Political News

హమ్మయ్య.. తెలంగాణ గవర్నర్ ప్లస్సే!

బీజేపీయేతర, ఎన్డీయే కూటమియేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు, మంత్రి మండలికి మధ్య తీవ్ర వివాదాలు, విభేదాలు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో గవర్నర్లు తమ తమ ప్రసంగాలను చదవకుండానే వెళ్లిపోయారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా, వారు చేయాలని అనుకున్న పనులు చేశారు.

అయితే దీనికి భిన్నంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యవహరించి అందరినీ సంతోషపరిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యం కూడా అందరికీ తెలిసిందే. దీంతో తెలంగాణలో రాజకీయ వివాదాలు కామన్‌గా మారాయి. పైగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లును ఇప్పటికీ గవర్నర్ ఆమోదించలేదు.

ఇలాంటి వివాదాలు ఉన్నప్పటికీ, తాజాగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగ పాఠాన్ని చదవను అని చెప్పకుండా, ఆసాంతం చదివి రిపబ్లిక్ డే కార్యక్రమానికి వన్నె తెచ్చారు.

సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, సుమారు 22 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న, చేయబోతున్న కార్యక్రమాలను సంపూర్ణంగా వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజా సర్కారు అంటూ సంబోధించిన గవర్నర్, ఇటీవల తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యంగా భాగ్యనగరం స్థాయిని పెంచేలా ఈ డాక్యుమెంట్‌ను రూపొందించారని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని మూడు ఎకానమీ జోన్లుగా విభజించి మూడు కీలక రంగాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని వెల్లడించారు. మేడారం అభివృద్ధికి 251 కోట్ల రూపాయలు కేటాయించామని, రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.

ఈ విధంగా ఎలాంటి వివాదాలు లేకుండా గవర్నర్ గణతంత్ర వేడుకలను ముగించడంతో ప్రభుత్వం ఖుషీ అయ్యింది.

This post was last modified on January 27, 2026 1:47 pm

Share

Recent Posts

హెచ్చరికలతో సరిపెడితే ఎలా బాబు గారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైఖ‌రి.. పార్టీ నాయ‌కులకు బాగా క‌లిసి వ‌స్తోంద‌న్న‌వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికి రెండు సంవ‌త్స‌రాలుగా చంద్ర‌బాబు.. త‌మ్ముళ్ల‌కు…

24 minutes ago

పార్టీ సమస్యలు పట్టించుకోండి సీఎం సార్

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…

2 hours ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

4 hours ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

8 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

11 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

12 hours ago