జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ అంశంపై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు గుర్తొస్తారు.. అధికారం పోగానే కాపులు గుర్తుకొస్తారని ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం వేగంగా కొనసాగుతుండటాన్ని తట్టుకోలేక వైఎస్సార్సీపీ అధినేత జగన్ అభద్రతాభావంతో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంతకాలం తన తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని జగన్ గుర్తించలేదని, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కాపు అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని క్రాంతి విమర్శించారు. అంబటి రాంబాబు అంశాన్ని ముందుకు తెచ్చి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇదే తరహాలో రేపు తన తండ్రిని కూడా బలిపశువుగా మార్చరనే గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు.
తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని సీబీఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్నా, అసలేమీ జరగనట్టు వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యంగా ఉందన్నారు. సుమారు 60 లక్షల కిలోల నెయ్యి హానికర రసాయనాలతో తయారైనట్టు ఛార్జ్షీట్లో ఉందని, దీనిని దారి మళ్లించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
This post was last modified on February 4, 2026 10:41 am
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…