Political News

‘జగన్ కు అధికారంలో రెడ్లు.. లేనపుడు కాపులు కావాలి’

జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ అంశంపై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు గుర్తొస్తారు.. అధికారం పోగానే కాపులు గుర్తుకొస్తారని ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం వేగంగా కొనసాగుతుండటాన్ని తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ అభద్రతాభావంతో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నంతకాలం తన తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని జగన్ గుర్తించలేదని, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కాపు అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని క్రాంతి విమర్శించారు. అంబటి రాంబాబు అంశాన్ని ముందుకు తెచ్చి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇదే తరహాలో రేపు తన తండ్రిని కూడా బలిపశువుగా మార్చరనే గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు.

తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొన్నా, అసలేమీ జరగనట్టు వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యంగా ఉందన్నారు. సుమారు 60 లక్షల కిలోల నెయ్యి హానికర రసాయనాలతో తయారైనట్టు ఛార్జ్‌షీట్‌లో ఉందని, దీనిని దారి మళ్లించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

This post was last modified on February 4, 2026 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

41 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

44 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

1 hour ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago