Political News

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చేయడం వంటి చర్యలు ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇదేం పద్ధతి? అంటూ హైకోర్టు పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. నిందితులను నడిరోడ్డుపై నడిపించడం అంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంది.

ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత? ఎవరు ప్రోత్సహించారు? దీనికి సంబంధించి రూల్స్ ఏమి చెబుతున్నాయి? అనే వివరాలతో డీజీపీ నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. నిందితులను అవహేళనగా మాట్లాడడం కూడా నేరంగానే పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని గుర్తు చేసింది. ఈ మేరకు సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ అండ్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ విజయవాడ జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్ కుమార్ దాఖలు చేసిన పిల్‌పై బుధవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా పలు ఆధారాలను పిటిషనర్ కోర్టు ముందు ఉంచారు. డీజీపీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. దీనిపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. నిందితులను వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్లాల్సిందేనని, ఇతర కారణాలు చెప్పడానికి వీల్లేదని వ్యాఖ్యానించినట్లు పిటిషనర్ తరఫున న్యాయవాది తెలిపారు. ఏదైనా కేసు నమోదైన వెంటనే నిందితుల ఆత్మాభిమానం దెబ్బతినేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని తెలిపారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి కూడా ఏకీభవించారని చెప్పారు.

ప్రభుత్వం మెప్పు పొందేందుకు నిందితుల ప్రాథమిక హక్కులను కాలరాస్తారా? అని పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఆయా ఘటనలు జరిగిన జిల్లాల ఎస్పీలు తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా తెనాలి, గుంటూరు, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లో పోలీసులు నిందితులను వివిధ కారణాలతో నడిరోడ్డుపై నడిపించారు.

This post was last modified on February 4, 2026 4:48 pm

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

3 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

3 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

5 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

7 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

7 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

9 hours ago