Political News

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. వచ్చే నెల 1 (ఆదివారం)న కేంద్ర వార్షిక (2026–27) బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

తొలుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, తరువాత రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను పవన్ కలిశారు. వారికి అరకు కాఫీతో పాటు కొండపల్లి బొమ్మలను కానుకగా అందించారు.

ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో నెలకొన్న సమస్యలను ఎక్కువగా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. రైలు ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. అమృత్ పథకంలో భాగంగా కేంద్రం నిధులు ఇవ్వాలని, పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా మార్చాలని పవన్ కళ్యాణ్ కోరారు.

పిఠాపురంలో నెలకొన్న శక్తిపీఠం పురహూతికా అమ్మవారి విశేషాలను వివరించారు. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతోందని, రాకపోకలకు వీలుగా రైలు కనెక్టివిటీని మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా రైల్ ఓవర్ బ్రిడ్జిలకు కూడా నిధులు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా కేంద్ర మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చించారు.

ఇక హోం మంత్రితో చర్చించిన పవన్ కళ్యాణ్, ఎక్కువగా తమిళనాడు ఎన్నికలపైనే వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే చర్చించినట్టు తెలిపినా, అంతర్గత చర్చల్లో తమిళనాడు రాజకీయాలు, వచ్చే ఎన్నికలు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై పవన్‌తో అమిత్ షా చర్చించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సేవలను బీజేపీ వినియోగించుకునే అవకాశం ఉందని సమాచారం.

This post was last modified on January 29, 2026 6:25 am

Share

Recent Posts

పార్టీ సమస్యలు పట్టించుకోండి సీఎం సార్

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…

12 minutes ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

2 hours ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

6 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

9 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

10 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

11 hours ago