“బీజేపీ పరంగా మేం రాజధాని అమరావతికే కట్టుబడి ఉన్నాం. మూడు రాజధానుల నిర్ణయానికి మేం వ్యతిరేకం”- ఇదీ తాజాగా ఏపీ బీజేపీ చీఫ్.. సోము వీర్రాజు నోటి నుంచి జాలువారిన కీలక ప్రకటన. నేరుగా ఆయన అమరావతి రైతుల మధ్యకే వెళ్లి.. ఈ విషయాన్ని చెప్పారు. ఒక రకంగా.. ఇది రైతుల్లో ఉత్సాహం నింపేదే! అయితే.. దీనిలో నిజమెంత? రాబోయే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను దృష్టి పెట్టుకుని చేసిన ప్రకటనా? లేక.. నిజంగానే రాజధానిపై సోముకు వీరావేశం పొంగుకు వచ్చిందా? అనేదే ఇప్పుడు సంశయంగా మారింది. సోము వంటి ఆర్ ఎస్ ఎస్ భావజాలం గూడుకట్టుకున్న నేత నోటి నుంచి వచ్చిన దీనిని తేలికగా తీసుకునే అవకాశం లేదు.
అయితే.. నిజమైనా అయి ఉండాలి. లేదా.. రాజకీయ ఎత్తుగడ అయినా.. అయి ఉండాలి.. అంటున్నారు పరిశీలకులు. దీనిలో రెండోదానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు ఇప్పటికే ఏపీ రాజధాని విషయంలో స్పష్టమైన ప్రకటనను లిఖిత పూర్వకంగా అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తేల్చిచెప్పారు. విభజన చట్టంలోని ఏ క్యాపిటల్ అని ఉందని.. ఏ అంటే..ఒకటే అని అనుకోవాల్సిన అవసరం లేదని పరోక్షంగా మూడుకు తలగొక్కారు. అప్పట్లో ఇది తీవ్ర గందరగోళానికి గురి చేసింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే.. ఆ సమయంలో మౌనంగా ఉన్న సోము.. ఇప్పుడు మాత్రం రాజధానికి తాము ఓకే అంటూ.. పచ్చ జెండా ఊపారు.
ఒక వేళ.. సోము చేసిన ప్రకటనలో రాజకీయ ఎత్తుగడ ఉండి ఉంటే.. ఖచ్చితంగా పార్టీ మరింతగా భ్రష్టు పడుతుంది. ఇప్పటికే ప్రత్యేక హోదాకు కేంద్రం మంగళం పాడింది. నిధుల విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఇది ఏపీ ప్రజల సెంటిమెంటును తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇక, ఇప్పుడు రాజధాని విషయంలో కేంద్రం ఒక పాట పాడితే.. సోము మరో ఎత్తుగడ ఎత్తుకున్నారు.
రాజధానిగా ఆయన అమరావతి ఉండాలని నిజమైన ఆకాంక్ష ఉంటే.. ఖచ్చితంగా ఆయనకేంద్ర పెద్దలను ఒప్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. కేంద్ర పెద్దలు ఈ విషయంలో అచేతనంగా ఉన్నారు. సో.. దీనిని బట్టి రాజధాని కోసం.. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతను సోము తీసుకుని.. ఇక్కడ ప్రజల కలలను ఆయన సాకారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది జరిగినప్పుడే.. సోము చేసిన వ్యాఖ్యలపై నమ్మకం కలుగుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 15, 2020 10:26 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…