Political News

‘జగన్ కు అధికారంలో రెడ్లు.. లేనపుడు కాపులు కావాలి’

జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ అంశంపై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు గుర్తొస్తారు.. అధికారం పోగానే కాపులు గుర్తుకొస్తారని ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం వేగంగా కొనసాగుతుండటాన్ని తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ అభద్రతాభావంతో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నంతకాలం తన తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని జగన్ గుర్తించలేదని, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కాపు అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని క్రాంతి విమర్శించారు. అంబటి రాంబాబు అంశాన్ని ముందుకు తెచ్చి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇదే తరహాలో రేపు తన తండ్రిని కూడా బలిపశువుగా మార్చరనే గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు.

తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొన్నా, అసలేమీ జరగనట్టు వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యంగా ఉందన్నారు. సుమారు 60 లక్షల కిలోల నెయ్యి హానికర రసాయనాలతో తయారైనట్టు ఛార్జ్‌షీట్‌లో ఉందని, దీనిని దారి మళ్లించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

This post was last modified on February 4, 2026 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యాటిట్యూడ్ స్టార్: మృణాల్ తో డేట్.. శ్రీలీలతో పెళ్లట..!

బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…

5 minutes ago

పరీక్షలో కథ రాసిన హీరో.. కట్ చేస్తే..!

డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…

19 minutes ago

ఆ మహిళ తో వీడియోలు వ్యక్తిగత విషయమంటోన్న MLA

తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అది…

24 minutes ago

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

2 hours ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

4 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

6 hours ago