వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ ఖైదు విధిస్తూ.. గుంటూరు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఆయనను రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే.. చిత్రం ఏంటంటే.. గతంలో వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఎక్కడైతే ఉంచారో.. అక్కడే ఇప్పుడు అంబటి కూడా ఉండనున్నారు.
ఈయనే కాదు.. గతంలో అక్రమ మద్యం కేసులో అరెస్టయిన ప్రస్తుత రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని కూడా.. ఆ జైలులోనే 83 రోజులపాటు ఉంచిన విషయం తెలిసిందే. ఇదంతా యాదృచ్ఛికమే అయినా.. చేసిన పాపం ఎక్కడికి పోతుందని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబును జైల్లో పెట్టి ఆనందించిన నాయకులకు అదే చోట జైలు పడుతుండడంపై వారు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక, అంబటి రాంబాబు చెప్పినట్టుగానే.. బెయిల్ కోరలేదు. వాస్తవానికి ఆయన బెయిల్ పిటిషన్ వేసుకుని ఉంటే.. మరోలా జరిగి ఉండేదని అంటున్నారు. ఇదిలావుంటే.. తొలుత న్యాయాధికారి.. ఆయనను గుంటూరు జైలుకే సిఫారసు చేశారు.
కానీ, రాంబాబే.. పట్టుబట్టి తనను రాజమండ్రి జైలుకు పంపించాలని కోరినట్టు తెలిసింది. ఇక, విచారణలోనూ రాంబాబు పెద్దగా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. సీఎం చంద్రబాబుపై దూషణలకు ప్రభుత్వమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు.
ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులను టీడీపీ టార్గెట్ చేస్తోందని.. దీంతో తమ పరిస్థితి ఇబ్బందిగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. ఏదేమైనా.. చేసుకున్న వారికి చేసుకున్నంత.. అన్నట్టుగా నోటి దురుసు మంచిది కాదని.. గత అనుభవాలు వైసీపీకి గుణపాఠంగా మారినా.. నాయకులు మారడం లేదు. మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ను కూడా అరెస్టు చేయనున్నట్టు తెలిసింది. ఆయనపై తాజాగా రాష్ట్రంలో మరో నాలుగు కేసులు నమోదయ్యాయి.
This post was last modified on February 2, 2026 3:47 pm
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…