“బీజేపీ పరంగా మేం రాజధాని అమరావతికే కట్టుబడి ఉన్నాం. మూడు రాజధానుల నిర్ణయానికి మేం వ్యతిరేకం”- ఇదీ తాజాగా ఏపీ బీజేపీ చీఫ్.. సోము వీర్రాజు నోటి నుంచి జాలువారిన కీలక ప్రకటన. నేరుగా ఆయన అమరావతి రైతుల మధ్యకే వెళ్లి.. ఈ విషయాన్ని చెప్పారు. ఒక రకంగా.. ఇది రైతుల్లో ఉత్సాహం నింపేదే! అయితే.. దీనిలో నిజమెంత? రాబోయే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను దృష్టి పెట్టుకుని చేసిన ప్రకటనా? లేక.. నిజంగానే రాజధానిపై సోముకు వీరావేశం పొంగుకు వచ్చిందా? అనేదే ఇప్పుడు సంశయంగా మారింది. సోము వంటి ఆర్ ఎస్ ఎస్ భావజాలం గూడుకట్టుకున్న నేత నోటి నుంచి వచ్చిన దీనిని తేలికగా తీసుకునే అవకాశం లేదు.
అయితే.. నిజమైనా అయి ఉండాలి. లేదా.. రాజకీయ ఎత్తుగడ అయినా.. అయి ఉండాలి.. అంటున్నారు పరిశీలకులు. దీనిలో రెండోదానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు ఇప్పటికే ఏపీ రాజధాని విషయంలో స్పష్టమైన ప్రకటనను లిఖిత పూర్వకంగా అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తేల్చిచెప్పారు. విభజన చట్టంలోని ఏ క్యాపిటల్ అని ఉందని.. ఏ అంటే..ఒకటే అని అనుకోవాల్సిన అవసరం లేదని పరోక్షంగా మూడుకు తలగొక్కారు. అప్పట్లో ఇది తీవ్ర గందరగోళానికి గురి చేసింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే.. ఆ సమయంలో మౌనంగా ఉన్న సోము.. ఇప్పుడు మాత్రం రాజధానికి తాము ఓకే అంటూ.. పచ్చ జెండా ఊపారు.
ఒక వేళ.. సోము చేసిన ప్రకటనలో రాజకీయ ఎత్తుగడ ఉండి ఉంటే.. ఖచ్చితంగా పార్టీ మరింతగా భ్రష్టు పడుతుంది. ఇప్పటికే ప్రత్యేక హోదాకు కేంద్రం మంగళం పాడింది. నిధుల విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఇది ఏపీ ప్రజల సెంటిమెంటును తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇక, ఇప్పుడు రాజధాని విషయంలో కేంద్రం ఒక పాట పాడితే.. సోము మరో ఎత్తుగడ ఎత్తుకున్నారు.
రాజధానిగా ఆయన అమరావతి ఉండాలని నిజమైన ఆకాంక్ష ఉంటే.. ఖచ్చితంగా ఆయనకేంద్ర పెద్దలను ఒప్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. కేంద్ర పెద్దలు ఈ విషయంలో అచేతనంగా ఉన్నారు. సో.. దీనిని బట్టి రాజధాని కోసం.. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతను సోము తీసుకుని.. ఇక్కడ ప్రజల కలలను ఆయన సాకారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది జరిగినప్పుడే.. సోము చేసిన వ్యాఖ్యలపై నమ్మకం కలుగుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 15, 2020 10:26 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…