తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని కమిటీలను నియమించింది. మరో నాలుగు రోజుల్లోనే ఈ ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యానికి తోడు మెజారిటీ మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ నేతలు.. అసంతృప్తితో ఉన్నారు. తమకు అవకాశం చిక్కలేదని భావిస్తున్నావారు.. తమను పట్టించుకోవడం లేదని అనుకుంటున్నవారు.. అలక వహిస్తున్నారు.
అయితే.. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి వారిని బుజ్జగించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ.. ఆదిశగా ఇంకా కార్యాచరణ చేపట్టలేదు. పైగా.. చాలా జిల్లాల్లో ఇంకా నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేయలేదు. కేవలం పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రమే ప్రచారానికి పరిమితం అవుతున్నారు. ఈ విషయంపై పార్టీ ఇంటెలిజెన్స్ వర్గాలతో సమాచారం తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నాయకుల తీరుపై మండిపడినట్టు తెలిసింది.
“ఇదేం పద్ధతి.. ఇలా అయితే, గెలుస్తామా? మీరెందుకు మౌనంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ను ఎందుకు ఎండగట్టలేక పోతున్నారు.. ఈ ఎన్నికలు అత్యంత కీలకమని చెప్పిన తర్వాత కూడా.. ఎందుకు మీరు ఉదాసీనంగా ఉంటున్నారు.“అని ఘాటుగానే కొందరు నాయకులను ప్రశ్నించారు. ఈ చర్చల్లో టీపీసీసీ చీఫ్ నుంచి కూడా కొంత సమాచారం రాబట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏయే జిల్లాల్లో ఇంకా ప్రచారం ముమ్మరం కాలేదని ప్రశ్నించారు.
ఆయా.. అంశాలను సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి.. సదరు నాయకులకు ఫోన్ చేసి.. హెచ్చరించాలని పార్టీ పరంగా.. ప్రజల మధ్యకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పినట్టు సమాచారం.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన పెట్టుకుని.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇంత బిజీలోనూ ఆయన రాత్రి 10-12 గంటల మధ్య ఇంట్లోనే పార్టీ నాయకులతో చర్చిస్తున్నారని తెలిసిందే. ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఈ క్రమంలోనే పనిచేయని నాయకులపై ఆయన సీరియస్ అయ్యారని తెలిసింది.
This post was last modified on February 6, 2026 10:01 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…