ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును అంబటి బూతులు తిట్టిన వైనంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే అంబటిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గుంటూరు పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఆ గొడవపై స్పందించారు. తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నివేదికనిచ్చిందని, అయినా సరే టీడీపీ దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టిందని విమర్శించారు.
అవి తీయమని చెప్పినందుకు తనను బూతులు తిట్టారని, దుర్భాషలాడారని, నానా హంగామా చేశారని అన్నారు. తాను చంద్రబాబును బూతులు తిట్టలేదని చెప్పారు. కేవలం తనను తిట్టిన వారినే తాను తిరిగి తిట్టానని, అలా వారిని తిట్టడం కూడా తన అంతరాత్మకు తప్పనిపించిందని అన్నారు.
అయినా సరే, ఆవేశంలో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, తిట్టకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు నుంచి ఆదేశం వచ్చిందని, తనను అరెస్ట్ చేస్తారని, ఆ విషయం తనకు తెలుసని చెప్పారు.
అయితే, ఐ డోంట్ కేర్….అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి..నేను సిద్ధంగా ఉన్నా అంటూ అంబటి సవాల్ విసిరారు. అయినా, ఏపీలో చట్టం లేదని, అంతా రెడ్ బుక్ పాలనేనని, పోలీస్ రాజ్యంగమే నడుస్తోందని విమర్శించారు. తనను తిట్టి తనపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయలేదని, తనపై దాడి జరుగుతుంటే చోద్యం చూస్తూ నిలుచున్నారని ఆరోపించారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…
కరోనా తర్వాత ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్, స్కామ్ 1992 లాంటి బ్లాక్ బస్టర్స్ వల్ల కొంత కాలం వెబ్ సిరీస్…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా నెట్ ఫ్లిక్స్ చేసుకునే ఓటిటి విండో 28 రోజులు ఉంటుంది. గుంటూరు కారం,…
తెలంగాణలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు…