పాలన అంటే..కేవలం నాలుగు సంక్షేమ కార్యక్రమాలు.. రెండు అభివృద్ధి ప్రాజెక్టులేనా? అంటే.. ప్రజల కోణంలో చూసుకుంటే.. కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అభివృద్ధి, సంక్షేమాలతోపాటు.. ఒకింత వినోదం, వేడుకలు కూడా ఉండాలని భావిస్తారు. ఈ విషయంలో గత ఐదేళ్లలో వైసీపీ మూతి ముడుచుకుని కూర్చుంది. ఎక్కడా ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు. ఎవరైనా ఈవెంట్లు చేసుకునేందుకు ముందుకు వచ్చినా.. వారిని కూడా తరిమేసింది. దీంతో ప్రజలకు గత ఐదేళ్లు.. వినోదం-వేడుక అనే మాటే వినిపించకుండా పోయింది.
అయితే. కూటమి సర్కారు… మాత్రం గత 18 మాసాల్లో ప్రజలకు ఇటు సంక్షేమం(సూపర్ సిక్స్), అటు అభివృద్ధి(అమరావతి, పోలవరం ప్రాజెక్టులు సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణం)తోపాటు వినోదాన్ని, వేడుకలను కూడా చేరువ చేస్తోంది. నగరాలు, పట్టణాల వారీగా ఈకార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగానే.. గత ఏడాది ‘విజయవాడ ఉత్సవ్’, తిరుపతిలోనూ వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత.. ఏదో ఒక రూపంలో ప్రతి చోటా ప్రజలకు వేడుక పంచేకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక, ఇప్పుడు అదిరిపోయేలా మరో వేడుకకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది.
ఇది పూర్తిగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు ఉద్దేశించిన కార్యక్రమమే అయినా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయనున్నారు. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ‘విశాఖ ఉత్సవ్’ పేరుతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని మూడు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. ‘సాగరం నుంచి శిఖరం వరకు’ అనే థీమ్తో ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని విశాఖ, అనకాపల్లి, అరకు లోయ ప్రాంతాల్లో దీనిని నిర్వహిస్తున్నారు..
ఇవీ విశేషాలు..
This post was last modified on January 22, 2026 11:22 am
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తొలిరోజు మాత్రమే వచ్చిన వైసీపీ సభ్యులు.. తర్వాత పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో సభకు…