Political News

ఇందుకే టీడీపీని రాజకీయ పాఠశాల అంటారు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మొత్తం 12 విభాగాలుగా విభజించి, వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, నేతలకు పార్టీ విధి విధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై సీనియర్ నాయకులు అవగాహన కల్పించారు.

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. కేంద్ర కమిటీ కార్యాలయంలోని అన్ని గదుల్లోనూ శిక్షణ తరగతులు నిర్వహించారు. పార్టీ భవిష్యత్ దిశ, ప్రజల్లోకి వెళ్లాల్సిన విధానం, రాజకీయ వ్యూహాలపై సీనియర్లు వివరించారు. కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు, నాయకులకు అక్కడే భోజనం, టీ, కాఫీ ఏర్పాట్లు కూడా చేశారు.

ఈ శిక్షణ శిబిరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. లోకేష్ అన్ని గదులకూ తిరుగుతూ శిక్షణ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించారు. కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు.

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఒక గదిలో జరుగుతున్న శిక్షణ తరగతికే పరిమితమయ్యారు. చివరి వరుసలో కుర్చీ వేసుకుని కూర్చొని, ఫోన్‌ను పక్కన పెట్టి పూర్తిగా శ్రద్ధగా తరగతిని వినడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.

ఆ గదిలో టీడీపీ సీనియర్ నేత, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ స్వరూపం, ఎదురయ్యే భవిష్యత్ సవాళ్లు, ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. పుల్లారావు చెప్పిన ప్రతి విషయాన్ని చంద్రబాబు ఆసక్తిగా విన్నారు.

నిజానికి చంద్రబాబు వచ్చాక ఆయనే శిక్షణ ఇవ్వవచ్చని అక్కడున్న చాలామంది భావించారు. కానీ ఆయన పుల్లారావునే కొనసాగించమని చెప్పి, తాను చివరి వరుసలో కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఆ గదిలో ఒక గంభీరమైన వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ ఎలా ఎదిగింది, ఎలా సంచలన నిర్ణయాలు తీసుకుంది, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలా ముందంజలో నిలిచిందన్న అంశాలను కూడా వివరించారు.

ఈ శిక్షణ శిబిరానికి 25 పార్లమెంటరీ కమిటీలకు చెందిన 1100 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. ఇతర కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అవసరం, రాబోయే ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఎలా చేరువ చేయాలి, విజన్ 2047 ను ఎలా అర్థం చేసుకోవాలి వంటి అనేక అంశాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు.

ఈ వర్క్ షాప్ ద్వారా పార్టీ నాయకులకు విధానపరమైన అంశాలపై పూర్తి అవగాహన కల్పించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు స్పష్టమైన దిశను నిర్దేశించారు.

This post was last modified on January 27, 2026 9:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

20 minutes ago

హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అంతా ఉత్తిదేనా?

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…

52 minutes ago

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…

1 hour ago

దురంధర్-2 వాయిదా పడితే..?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…

1 hour ago

మళ్లీ థియేటర్ల హాహాకారాలు

గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…

2 hours ago

అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే.. ఆడుకున్న టీడీపీ నేతలు

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు తొలిరోజు మాత్ర‌మే వ‌చ్చిన వైసీపీ స‌భ్యులు.. త‌ర్వాత పార్టీ అధినేత జ‌గ‌న్ ఆదేశాల‌తో స‌భ‌కు…

4 hours ago