Political News

అమ‌రావ‌తి.. కేంద్రాన్ని సోము ఒప్పించ‌గ‌ల‌రా?

“బీజేపీ ప‌రంగా మేం రాజ‌ధాని అమ‌రావ‌తికే క‌ట్టుబ‌డి ఉన్నాం. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి మేం వ్య‌తిరేకం”- ఇదీ తాజాగా ఏపీ బీజేపీ చీఫ్‌.. సోము వీర్రాజు నోటి నుంచి జాలువారిన కీల‌క ప్ర‌క‌ట‌న‌. నేరుగా ఆయ‌న అమ‌రావ‌తి రైతుల మ‌ధ్య‌కే వెళ్లి.. ఈ విష‌యాన్ని చెప్పారు. ఒక ర‌కంగా.. ఇది రైతుల్లో ఉత్సాహం నింపేదే! అయితే.. దీనిలో నిజ‌మెంత‌? రాబోయే తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ను దృష్టి పెట్టుకుని చేసిన ప్ర‌క‌ట‌నా? లేక‌.. నిజంగానే రాజ‌ధానిపై సోముకు వీరావేశం పొంగుకు వ‌చ్చిందా? అనేదే ఇప్పుడు సంశ‌యంగా మారింది. సోము వంటి ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం గూడుక‌ట్టుకున్న నేత నోటి నుంచి వ‌చ్చిన దీనిని తేలిక‌గా తీసుకునే అవ‌కాశం లేదు.

అయితే.. నిజ‌మైనా అయి ఉండాలి. లేదా.. రాజ‌కీయ ఎత్తుగ‌డ అయినా.. అయి ఉండాలి.. అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిలో రెండోదానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్ద‌లు ఇప్ప‌టికే ఏపీ రాజ‌ధాని విష‌యంలో స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న‌ను లిఖిత పూర్వ‌కంగా అఫిడ‌విట్ రూపంలో హైకోర్టుకు తేల్చిచెప్పారు. విభ‌జ‌న చ‌ట్టంలోని ఏ క్యాపిటల్‌ అని ఉంద‌ని.. అంటే..ఒకటే అని అనుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌రోక్షంగా మూడుకు త‌ల‌గొక్కారు. అప్ప‌ట్లో ఇది తీవ్ర గంద‌ర‌గోళానికి గురి చేసింది. దీనిపై రాజ‌ధాని రైతులు తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేశారు. అయితే.. ఆ స‌మ‌యంలో మౌనంగా ఉన్న సోము.. ఇప్పుడు మాత్రం రాజ‌ధానికి తాము ఓకే అంటూ.. ప‌చ్చ జెండా ఊపారు.

ఒక వేళ‌.. సోము చేసిన ప్ర‌క‌ట‌న‌లో రాజ‌కీయ ఎత్తుగ‌డ ఉండి ఉంటే.. ఖ‌చ్చితంగా పార్టీ మ‌రింత‌గా భ్ర‌ష్టు ప‌డుతుంది. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదాకు కేంద్రం మంగ‌ళం పాడింది. నిధుల విష‌యంలోనూ ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇది ఏపీ ప్ర‌జ‌ల సెంటిమెంటును తీవ్రంగా దెబ్బ‌తీస్తోంది. ఇక‌, ఇప్పుడు రాజ‌ధాని విష‌యంలో కేంద్రం ఒక పాట పాడితే.. సోము మ‌రో ఎత్తుగ‌డ ఎత్తుకున్నారు.

రాజ‌ధానిగా ఆయ‌న అమ‌రావ‌తి ఉండాల‌ని నిజ‌మైన ఆకాంక్ష ఉంటే.. ఖ‌చ్చితంగా ఆయ‌న‌కేంద్ర పెద్ద‌ల‌ను ఒప్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. కేంద్ర పెద్ద‌లు ఈ విష‌యంలో అచేత‌నంగా ఉన్నారు. సో.. దీనిని బ‌ట్టి రాజ‌ధాని కోసం.. కేంద్రాన్ని ఒప్పించే బాధ్య‌త‌ను సోము తీసుకుని.. ఇక్క‌డ ప్ర‌జ‌ల క‌ల‌ల‌ను ఆయ‌న సాకారం చేయాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఇది జ‌రిగిన‌ప్పుడే.. సోము చేసిన వ్యాఖ్య‌ల‌పై న‌మ్మ‌కం క‌లుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 15, 2020 10:26 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

7 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

7 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

8 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

9 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

9 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

9 hours ago