రాజకీయాలకు కీలకమైన విజయవాడలో నాయకుల దూకుడు ఓ రేంజ్లో ఉంటుంది. ఈ విషయంలో ఎవరికీ సందేహం లేదు. అయితే.. కేవలం మాటలకేనా? పనులకు ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే.. ముందు మాటలు.. తర్వాతే పనులు అన్నట్టుగా నాయకులు ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారు. కానీ.. దీనికి భిన్నంగా తొలిసారి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో తొలిసారి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పశ్చిమ నియోజకవర్గం అంటేనే ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉంటారు. అలాంటి చోట బీజేపీ రెండో సారి విజయం దక్కించుకుంది. తాజా విజయం తర్వాత.. బీజేపీ వెనక్కి తిరిగి చూసుకోకుండా.. వ్యవహరించేలా ఎమ్మెల్యే సుజనా కార్యాచరణ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తూ.. ఆయన తొలి నాళ్లలోనే ఇక్కడివారిని ఆకట్టుకున్నారు.
ఇక, ఇప్పుడు మొబైల్ ఆసుపత్రిని ఆయన అందుబాటులోకి తీసుకువచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు ఎక్కువ. ఇక్కడి వారికి ఏ చిన్న వైద్య అవసరం వచ్చినా.. కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇంటి ముందుకే అధునాతన వైద్యం అందించేలా సుజనా ఫౌండేషన్ సహకారంతో ఎమ్మెల్యే మొబైల్ ఆసుపత్రికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇది సేవలందించనుంది.
ప్రతి వార్డులోనూ రెండు నుంచి మూడు గంటలపాటు ఈ వాహనాన్ని నిలిపి వుంచుతారు. దీనిలో షుగర్, బీపీ, కిడ్నీ టెస్టుల నుంచి ఇతర మలేరియా జ్వరాలు.. చిన్నపాటి రోగాలను నయం చేసేలా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. ఈసీజీ కూడా తీస్తారు.
దీనిని ముఖ్యంగా పేదలు, తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఎమ్మెల్యే చెబుతున్నారు. నిజానికి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచన ఎవరూ చేయకపోవడంతో ఎమ్మెల్యే పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on January 24, 2026 6:30 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…