Political News

బొమ్మల వివాదం తర్వాత కూడా మారని జగన్ వైఖరి

రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేపై వైసీపీ అధినేత జగన్ తనదైన శైలిలో స్పందించారు. ఎరా ఎయ్యి పడితే ఆరాయితో సరిహద్దులు నిర్ణయిస్తున్నారని, ఇదేం సర్వే అని ప్రశ్నించారు. అయితే వాస్తవంగా వైసీపీ హయాంలోనే సర్వే రాళ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. సర్వే రాళ్ల కోసం సుమారు 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో పాటు ఖరీదైన గ్రానైట్ రాయిని వినియోగించడం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది.

అంతేకాదు, ఆ సర్వే రాళ్లపై జగన్ ఫొటోలను కూడా ముద్రించారు. దీనిపై హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. భూముల రీ సర్వేకు సంబంధించి రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలపై కూడా జగన్ బొమ్మ ఉండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, తాము అధికారంలోకి వస్తే రీ సర్వేను పారదర్శకంగా చేపడతామని, పాస్ పుస్తకాలపై ఉన్న బొమ్మలను తొలగిస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖరీదైన సర్వే రాళ్లను తొలగించి సాధారణ రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను తొలగించి ప్రభుత్వ రాజముద్రను ముద్రించారు. దీంతో రీ సర్వే ప్రక్రియ మరింత స్పష్టంగా, నమ్మకంగా సాగుతోందని రైతులు చెబుతున్నారు.

ఇక గతంలో జరిగిన తప్పులను కూడా సరిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా కూడా జగన్ ఇప్పుడు సరిహద్దు రాళ్లు సరిగా లేవని, పాస్ పుస్తకాలు సరిగ్గా లేవని వ్యాఖ్యానించడం గమనార్హం.

రీ సర్వే అనేది కేంద్ర ప్రభుత్వ స్థాయి కార్యక్రమం. ఇది దేశవ్యాప్తంగా అమలులో ఉంది. తెలంగాణలో భూ భారతి పేరుతో, ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ పేరుతో ఈ ప్రక్రియను గతంలో చేపట్టారు. ప్రస్తుతం రీ సర్వే పేరుతో కొనసాగిస్తున్నారు. అయినా జగన్ మాత్రం ఈ పథకం తన ఆలోచనతోనే వచ్చిందని, తానే దీనికి రూపకల్పన చేశానని చెప్పడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.

This post was last modified on January 22, 2026 9:51 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

కెమెరామెన్ పేల్చిన ‘విశ్వంభర’ బాంబులు

విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…

20 minutes ago

దానంకు స్పీకర్ క్లీన్ చిట్… కరెక్టేనా?

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…

3 hours ago

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

4 hours ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

4 hours ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

8 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

10 hours ago