Political News

హమ్మయ్య.. తెలంగాణ గవర్నర్ ప్లస్సే!

బీజేపీయేతర, ఎన్డీయే కూటమియేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు, మంత్రి మండలికి మధ్య తీవ్ర వివాదాలు, విభేదాలు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో గవర్నర్లు తమ తమ ప్రసంగాలను చదవకుండానే వెళ్లిపోయారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా, వారు చేయాలని అనుకున్న పనులు చేశారు.

అయితే దీనికి భిన్నంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యవహరించి అందరినీ సంతోషపరిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యం కూడా అందరికీ తెలిసిందే. దీంతో తెలంగాణలో రాజకీయ వివాదాలు కామన్‌గా మారాయి. పైగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లును ఇప్పటికీ గవర్నర్ ఆమోదించలేదు.

ఇలాంటి వివాదాలు ఉన్నప్పటికీ, తాజాగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగ పాఠాన్ని చదవను అని చెప్పకుండా, ఆసాంతం చదివి రిపబ్లిక్ డే కార్యక్రమానికి వన్నె తెచ్చారు.

సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, సుమారు 22 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న, చేయబోతున్న కార్యక్రమాలను సంపూర్ణంగా వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజా సర్కారు అంటూ సంబోధించిన గవర్నర్, ఇటీవల తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యంగా భాగ్యనగరం స్థాయిని పెంచేలా ఈ డాక్యుమెంట్‌ను రూపొందించారని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని మూడు ఎకానమీ జోన్లుగా విభజించి మూడు కీలక రంగాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని వెల్లడించారు. మేడారం అభివృద్ధికి 251 కోట్ల రూపాయలు కేటాయించామని, రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.

ఈ విధంగా ఎలాంటి వివాదాలు లేకుండా గవర్నర్ గణతంత్ర వేడుకలను ముగించడంతో ప్రభుత్వం ఖుషీ అయ్యింది.

This post was last modified on January 27, 2026 1:47 pm

Share

Recent Posts

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

28 minutes ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

57 minutes ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

1 hour ago

సూర్య పాత్రలో షాకింగ్ ట్విస్టుందా?

తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…

1 hour ago

విజయవాడ మేయర్ రేసుకు పోటాపోటీ

విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…

2 hours ago

విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తున్నారా

నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…

3 hours ago