Political News

అమ‌రావ‌తి.. కేంద్రాన్ని సోము ఒప్పించ‌గ‌ల‌రా?

“బీజేపీ ప‌రంగా మేం రాజ‌ధాని అమ‌రావ‌తికే క‌ట్టుబ‌డి ఉన్నాం. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి మేం వ్య‌తిరేకం”- ఇదీ తాజాగా ఏపీ బీజేపీ చీఫ్‌.. సోము వీర్రాజు నోటి నుంచి జాలువారిన కీల‌క ప్ర‌క‌ట‌న‌. నేరుగా ఆయ‌న అమ‌రావ‌తి రైతుల మ‌ధ్య‌కే వెళ్లి.. ఈ విష‌యాన్ని చెప్పారు. ఒక ర‌కంగా.. ఇది రైతుల్లో ఉత్సాహం నింపేదే! అయితే.. దీనిలో నిజ‌మెంత‌? రాబోయే తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ను దృష్టి పెట్టుకుని చేసిన ప్ర‌క‌ట‌నా? లేక‌.. నిజంగానే రాజ‌ధానిపై సోముకు వీరావేశం పొంగుకు వ‌చ్చిందా? అనేదే ఇప్పుడు సంశ‌యంగా మారింది. సోము వంటి ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం గూడుక‌ట్టుకున్న నేత నోటి నుంచి వ‌చ్చిన దీనిని తేలిక‌గా తీసుకునే అవ‌కాశం లేదు.

అయితే.. నిజ‌మైనా అయి ఉండాలి. లేదా.. రాజ‌కీయ ఎత్తుగ‌డ అయినా.. అయి ఉండాలి.. అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిలో రెండోదానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్ద‌లు ఇప్ప‌టికే ఏపీ రాజ‌ధాని విష‌యంలో స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న‌ను లిఖిత పూర్వ‌కంగా అఫిడ‌విట్ రూపంలో హైకోర్టుకు తేల్చిచెప్పారు. విభ‌జ‌న చ‌ట్టంలోని ఏ క్యాపిటల్‌ అని ఉంద‌ని.. అంటే..ఒకటే అని అనుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌రోక్షంగా మూడుకు త‌ల‌గొక్కారు. అప్ప‌ట్లో ఇది తీవ్ర గంద‌ర‌గోళానికి గురి చేసింది. దీనిపై రాజ‌ధాని రైతులు తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేశారు. అయితే.. ఆ స‌మ‌యంలో మౌనంగా ఉన్న సోము.. ఇప్పుడు మాత్రం రాజ‌ధానికి తాము ఓకే అంటూ.. ప‌చ్చ జెండా ఊపారు.

ఒక వేళ‌.. సోము చేసిన ప్ర‌క‌ట‌న‌లో రాజ‌కీయ ఎత్తుగ‌డ ఉండి ఉంటే.. ఖ‌చ్చితంగా పార్టీ మ‌రింత‌గా భ్ర‌ష్టు ప‌డుతుంది. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదాకు కేంద్రం మంగ‌ళం పాడింది. నిధుల విష‌యంలోనూ ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇది ఏపీ ప్ర‌జ‌ల సెంటిమెంటును తీవ్రంగా దెబ్బ‌తీస్తోంది. ఇక‌, ఇప్పుడు రాజ‌ధాని విష‌యంలో కేంద్రం ఒక పాట పాడితే.. సోము మ‌రో ఎత్తుగ‌డ ఎత్తుకున్నారు.

రాజ‌ధానిగా ఆయ‌న అమ‌రావ‌తి ఉండాల‌ని నిజ‌మైన ఆకాంక్ష ఉంటే.. ఖ‌చ్చితంగా ఆయ‌న‌కేంద్ర పెద్ద‌ల‌ను ఒప్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. కేంద్ర పెద్ద‌లు ఈ విష‌యంలో అచేత‌నంగా ఉన్నారు. సో.. దీనిని బ‌ట్టి రాజ‌ధాని కోసం.. కేంద్రాన్ని ఒప్పించే బాధ్య‌త‌ను సోము తీసుకుని.. ఇక్క‌డ ప్ర‌జ‌ల క‌ల‌ల‌ను ఆయ‌న సాకారం చేయాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఇది జ‌రిగిన‌ప్పుడే.. సోము చేసిన వ్యాఖ్య‌ల‌పై న‌మ్మ‌కం క‌లుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 15, 2020 10:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

5 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

6 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

6 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

6 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

8 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

9 hours ago