Political News

కాంగ్రెస్ నేత‌ల‌కు రేవంత్ క్లాస్?

తెలంగాణ‌లో జ‌రుగుతున్న మునిసిప‌ల్, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని క‌మిటీల‌ను నియ‌మించింది. మ‌రో నాలుగు రోజుల్లోనే ఈ ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యానికి తోడు మెజారిటీ మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ నేత‌లు.. అసంతృప్తితో ఉన్నారు. త‌మ‌కు అవ‌కాశం చిక్క‌లేద‌ని భావిస్తున్నావారు.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అనుకుంటున్న‌వారు.. అల‌క వ‌హిస్తున్నారు.

అయితే.. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి వారిని బుజ్జ‌గించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ.. ఆదిశ‌గా ఇంకా కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌లేదు. పైగా.. చాలా జిల్లాల్లో ఇంకా నాయ‌కులు ప్ర‌చారాన్ని ముమ్మరం చేయ‌లేదు. కేవ‌లం పోటీలో ఉన్న అభ్య‌ర్థులు మాత్ర‌మే ప్ర‌చారానికి ప‌రిమితం అవుతున్నారు. ఈ విష‌యంపై పార్టీ ఇంటెలిజెన్స్ వ‌ర్గాల‌తో స‌మాచారం తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నాయ‌కుల తీరుపై మండిప‌డిన‌ట్టు తెలిసింది.

“ఇదేం ప‌ద్ధ‌తి.. ఇలా అయితే, గెలుస్తామా? మీరెందుకు మౌనంగా ఉంటున్నారు. బీఆర్ఎస్‌ను ఎందుకు ఎండ‌గ‌ట్ట‌లేక పోతున్నారు.. ఈ ఎన్నిక‌లు అత్యంత కీల‌క‌మ‌ని చెప్పిన త‌ర్వాత కూడా.. ఎందుకు మీరు ఉదాసీనంగా ఉంటున్నారు.“అని ఘాటుగానే కొంద‌రు నాయ‌కుల‌ను ప్ర‌శ్నించారు. ఈ చ‌ర్చ‌ల్లో టీపీసీసీ చీఫ్ నుంచి కూడా కొంత స‌మాచారం రాబ‌ట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏయే జిల్లాల్లో ఇంకా ప్ర‌చారం ముమ్మ‌రం కాలేద‌ని ప్ర‌శ్నించారు.

ఆయా.. అంశాల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న రేవంత్ రెడ్డి.. స‌ద‌రు నాయ‌కుల‌కు ఫోన్ చేసి.. హెచ్చ‌రించాల‌ని పార్టీ ప‌రంగా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల్సిందేన‌ని తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి జిల్లాల ప‌ర్య‌ట‌న పెట్టుకుని.. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్నారు. ఇంత బిజీలోనూ ఆయ‌న రాత్రి 10-12 గంట‌ల మ‌ధ్య ఇంట్లోనే పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చిస్తున్నార‌ని తెలిసిందే. ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌నిచేయ‌ని నాయ‌కుల‌పై ఆయ‌న సీరియ‌స్ అయ్యార‌ని తెలిసింది.

This post was last modified on February 6, 2026 10:01 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

33 minutes ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

2 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

3 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

5 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

10 hours ago

మోడీపై సీనియర్ నటుడి ఊహించ‌ని ఎలివేషన్

సినిమా వాళ్ల‌కు రాజ‌కీయ ఆస‌క్తులు, అభిమానాలు ఉండ‌డం కొత్త కాదు. అందులో త‌ప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజ‌కీయాల…

10 hours ago