Political News

పబ్లిక్ పల్స్ పట్టుకున్న పురంధేశ్వరి

క్రెడిట్ కార్డు వినియోగం పెరుగుతున్న కొద్దీ, వాటిపై విధిస్తున్న అధిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయి. 24 శాతం నుంచి 48 శాతం వరకు, కొన్ని సందర్భాల్లో 55 శాతం కంటే ఎక్కువగా వడ్డీలు వసూలు చేయడం వినియోగదారులను అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు వడ్డీలపై నియంత్రణ అవసరమని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి లేవనెత్తిన అంశం ప్రజలకు ఊరట ఇస్తోంది.

అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగదారుల రక్షణకు కఠిన నియమాలు అమలులో ఉన్నాయన్నది వాస్తవం. అమెరికాలో క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10 శాతానికి పరిమితం చేయాలనే ప్రతిపాదన రావడం అక్కడి పాలకుల దృష్టిని సూచిస్తోంది. అయితే భారత్‌లో మాత్రం మార్కెట్ స్వేచ్ఛ పేరిట బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇష్టానుసారంగా వడ్డీలు, ఛార్జీలు విధిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. 

మనదేశంలో కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉంది.  ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా, వినియోగదారుల హితాన్ని కాపాడే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ని కలిసి పురంధేశ్వరి వినతిపత్రం అందజేశారు. క్రెడిట్ కార్డ్ వడ్డీలపై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి మేలైన ప్రతిపాదన చేశారంటూ ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.

This post was last modified on January 23, 2026 10:32 am

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

39 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

2 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

2 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

3 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

5 hours ago