తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని కమిటీలను నియమించింది. మరో నాలుగు రోజుల్లోనే ఈ ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యానికి తోడు మెజారిటీ మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ నేతలు.. అసంతృప్తితో ఉన్నారు. తమకు అవకాశం చిక్కలేదని భావిస్తున్నావారు.. తమను పట్టించుకోవడం లేదని అనుకుంటున్నవారు.. అలక వహిస్తున్నారు.
అయితే.. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి వారిని బుజ్జగించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ.. ఆదిశగా ఇంకా కార్యాచరణ చేపట్టలేదు. పైగా.. చాలా జిల్లాల్లో ఇంకా నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేయలేదు. కేవలం పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రమే ప్రచారానికి పరిమితం అవుతున్నారు. ఈ విషయంపై పార్టీ ఇంటెలిజెన్స్ వర్గాలతో సమాచారం తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నాయకుల తీరుపై మండిపడినట్టు తెలిసింది.
“ఇదేం పద్ధతి.. ఇలా అయితే, గెలుస్తామా? మీరెందుకు మౌనంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ను ఎందుకు ఎండగట్టలేక పోతున్నారు.. ఈ ఎన్నికలు అత్యంత కీలకమని చెప్పిన తర్వాత కూడా.. ఎందుకు మీరు ఉదాసీనంగా ఉంటున్నారు.“అని ఘాటుగానే కొందరు నాయకులను ప్రశ్నించారు. ఈ చర్చల్లో టీపీసీసీ చీఫ్ నుంచి కూడా కొంత సమాచారం రాబట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏయే జిల్లాల్లో ఇంకా ప్రచారం ముమ్మరం కాలేదని ప్రశ్నించారు.
ఆయా.. అంశాలను సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి.. సదరు నాయకులకు ఫోన్ చేసి.. హెచ్చరించాలని పార్టీ పరంగా.. ప్రజల మధ్యకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పినట్టు సమాచారం.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన పెట్టుకుని.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇంత బిజీలోనూ ఆయన రాత్రి 10-12 గంటల మధ్య ఇంట్లోనే పార్టీ నాయకులతో చర్చిస్తున్నారని తెలిసిందే. ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఈ క్రమంలోనే పనిచేయని నాయకులపై ఆయన సీరియస్ అయ్యారని తెలిసింది.
This post was last modified on February 6, 2026 10:01 am
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం.. తిరుపతిలోని కుప్పంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి సైలెంట్గా చుట్టేస్తున్నారు. ప్రతి రెండు…
అయోధ్య రామాలయం ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో ఉంది కదా. మరి ఈ రామాలయం.. అది కూడా ఓ ముస్లిం కట్టిన…
తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం…
తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి,…
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…