Political News

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చేయడం వంటి చర్యలు ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇదేం పద్ధతి? అంటూ హైకోర్టు పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. నిందితులను నడిరోడ్డుపై నడిపించడం అంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంది.

ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత? ఎవరు ప్రోత్సహించారు? దీనికి సంబంధించి రూల్స్ ఏమి చెబుతున్నాయి? అనే వివరాలతో డీజీపీ నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. నిందితులను అవహేళనగా మాట్లాడడం కూడా నేరంగానే పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని గుర్తు చేసింది. ఈ మేరకు సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ అండ్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ విజయవాడ జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్ కుమార్ దాఖలు చేసిన పిల్‌పై బుధవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా పలు ఆధారాలను పిటిషనర్ కోర్టు ముందు ఉంచారు. డీజీపీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. దీనిపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. నిందితులను వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్లాల్సిందేనని, ఇతర కారణాలు చెప్పడానికి వీల్లేదని వ్యాఖ్యానించినట్లు పిటిషనర్ తరఫున న్యాయవాది తెలిపారు. ఏదైనా కేసు నమోదైన వెంటనే నిందితుల ఆత్మాభిమానం దెబ్బతినేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని తెలిపారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి కూడా ఏకీభవించారని చెప్పారు.

ప్రభుత్వం మెప్పు పొందేందుకు నిందితుల ప్రాథమిక హక్కులను కాలరాస్తారా? అని పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఆయా ఘటనలు జరిగిన జిల్లాల ఎస్పీలు తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా తెనాలి, గుంటూరు, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లో పోలీసులు నిందితులను వివిధ కారణాలతో నడిరోడ్డుపై నడిపించారు.

This post was last modified on February 4, 2026 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ బాట‌లో వైసీపీ ఎంపీ?

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. ఎవ‌రికి న‌చ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవ‌డ‌మూ కొత్త‌కాదు. ఎవ‌రికి అవ‌స‌రం.. అవ‌కాశం ఉన్న దిశ‌గా నాయ‌కులు,…

4 hours ago

ఎటు చూసినా… వైసీపీకి ఛాన్స్ లేదా బ్రో?

ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ క‌నిపించ‌డం లేదా? ఏ వ‌ర్గం కూడా వైసీపీకి ఆశించిన మేర‌కు చేరువ అయ్యే అవ‌కాశం…

7 hours ago

జమీల్ సాబ్ భయపడుతున్నారా?

గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…

9 hours ago

బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పు.. ఖాతాదారుడికి వాతలు?

గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…

9 hours ago

ట్యాంక్ బండ్ హీరోకు సీఎం ఆపన్న హస్తం

ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…

10 hours ago

తెలివిగా ప్లాన్ చేసుకుంటున్న జన నాయకుడు

జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…

12 hours ago