బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా కార్తీక దీపం సీరియల్ లెక్క ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉందని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు సెటైర్లు కూడా వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు రెడీ అయ్యారని తెలుస్తోంది.
మరి కాసేపట్లో ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ కు సిట్ అధికారులు వెళ్లబోతున్నారని, అక్కడే ఆయనకు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. అంతేకాదు, ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లోనే కేసీఆర్ ను రేపు సిట్ అధికారులు
విచారణ చేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
వాస్తవానికి, హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ ల తర్వాత కవితను సిట్ అధికారులు విచారణకు పిలుస్తారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా కేసీఆర్ పేరు తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఓ వైపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…