Political News

బడ్జెట్ ముందు నిర్మలమ్మకు చక్కెర పెరుగు… ఎందుకిలా?

ప్రతి ఏటా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోయే కొన్ని ఘడియల ముందు దేశ రాష్ట్రపతి ఆమెకు చక్కెర కలిపిన పెరుగు (దహి – చక్కర్) తినిపించడం ఆనవాయితీ. అయితే దీని వెనుక కారణం ఏంటని చాలామందికి సందేశం కలగక మానదు.

ఇది మన భారతదేశ సాంప్రదాయాల్లో ఒకటి. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు హిందూ సాంప్రదాయం ప్రకారం చక్కెర కలిపిన పెరుగును తినిపిస్తారు. ఇలా చేస్తే ఆ పని విజయవంతమవుతుందని ఒక నమ్మకం.

బడ్జెట్ ఒక కీలక కార్యక్రమం. దానిపైన దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. అటువంటి అతిపెద్ద కార్యక్రమం సవ్యంగా జరగాలని స్వయంగా దేశ ప్రథమ పౌరులు, గౌరవ రాష్ట్రపతి గారు తినిపిస్తారు. ఇది కొన్ని దశాబ్దాలుగా నెహ్రూ కాలం నుండి వస్తున్న ఆనవాయితి.

మరి అందరూ ఎదురుచూస్తున్న ఈ సంవత్సరపు ఆర్థిక బడ్జెట్ దేశ ప్రజలకు.. రాష్ట్ర ప్రభుత్వాలకు తీపిగా ఉంటుందో లేదో వేచి చూడాలి.

This post was last modified on February 2, 2026 8:49 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

34 minutes ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

1 hour ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

3 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

4 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

6 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

7 hours ago