పాలన అంటే..కేవలం నాలుగు సంక్షేమ కార్యక్రమాలు.. రెండు అభివృద్ధి ప్రాజెక్టులేనా? అంటే.. ప్రజల కోణంలో చూసుకుంటే.. కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అభివృద్ధి, సంక్షేమాలతోపాటు.. ఒకింత వినోదం, వేడుకలు కూడా ఉండాలని భావిస్తారు. ఈ విషయంలో గత ఐదేళ్లలో వైసీపీ మూతి ముడుచుకుని కూర్చుంది. ఎక్కడా ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు. ఎవరైనా ఈవెంట్లు చేసుకునేందుకు ముందుకు వచ్చినా.. వారిని కూడా తరిమేసింది. దీంతో ప్రజలకు గత ఐదేళ్లు.. వినోదం-వేడుక అనే మాటే వినిపించకుండా పోయింది.
అయితే. కూటమి సర్కారు… మాత్రం గత 18 మాసాల్లో ప్రజలకు ఇటు సంక్షేమం(సూపర్ సిక్స్), అటు అభివృద్ధి(అమరావతి, పోలవరం ప్రాజెక్టులు సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణం)తోపాటు వినోదాన్ని, వేడుకలను కూడా చేరువ చేస్తోంది. నగరాలు, పట్టణాల వారీగా ఈకార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగానే.. గత ఏడాది ‘విజయవాడ ఉత్సవ్’, తిరుపతిలోనూ వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత.. ఏదో ఒక రూపంలో ప్రతి చోటా ప్రజలకు వేడుక పంచేకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక, ఇప్పుడు అదిరిపోయేలా మరో వేడుకకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది.
ఇది పూర్తిగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు ఉద్దేశించిన కార్యక్రమమే అయినా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయనున్నారు. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ‘విశాఖ ఉత్సవ్’ పేరుతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని మూడు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. ‘సాగరం నుంచి శిఖరం వరకు’ అనే థీమ్తో ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని విశాఖ, అనకాపల్లి, అరకు లోయ ప్రాంతాల్లో దీనిని నిర్వహిస్తున్నారు..
ఇవీ విశేషాలు..
This post was last modified on January 22, 2026 11:22 am
విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…