ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి కల్యాణ్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ నుంచి ఇతర నాయకుల వరకు కూడా పవన్ను టార్గెట్గా చేసుకుని దూకుడు వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం.. తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేసేందుకు రెడీ కావడమేనని తెలుస్తోంది.
ఈ నెల 11న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వాస్తవానికి జనసేన నేరుగా తలపడాలని నిర్ణయించుకుంది. కొత్త కమిటీలను వేసి.. పార్టీ పరంగా అభ్యర్థులను కూడా ఖరారు చేసుకునే బాధ్యతలను నాయకులకు అప్పగించింది. అయితే.. ఆ సమయంలో పవన్పై ఎవరూ కామెంట్లు చేయలేదు. పైగా ఒకరిద్దరు నాయకులు ఏ పార్టీ అయినా.. పోటీ చేసేందుకు అభ్యంతరం లేదన్నారు.
ఇదే సమయంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-జనసేనల మధ్య ఒక అవగాహనకుదిరింది. దీని ప్రకారం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసేన అభ్యర్థులతో పాటు బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ నెల 7-8 తేదీల్లో ఆయన తెలంగాణలో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ భగ్గు మనడానికి రీజన్గా మారింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నుంచి ఇతర నాయకుల వరకు కూడా.. జనసేనను టార్గెట్ చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు తెరమీదికి తీసుకువస్తున్నారు. “పవన్ కల్యాణ్ను పవన్ కాదు.. దిష్టికల్యాణ్“ అని సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ బీజేపీ భిక్షాం దేహీ అని పవన్ ముందు మోకరిల్లిందని.. ఎద్దేవా చేశారు. అంతేకాదు.. పవన్ కేవలం ఏపీ నాయకుడని, ఆయన గతంలో తెలంగాణ భాష, యాస గురించి నీచంగా మాట్లాడారని.. కూడా నాయకులు గుర్తు చేయడం గమనార్హం.
బుధవారం మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేయగా.. గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అదే రేంజ్లో జనసేనపై విమర్శలు గుప్పించారు. అయితే.. కాంగ్రెస్ చేస్తున్న ఈ విమర్శలను జనసేన నాయకులు అదే రీతిగా ఖండిస్తున్నారు. జనసేన పార్టీ ఏపీది మాత్రమే కాదని.. అది జాతీయ సమగ్రత కోసం జనించిన పార్టీగా చెబుతున్నారు. మొత్తానికి ఈ వివాదం ఎటు దారి తీస్తుందన్నది చూడాలి.
This post was last modified on February 6, 2026 7:18 am
బాలీవుడ్లో వచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ విక్కీ డోనర్ చూసిన ప్రేక్షకులు ఎవ్వరూ అందులో డాక్టర్ గా కీలక పాత్ర…
ఆరేళ్ల ముందు కొవిడ్ టైంలో థియేటర్లు మూతపడడంతో.. ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఒక్కసారిగా ఓటీటీలు విజృంభించేశాయి. ఫిలిం…
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…