Political News

హమ్మయ్య.. తెలంగాణ గవర్నర్ ప్లస్సే!

బీజేపీయేతర, ఎన్డీయే కూటమియేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు, మంత్రి మండలికి మధ్య తీవ్ర వివాదాలు, విభేదాలు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో గవర్నర్లు తమ తమ ప్రసంగాలను చదవకుండానే వెళ్లిపోయారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా, వారు చేయాలని అనుకున్న పనులు చేశారు.

అయితే దీనికి భిన్నంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యవహరించి అందరినీ సంతోషపరిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యం కూడా అందరికీ తెలిసిందే. దీంతో తెలంగాణలో రాజకీయ వివాదాలు కామన్‌గా మారాయి. పైగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లును ఇప్పటికీ గవర్నర్ ఆమోదించలేదు.

ఇలాంటి వివాదాలు ఉన్నప్పటికీ, తాజాగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగ పాఠాన్ని చదవను అని చెప్పకుండా, ఆసాంతం చదివి రిపబ్లిక్ డే కార్యక్రమానికి వన్నె తెచ్చారు.

సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, సుమారు 22 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న, చేయబోతున్న కార్యక్రమాలను సంపూర్ణంగా వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజా సర్కారు అంటూ సంబోధించిన గవర్నర్, ఇటీవల తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యంగా భాగ్యనగరం స్థాయిని పెంచేలా ఈ డాక్యుమెంట్‌ను రూపొందించారని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని మూడు ఎకానమీ జోన్లుగా విభజించి మూడు కీలక రంగాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని వెల్లడించారు. మేడారం అభివృద్ధికి 251 కోట్ల రూపాయలు కేటాయించామని, రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.

ఈ విధంగా ఎలాంటి వివాదాలు లేకుండా గవర్నర్ గణతంత్ర వేడుకలను ముగించడంతో ప్రభుత్వం ఖుషీ అయ్యింది.

This post was last modified on January 27, 2026 1:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

21 minutes ago

హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అంతా ఉత్తిదేనా?

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…

53 minutes ago

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…

1 hour ago

దురంధర్-2 వాయిదా పడితే..?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…

1 hour ago

మళ్లీ థియేటర్ల హాహాకారాలు

గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…

2 hours ago

అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే.. ఆడుకున్న టీడీపీ నేతలు

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు తొలిరోజు మాత్ర‌మే వ‌చ్చిన వైసీపీ స‌భ్యులు.. త‌ర్వాత పార్టీ అధినేత జ‌గ‌న్ ఆదేశాల‌తో స‌భ‌కు…

4 hours ago