రాజకీయాలకు కీలకమైన విజయవాడలో నాయకుల దూకుడు ఓ రేంజ్లో ఉంటుంది. ఈ విషయంలో ఎవరికీ సందేహం లేదు. అయితే.. కేవలం మాటలకేనా? పనులకు ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే.. ముందు మాటలు.. తర్వాతే పనులు అన్నట్టుగా నాయకులు ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారు. కానీ.. దీనికి భిన్నంగా తొలిసారి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో తొలిసారి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పశ్చిమ నియోజకవర్గం అంటేనే ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉంటారు. అలాంటి చోట బీజేపీ రెండో సారి విజయం దక్కించుకుంది. తాజా విజయం తర్వాత.. బీజేపీ వెనక్కి తిరిగి చూసుకోకుండా.. వ్యవహరించేలా ఎమ్మెల్యే సుజనా కార్యాచరణ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తూ.. ఆయన తొలి నాళ్లలోనే ఇక్కడివారిని ఆకట్టుకున్నారు.
ఇక, ఇప్పుడు మొబైల్ ఆసుపత్రిని ఆయన అందుబాటులోకి తీసుకువచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు ఎక్కువ. ఇక్కడి వారికి ఏ చిన్న వైద్య అవసరం వచ్చినా.. కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇంటి ముందుకే అధునాతన వైద్యం అందించేలా సుజనా ఫౌండేషన్ సహకారంతో ఎమ్మెల్యే మొబైల్ ఆసుపత్రికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇది సేవలందించనుంది.
ప్రతి వార్డులోనూ రెండు నుంచి మూడు గంటలపాటు ఈ వాహనాన్ని నిలిపి వుంచుతారు. దీనిలో షుగర్, బీపీ, కిడ్నీ టెస్టుల నుంచి ఇతర మలేరియా జ్వరాలు.. చిన్నపాటి రోగాలను నయం చేసేలా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. ఈసీజీ కూడా తీస్తారు.
దీనిని ముఖ్యంగా పేదలు, తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఎమ్మెల్యే చెబుతున్నారు. నిజానికి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచన ఎవరూ చేయకపోవడంతో ఎమ్మెల్యే పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on January 24, 2026 6:30 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…