Political News

మోడి సర్కార్ రివర్సులో నడుస్తోందా ?

అవును మీరు చదివింది నిజమే. నూతన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో ఎంత ఉద్యమం జరుగుతోందో అందరు చూస్తున్నదే. ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘూ దగ్గర గడచిన 22 రోజులుగా రైతులు పట్టినపట్టు విడవకుండా కేంద్రప్రభుత్వానికి చెమటలు పట్టించేస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో పంజాబ్ లో రైతు సంఘాల ఆధ్వర్యంలో మొదలైన ఆందోళన చివరకు ఉద్యమస్ధాయికి చేరుకున్నది.

మొదట్లో పంజాబ్ లోని రైతులు మాత్రమే స్పందించినా తాజాగా హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని రైతన్నలు కూడా జాయినవుతున్నారు. తొందరలోనే అన్నదాతల ఉద్యమం దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా పాకుతోంది. వివిధ రాష్ట్రాల్లోని రైతుసంఘాలకు ప్రతిపక్షాలు తోడవుతున్నాయి. ఇందుకే మొన్నటి భారత్ బంద్ కూడా సక్సెస్ అయ్యింది. మొదట్లో ఉద్యమాన్ని చాలా తేలిగ్గా తీసుకున్న కేంద్రానకి ఇపుడు ఉద్యమ సెగ బాగా తగులుతోంది.

దానికితోడు ఇప్పటికి నాలుగుసార్లు రైతులు-కేంద్రమంత్రులకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతులు, ఎట్టి పరిస్ధతుల్లోను కుదరదంటూ కేంద్రం ఎవరి పట్టుదలతో వాళ్ళున్నారు. దాంతో కేంద్రానికి ఇబ్బందిగా తయారైంది. అందుకనే నష్ట నివారణకు దిగింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాస్త్రజ్ఞులు, నిపుణులతో చర్చలు మొదలుపెట్టింది. వ్యవసాయ చట్టాలు చేయటానికి ముందు చేయాల్సిన పనిని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పద్దతిలో ఇపుడు చేస్తోంది.

తెలంగాణా సీఎం కేసీయార్, ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డితో హడావుడిగా చర్చలు జరిపింది. తెలుగురాష్ట్రాల్లో రైతు ఉద్యమ ప్రభావం తెలుసుకోవటం, ఉద్యమానికి ప్రభుత్వం తరపున మద్దతు దక్కకుండా చేయటమనే వ్యూహంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను ప్రధానమంత్రి నరేంద్రమోడి రంగంలోకి దింపారు. రెండు రోజుల తర్వాత ఇదే విషయమై ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కూడా అమిత్ భేటీ అవ్వబోతున్నారు. తర్వాత తమిళనాడు సీఎం పళనిస్వామిని కూడా పిలవబోతున్నట్లు సమాచారం.

అంటే ఇక్కడ మూడు వ్యూహాలతో కేంద్రం ముందుకెళుతోంది. ఎలాగూ బీజేపీ పాలిత రాష్ట్రాలను ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు. ఇక రెండోది అవసరానికి వెలుపల నుండి మద్దతిస్తున్న ముఖ్యమంత్రులు అంటే కేసీయార్, జగన్, నవీన్ లాంటి వాళ్ళతో చర్చలు జరపటం. మూడోది కేంద్రాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంటి వాళ్ళని వదిలేయటం. ఇపుడు చేస్తున్న కసరత్తేదో నూతన వ్యవసాయ చట్టాలను చేసేముందే అందరితోను మాట్లాడుంటే ఇపుడీ గొడవలు ఉండేవే కాదు. అందుకనే మోడి సర్కార్ రివర్సులో నడుస్తోందనిపిస్తోంది.

This post was last modified on December 17, 2020 2:31 pm

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

5 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

8 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

10 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

11 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

11 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

12 hours ago