Political News

మోడి సర్కార్ రివర్సులో నడుస్తోందా ?

అవును మీరు చదివింది నిజమే. నూతన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో ఎంత ఉద్యమం జరుగుతోందో అందరు చూస్తున్నదే. ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘూ దగ్గర గడచిన 22 రోజులుగా రైతులు పట్టినపట్టు విడవకుండా కేంద్రప్రభుత్వానికి చెమటలు పట్టించేస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో పంజాబ్ లో రైతు సంఘాల ఆధ్వర్యంలో మొదలైన ఆందోళన చివరకు ఉద్యమస్ధాయికి చేరుకున్నది.

మొదట్లో పంజాబ్ లోని రైతులు మాత్రమే స్పందించినా తాజాగా హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని రైతన్నలు కూడా జాయినవుతున్నారు. తొందరలోనే అన్నదాతల ఉద్యమం దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా పాకుతోంది. వివిధ రాష్ట్రాల్లోని రైతుసంఘాలకు ప్రతిపక్షాలు తోడవుతున్నాయి. ఇందుకే మొన్నటి భారత్ బంద్ కూడా సక్సెస్ అయ్యింది. మొదట్లో ఉద్యమాన్ని చాలా తేలిగ్గా తీసుకున్న కేంద్రానకి ఇపుడు ఉద్యమ సెగ బాగా తగులుతోంది.

దానికితోడు ఇప్పటికి నాలుగుసార్లు రైతులు-కేంద్రమంత్రులకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతులు, ఎట్టి పరిస్ధతుల్లోను కుదరదంటూ కేంద్రం ఎవరి పట్టుదలతో వాళ్ళున్నారు. దాంతో కేంద్రానికి ఇబ్బందిగా తయారైంది. అందుకనే నష్ట నివారణకు దిగింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాస్త్రజ్ఞులు, నిపుణులతో చర్చలు మొదలుపెట్టింది. వ్యవసాయ చట్టాలు చేయటానికి ముందు చేయాల్సిన పనిని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పద్దతిలో ఇపుడు చేస్తోంది.

తెలంగాణా సీఎం కేసీయార్, ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డితో హడావుడిగా చర్చలు జరిపింది. తెలుగురాష్ట్రాల్లో రైతు ఉద్యమ ప్రభావం తెలుసుకోవటం, ఉద్యమానికి ప్రభుత్వం తరపున మద్దతు దక్కకుండా చేయటమనే వ్యూహంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను ప్రధానమంత్రి నరేంద్రమోడి రంగంలోకి దింపారు. రెండు రోజుల తర్వాత ఇదే విషయమై ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కూడా అమిత్ భేటీ అవ్వబోతున్నారు. తర్వాత తమిళనాడు సీఎం పళనిస్వామిని కూడా పిలవబోతున్నట్లు సమాచారం.

అంటే ఇక్కడ మూడు వ్యూహాలతో కేంద్రం ముందుకెళుతోంది. ఎలాగూ బీజేపీ పాలిత రాష్ట్రాలను ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు. ఇక రెండోది అవసరానికి వెలుపల నుండి మద్దతిస్తున్న ముఖ్యమంత్రులు అంటే కేసీయార్, జగన్, నవీన్ లాంటి వాళ్ళతో చర్చలు జరపటం. మూడోది కేంద్రాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంటి వాళ్ళని వదిలేయటం. ఇపుడు చేస్తున్న కసరత్తేదో నూతన వ్యవసాయ చట్టాలను చేసేముందే అందరితోను మాట్లాడుంటే ఇపుడీ గొడవలు ఉండేవే కాదు. అందుకనే మోడి సర్కార్ రివర్సులో నడుస్తోందనిపిస్తోంది.

This post was last modified on December 17, 2020 2:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

41 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago