ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్ సమావేశాలపై మంత్రులతో చర్చించారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు అందాయని, దీనిపై కసరత్తు కూడా పూర్తి కావొచ్చిందని అధికారులు వివరించారు. దీంతో వచ్చే నెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తే బాగుంటుందన్న సీఎం చంద్రబాబు సూచనలకు మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే ఈ సమావేశాలను ఎన్ని రోజులు జరపాలన్న విషయంపై సభ ప్రారంభించిన రోజు బీఏసీలో నిర్ణయించనున్నారు.
ఇక బడ్జెట్ సమావేశాల్లో ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2026–27 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో బడ్జెట్తో పాటు పలు కీలక బిల్లులను కూడా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిపై కూడా సీఎం చంద్రబాబు మంత్రివర్గంతో చర్చించారు. వీటిలో ప్రధానంగా గత కొంతకాలంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెబుతున్న అంశానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంతో పాటు వారి వేతనాలు, భత్యాలను నిలుపుదల చేసేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాల్లో ఎక్కడా క్లాజ్ లేదు. అదేవిధంగా రాజ్యాంగంలోనూ ఎక్కడా ఈ విషయాన్ని చేర్చలేదు. రాజ్యాంగ నిర్మాతలు అసలు ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారని ఊహించి ఉండరు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులు బాధ్యతతో ఉంటారనే అంచనాతోనే వారి గైర్హాజరు, జీతాలు, భత్యాలకు సంబంధించిన అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు.
ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే ఒక బిల్లును రూపొందించి కేంద్రానికి పంపాలని తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఇది జరిగితే దేశంలో తొలిసారి ఈ తరహా బిల్లును ఆమోదించి పంపిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది. తద్వారా కేంద్రం కూడా ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని గైర్హాజరయ్యే ఎమ్మెల్యేలపై చర్యలకు అనుకూలంగా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
This post was last modified on January 29, 2026 8:00 am
రాజమౌళి కంటే ముందు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుతమైన కథలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…