Political News

బొమ్మల వివాదం తర్వాత కూడా మారని జగన్ వైఖరి

రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేపై వైసీపీ అధినేత జగన్ తనదైన శైలిలో స్పందించారు. ఎరా ఎయ్యి పడితే ఆరాయితో సరిహద్దులు నిర్ణయిస్తున్నారని, ఇదేం సర్వే అని ప్రశ్నించారు. అయితే వాస్తవంగా వైసీపీ హయాంలోనే సర్వే రాళ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. సర్వే రాళ్ల కోసం సుమారు 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో పాటు ఖరీదైన గ్రానైట్ రాయిని వినియోగించడం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది.

అంతేకాదు, ఆ సర్వే రాళ్లపై జగన్ ఫొటోలను కూడా ముద్రించారు. దీనిపై హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. భూముల రీ సర్వేకు సంబంధించి రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలపై కూడా జగన్ బొమ్మ ఉండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, తాము అధికారంలోకి వస్తే రీ సర్వేను పారదర్శకంగా చేపడతామని, పాస్ పుస్తకాలపై ఉన్న బొమ్మలను తొలగిస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖరీదైన సర్వే రాళ్లను తొలగించి సాధారణ రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను తొలగించి ప్రభుత్వ రాజముద్రను ముద్రించారు. దీంతో రీ సర్వే ప్రక్రియ మరింత స్పష్టంగా, నమ్మకంగా సాగుతోందని రైతులు చెబుతున్నారు.

ఇక గతంలో జరిగిన తప్పులను కూడా సరిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా కూడా జగన్ ఇప్పుడు సరిహద్దు రాళ్లు సరిగా లేవని, పాస్ పుస్తకాలు సరిగ్గా లేవని వ్యాఖ్యానించడం గమనార్హం.

రీ సర్వే అనేది కేంద్ర ప్రభుత్వ స్థాయి కార్యక్రమం. ఇది దేశవ్యాప్తంగా అమలులో ఉంది. తెలంగాణలో భూ భారతి పేరుతో, ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ పేరుతో ఈ ప్రక్రియను గతంలో చేపట్టారు. ప్రస్తుతం రీ సర్వే పేరుతో కొనసాగిస్తున్నారు. అయినా జగన్ మాత్రం ఈ పథకం తన ఆలోచనతోనే వచ్చిందని, తానే దీనికి రూపకల్పన చేశానని చెప్పడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.

Satya

Recent Posts

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

14 minutes ago

తెలంగాణ పాలిటిక్స్‌: ప‌వ‌న్ భ‌య‌మా… ఓట్ల భ‌య‌మా?

తెలంగాణ రాజ‌కీయాలు వ్యూహాత్మ‌క మ‌లుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌న‌సేన పార్టీపై…

20 minutes ago

సీఎం అయినా విజయ్ లో తృప్తి లేదే!

మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…

3 hours ago

విగ్రహాల ధ్వంసం… జగన్ పై జీవి ఆంజనేయులు ఆరోపణలు

ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…

3 hours ago

పవన్ సభకు తెలంగాణ పోలీసుల ‘నో’

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…

4 hours ago

రాజమౌళి లక్ష్యం… సినీ ప్రియుల స్వప్మం

తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…

6 hours ago