Political News

తిరుపతిలో మూడు పార్టీల్లోను విచిత్ర పరిస్దితులేనా ?

అవును తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు సంబంధించి మూడు పార్టీల్లోను విచిత్రమైన పరిస్దితులే రాజ్యమేలుతున్నాయి. బీజేపీ, టడీపీ, వైసీపీల్లో ఏమి జరుగుతోందో అర్ధంకాక కొందరు జనాలు జుట్టు పీక్కుంటున్నారు. అభ్యర్ధిని ప్రకటించకుండానే హడావుడి చేసేస్తున్న పార్టీ ఒకటి. అభ్యర్ధిని ప్రకటించినా ప్రచారానికి దిగని పార్టీ మరోటి. ఇక అంతర్గతంగా డిసైడ్ అయినా అధికారికంగా ప్రకటించని పార్టీ ఇంకోటి. మూడు ప్రధాన పార్టీల వ్యవహారమే ఇలాగుంటే ఇక కాంగ్రెస్, వామపక్షాల గురించి ఆలోచించే జనాలు ఎక్కడున్నారు ?

ఇంతకీ విషయం ఏమిటంటే ఉపఎన్నిక విషయంలో అందరికన్నా స్పదించేసింది బీజేపీనే. బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారని దాదాపు రెండు నెలల క్రితమే రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించేశారు. తర్వాత పార్టీపరంగా నానా హడావుడి చేసినా ఇంతవరకు అభ్యర్ధి ఎవరున్నది తేలలేదు. మధ్యలో పోటీ చేయబోయేది బీజేపీ అభ్యర్ధా లేకపోతే జనసేన అభ్యర్ధా ? అన్న కన్ఫ్యూజన్ వచ్చింది. అయితే తిరుపతిలో జరిగిన రెండురోజుల కార్యవర్గ సమావేశంలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేయబోతున్నట్లు వీర్రాజు క్లారిటి ఇచ్చేశారు. అయితే అభ్యర్ధి ఎవరన్నది మాత్రం చెప్పలేదు.

ఇక తన సహజ లక్షణానికి భిన్నంగా నెలల ముందే అభ్యర్ధిని ప్రకటించేశారు చంద్రబాబునాయుడు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన పనబాక లక్ష్మే రాబోయే ఉపఎన్నికలో టీడీపీ తరపున పోటీ చేస్తుందని చెప్పేశారు. చంద్రబాబు ప్రకటించారు కానీ ఇంతవరకు పనబాక నుండి బహిరంగంగా ఇంతవరకు ఒక్క స్పందన కూడా లేదు. దాంతో ఆమె పోటీ చేసే విషయమై కొందరు నేతల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. లోక్ సభ నియోజకవర్గంలోని కొందరు సీనియర్లకు పనబాక ఫోన్లో మాట్లాడుతున్నా ఇంకా చాలామంది నేతల్లో అయితే ఆమె పోటీచేసే విషయంలో అనుమానాలున్న మాట వాస్తవం.

చివరగా చెప్పుకోవాల్సింది అధికార వైసీపీ గురించే. సానుభూతి కోసమని చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకిరిని పోటీలోకి దింపటం అందరు చూస్తున్నదే. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబం నుండి కాకుండా కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపబోతున్నారు. పాదయాత్రలో తనవెంటే నిలిచిన ఫిజియోథెరపిస్టు డాక్టర్ గురుమూర్తిని పోటీ చేయించనున్నట్లు లోక్ సభ పరిధిలోని మంత్రులు, ఎంఎల్ఏల సమావేశంలో చెప్పారట.

గురుమూర్తిని రంగంలోకి దింపబోతున్నట్లు జగన్ చెప్పి కూడా సుమారు మూడు వారాలైపోయింది. అయితే ఇంత వరకు బహిరంగంగా ప్రకటనైతే చేయలేదు. ఈ విషయంలోనే వైసీపీ నేతల్లో అయోమయం కనబడుతోంది. గురుమూర్తిని పోటీ చేయించాలని స్వయంగా జగనే డిసైడ్ అయిపోయినపుడు ఇదే విషయాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు ? అన్నదే ఎవరికీ అర్ధంకాలేదు. ఇక కాంగ్రెస్, వామపక్షాల తరపున పోటీ చేస్తారని కూడా ఎవరు అనుకోవటం లేదు. ఒకవేళ పోటీలో ఉన్నా పట్టించుకునే వాళ్ళెవరుంటారు ?

This post was last modified on December 15, 2020 12:17 pm

Share

Recent Posts

`అయోధ్య‌`కు రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా?!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత రామ‌జ‌న్మ‌భూమి అయోధ్యలో ఉన్న బాల‌రామ‌య్య ఆల‌యానికి రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా? ఇక‌, ఆల‌యానికి రాజకీయ ప్ర‌భావం,…

2 hours ago

సూర్య ఛెప్పిన కార్తి ‘పొటాటో చిప్స్’ కథ

సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్‌లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…

3 hours ago

హీరో దర్శకత్వపు కల… అదెప్పుడు నెరవేరునో

టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…

5 hours ago

సాక్షిలో రెండో పేజీకి చేరిన రాజన్న

ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…

5 hours ago

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

7 hours ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

7 hours ago