పాలన అంటే..కేవలం నాలుగు సంక్షేమ కార్యక్రమాలు.. రెండు అభివృద్ధి ప్రాజెక్టులేనా? అంటే.. ప్రజల కోణంలో చూసుకుంటే.. కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అభివృద్ధి, సంక్షేమాలతోపాటు.. ఒకింత వినోదం, వేడుకలు కూడా ఉండాలని భావిస్తారు. ఈ విషయంలో గత ఐదేళ్లలో వైసీపీ మూతి ముడుచుకుని కూర్చుంది. ఎక్కడా ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు. ఎవరైనా ఈవెంట్లు చేసుకునేందుకు ముందుకు వచ్చినా.. వారిని కూడా తరిమేసింది. దీంతో ప్రజలకు గత ఐదేళ్లు.. వినోదం-వేడుక అనే మాటే వినిపించకుండా పోయింది.
అయితే. కూటమి సర్కారు… మాత్రం గత 18 మాసాల్లో ప్రజలకు ఇటు సంక్షేమం(సూపర్ సిక్స్), అటు అభివృద్ధి(అమరావతి, పోలవరం ప్రాజెక్టులు సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణం)తోపాటు వినోదాన్ని, వేడుకలను కూడా చేరువ చేస్తోంది. నగరాలు, పట్టణాల వారీగా ఈకార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగానే.. గత ఏడాది ‘విజయవాడ ఉత్సవ్’, తిరుపతిలోనూ వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత.. ఏదో ఒక రూపంలో ప్రతి చోటా ప్రజలకు వేడుక పంచేకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక, ఇప్పుడు అదిరిపోయేలా మరో వేడుకకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది.
ఇది పూర్తిగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు ఉద్దేశించిన కార్యక్రమమే అయినా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయనున్నారు. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ‘విశాఖ ఉత్సవ్’ పేరుతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని మూడు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. ‘సాగరం నుంచి శిఖరం వరకు’ అనే థీమ్తో ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని విశాఖ, అనకాపల్లి, అరకు లోయ ప్రాంతాల్లో దీనిని నిర్వహిస్తున్నారు..
ఇవీ విశేషాలు..
This post was last modified on January 22, 2026 11:22 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…