తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని కమిటీలను నియమించింది. మరో నాలుగు రోజుల్లోనే ఈ ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యానికి తోడు మెజారిటీ మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ నేతలు.. అసంతృప్తితో ఉన్నారు. తమకు అవకాశం చిక్కలేదని భావిస్తున్నావారు.. తమను పట్టించుకోవడం లేదని అనుకుంటున్నవారు.. అలక వహిస్తున్నారు.
అయితే.. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి వారిని బుజ్జగించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ.. ఆదిశగా ఇంకా కార్యాచరణ చేపట్టలేదు. పైగా.. చాలా జిల్లాల్లో ఇంకా నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేయలేదు. కేవలం పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రమే ప్రచారానికి పరిమితం అవుతున్నారు. ఈ విషయంపై పార్టీ ఇంటెలిజెన్స్ వర్గాలతో సమాచారం తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నాయకుల తీరుపై మండిపడినట్టు తెలిసింది.
“ఇదేం పద్ధతి.. ఇలా అయితే, గెలుస్తామా? మీరెందుకు మౌనంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ను ఎందుకు ఎండగట్టలేక పోతున్నారు.. ఈ ఎన్నికలు అత్యంత కీలకమని చెప్పిన తర్వాత కూడా.. ఎందుకు మీరు ఉదాసీనంగా ఉంటున్నారు.“అని ఘాటుగానే కొందరు నాయకులను ప్రశ్నించారు. ఈ చర్చల్లో టీపీసీసీ చీఫ్ నుంచి కూడా కొంత సమాచారం రాబట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏయే జిల్లాల్లో ఇంకా ప్రచారం ముమ్మరం కాలేదని ప్రశ్నించారు.
ఆయా.. అంశాలను సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి.. సదరు నాయకులకు ఫోన్ చేసి.. హెచ్చరించాలని పార్టీ పరంగా.. ప్రజల మధ్యకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పినట్టు సమాచారం.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన పెట్టుకుని.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇంత బిజీలోనూ ఆయన రాత్రి 10-12 గంటల మధ్య ఇంట్లోనే పార్టీ నాయకులతో చర్చిస్తున్నారని తెలిసిందే. ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఈ క్రమంలోనే పనిచేయని నాయకులపై ఆయన సీరియస్ అయ్యారని తెలిసింది.
This post was last modified on February 6, 2026 10:01 am
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…