ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్ సమావేశాలపై మంత్రులతో చర్చించారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు అందాయని, దీనిపై కసరత్తు కూడా పూర్తి కావొచ్చిందని అధికారులు వివరించారు. దీంతో వచ్చే నెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తే బాగుంటుందన్న సీఎం చంద్రబాబు సూచనలకు మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే ఈ సమావేశాలను ఎన్ని రోజులు జరపాలన్న విషయంపై సభ ప్రారంభించిన రోజు బీఏసీలో నిర్ణయించనున్నారు.
ఇక బడ్జెట్ సమావేశాల్లో ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2026–27 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో బడ్జెట్తో పాటు పలు కీలక బిల్లులను కూడా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిపై కూడా సీఎం చంద్రబాబు మంత్రివర్గంతో చర్చించారు. వీటిలో ప్రధానంగా గత కొంతకాలంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెబుతున్న అంశానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంతో పాటు వారి వేతనాలు, భత్యాలను నిలుపుదల చేసేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాల్లో ఎక్కడా క్లాజ్ లేదు. అదేవిధంగా రాజ్యాంగంలోనూ ఎక్కడా ఈ విషయాన్ని చేర్చలేదు. రాజ్యాంగ నిర్మాతలు అసలు ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారని ఊహించి ఉండరు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులు బాధ్యతతో ఉంటారనే అంచనాతోనే వారి గైర్హాజరు, జీతాలు, భత్యాలకు సంబంధించిన అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు.
ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే ఒక బిల్లును రూపొందించి కేంద్రానికి పంపాలని తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఇది జరిగితే దేశంలో తొలిసారి ఈ తరహా బిల్లును ఆమోదించి పంపిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది. తద్వారా కేంద్రం కూడా ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని గైర్హాజరయ్యే ఎమ్మెల్యేలపై చర్యలకు అనుకూలంగా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
This post was last modified on January 29, 2026 8:00 am
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తొలిరోజు మాత్రమే వచ్చిన వైసీపీ సభ్యులు.. తర్వాత పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో సభకు…
ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు రిలీజ్ కావడం అన్నది రేర్ ఫీట్. తెలుగులో ఈ రికార్డు నందమూరి…
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…