Political News

అమ‌రావ‌తి.. కేంద్రాన్ని సోము ఒప్పించ‌గ‌ల‌రా?

“బీజేపీ ప‌రంగా మేం రాజ‌ధాని అమ‌రావ‌తికే క‌ట్టుబ‌డి ఉన్నాం. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి మేం వ్య‌తిరేకం”- ఇదీ తాజాగా ఏపీ బీజేపీ చీఫ్‌.. సోము వీర్రాజు నోటి నుంచి జాలువారిన కీల‌క ప్ర‌క‌ట‌న‌. నేరుగా ఆయ‌న అమ‌రావ‌తి రైతుల మ‌ధ్య‌కే వెళ్లి.. ఈ విష‌యాన్ని చెప్పారు. ఒక ర‌కంగా.. ఇది రైతుల్లో ఉత్సాహం నింపేదే! అయితే.. దీనిలో నిజ‌మెంత‌? రాబోయే తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ను దృష్టి పెట్టుకుని చేసిన ప్ర‌క‌ట‌నా? లేక‌.. నిజంగానే రాజ‌ధానిపై సోముకు వీరావేశం పొంగుకు వ‌చ్చిందా? అనేదే ఇప్పుడు సంశ‌యంగా మారింది. సోము వంటి ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం గూడుక‌ట్టుకున్న నేత నోటి నుంచి వ‌చ్చిన దీనిని తేలిక‌గా తీసుకునే అవ‌కాశం లేదు.

అయితే.. నిజ‌మైనా అయి ఉండాలి. లేదా.. రాజ‌కీయ ఎత్తుగ‌డ అయినా.. అయి ఉండాలి.. అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిలో రెండోదానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్ద‌లు ఇప్ప‌టికే ఏపీ రాజ‌ధాని విష‌యంలో స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న‌ను లిఖిత పూర్వ‌కంగా అఫిడ‌విట్ రూపంలో హైకోర్టుకు తేల్చిచెప్పారు. విభ‌జ‌న చ‌ట్టంలోని ఏ క్యాపిటల్‌ అని ఉంద‌ని.. అంటే..ఒకటే అని అనుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌రోక్షంగా మూడుకు త‌ల‌గొక్కారు. అప్ప‌ట్లో ఇది తీవ్ర గంద‌ర‌గోళానికి గురి చేసింది. దీనిపై రాజ‌ధాని రైతులు తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేశారు. అయితే.. ఆ స‌మ‌యంలో మౌనంగా ఉన్న సోము.. ఇప్పుడు మాత్రం రాజ‌ధానికి తాము ఓకే అంటూ.. ప‌చ్చ జెండా ఊపారు.

ఒక వేళ‌.. సోము చేసిన ప్ర‌క‌ట‌న‌లో రాజ‌కీయ ఎత్తుగ‌డ ఉండి ఉంటే.. ఖ‌చ్చితంగా పార్టీ మ‌రింత‌గా భ్ర‌ష్టు ప‌డుతుంది. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదాకు కేంద్రం మంగ‌ళం పాడింది. నిధుల విష‌యంలోనూ ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇది ఏపీ ప్ర‌జ‌ల సెంటిమెంటును తీవ్రంగా దెబ్బ‌తీస్తోంది. ఇక‌, ఇప్పుడు రాజ‌ధాని విష‌యంలో కేంద్రం ఒక పాట పాడితే.. సోము మ‌రో ఎత్తుగ‌డ ఎత్తుకున్నారు.

రాజ‌ధానిగా ఆయ‌న అమ‌రావ‌తి ఉండాల‌ని నిజ‌మైన ఆకాంక్ష ఉంటే.. ఖ‌చ్చితంగా ఆయ‌న‌కేంద్ర పెద్ద‌ల‌ను ఒప్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. కేంద్ర పెద్ద‌లు ఈ విష‌యంలో అచేత‌నంగా ఉన్నారు. సో.. దీనిని బ‌ట్టి రాజ‌ధాని కోసం.. కేంద్రాన్ని ఒప్పించే బాధ్య‌త‌ను సోము తీసుకుని.. ఇక్క‌డ ప్ర‌జ‌ల క‌ల‌ల‌ను ఆయ‌న సాకారం చేయాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఇది జ‌రిగిన‌ప్పుడే.. సోము చేసిన వ్యాఖ్య‌ల‌పై న‌మ్మ‌కం క‌లుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 15, 2020 10:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

35 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago