Political News

సంచలన బిల్లు: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్ సమావేశాలపై మంత్రులతో చర్చించారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు అందాయని, దీనిపై కసరత్తు కూడా పూర్తి కావొచ్చిందని అధికారులు వివరించారు. దీంతో వచ్చే నెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తే బాగుంటుందన్న సీఎం చంద్రబాబు సూచనలకు మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే ఈ సమావేశాలను ఎన్ని రోజులు జరపాలన్న విషయంపై సభ ప్రారంభించిన రోజు బీఏసీలో నిర్ణయించనున్నారు.

ఇక బడ్జెట్ సమావేశాల్లో ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2026–27 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో బడ్జెట్‌తో పాటు పలు కీలక బిల్లులను కూడా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిపై కూడా సీఎం చంద్రబాబు మంత్రివర్గంతో చర్చించారు. వీటిలో ప్రధానంగా గత కొంతకాలంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెబుతున్న అంశానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంతో పాటు వారి వేతనాలు, భత్యాలను నిలుపుదల చేసేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాల్లో ఎక్కడా క్లాజ్ లేదు. అదేవిధంగా రాజ్యాంగంలోనూ ఎక్కడా ఈ విషయాన్ని చేర్చలేదు. రాజ్యాంగ నిర్మాతలు అసలు ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారని ఊహించి ఉండరు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులు బాధ్యతతో ఉంటారనే అంచనాతోనే వారి గైర్హాజరు, జీతాలు, భత్యాలకు సంబంధించిన అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు.

ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే ఒక బిల్లును రూపొందించి కేంద్రానికి పంపాలని తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఇది జరిగితే దేశంలో తొలిసారి ఈ తరహా బిల్లును ఆమోదించి పంపిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది. తద్వారా కేంద్రం కూడా ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని గైర్హాజరయ్యే ఎమ్మెల్యేలపై చర్యలకు అనుకూలంగా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.

Satya

Recent Posts

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…

33 minutes ago

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స…

3 hours ago

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

7 hours ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

8 hours ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

10 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

10 hours ago