒకడు. స్టార్ హీరో అన్న అహం లేకుండా చాలా…
సినిమా నచ్చితే మరోసారి చూడటం, టికెట్లు దొరకకపోతే మరో షోకు వెళ్లడం చూస్తుంటాం. కానీ తమకు కావాల్సిన సినిమాను థియేటర్…