Political News

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చేయడం వంటి చర్యలు ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇదేం పద్ధతి? అంటూ హైకోర్టు పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. నిందితులను నడిరోడ్డుపై నడిపించడం అంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంది.

ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత? ఎవరు ప్రోత్సహించారు? దీనికి సంబంధించి రూల్స్ ఏమి చెబుతున్నాయి? అనే వివరాలతో డీజీపీ నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. నిందితులను అవహేళనగా మాట్లాడడం కూడా నేరంగానే పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని గుర్తు చేసింది. ఈ మేరకు సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ అండ్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ విజయవాడ జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్ కుమార్ దాఖలు చేసిన పిల్‌పై బుధవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా పలు ఆధారాలను పిటిషనర్ కోర్టు ముందు ఉంచారు. డీజీపీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. దీనిపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. నిందితులను వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్లాల్సిందేనని, ఇతర కారణాలు చెప్పడానికి వీల్లేదని వ్యాఖ్యానించినట్లు పిటిషనర్ తరఫున న్యాయవాది తెలిపారు. ఏదైనా కేసు నమోదైన వెంటనే నిందితుల ఆత్మాభిమానం దెబ్బతినేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని తెలిపారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి కూడా ఏకీభవించారని చెప్పారు.

ప్రభుత్వం మెప్పు పొందేందుకు నిందితుల ప్రాథమిక హక్కులను కాలరాస్తారా? అని పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఆయా ఘటనలు జరిగిన జిల్లాల ఎస్పీలు తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా తెనాలి, గుంటూరు, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లో పోలీసులు నిందితులను వివిధ కారణాలతో నడిరోడ్డుపై నడిపించారు.

This post was last modified on February 4, 2026 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

43 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

46 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

1 hour ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago