Political News

పాదయాత్రపై జగన్ అఫిషియల్ క్లారిటీ

మరో పాదయాత్రకు మాజీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారు. ఎన్నికలకు ముందు ఆయన ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్నారు. దీనిపై ఆయన ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ఈ రోజు సమావేశం అయ్యారు.

‘ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలుపెడతాను. ఆ విధంగా దాదాపు ఏడాదిన్నర పాటు, నేను ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటాను..’ ఉంటానంటూ ఆయన వెల్లడించారు. ఇక నుంచి ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం కార్యకర్తలతో తాను భేటీ అవుతానని స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి ఇక మిగిలింది మూడేళ్లే అని ఆయన స్పష్టం చేశారు. ‘చూస్తుండగానే దాదాపు రెండేళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అంటే ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే. అలాగే మిగిలింది మూడేళ్లు మాత్రమే…’ అంటూ లెక్కలు చెప్పారు.

2027లో జగన్ పాదయాత్ర ఉంటుందని ఆ పార్టీ నాయకులు గతంలోనూ చెప్పారు. దాదాపు రెండేళ్లపాటు ఈ యాత్ర సాగుతుందని కూడా స్పష్టం చేశారు. అంటే ఎన్నికలకు ముందు సుదీర్ఘ కాలం ప్రజల్లో ఉండేలా ఆయన ప్లాన్ చేసినట్లు సమాచారం. దానిపైనే పార్టీ నాయకులు కూడా ఆశలు పెట్టుకున్నారు.

ఓటమి తర్వాత వైసీపీ ముఖ్యనేతలను దూరం చేసుకుంది. కనీసం అసెంబ్లీకి రాకుండా.. ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించకుండానే దాదాపు రెండేళ్లు గడిపేసింది. అదేమంటే ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రకు కార్యకర్తలలో కొంత క్రేజ్ఉంది. దానిని ఓట్లుగా మలచుకునేందుకు జగన్ ప్రణాళికలను రచిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పాదయాత్రలు చేయడం పరిపాటి.. అయితే జగన్ కు అది ప్లస్అవుతుందో లేదో చూడాలి. మరో వైపు పలు అవినీతి ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. త్వరలో ఏపీలో సంచలనాలు జరగబోతున్నాయంటూ బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కూడా జగన్కు బీజేపీ అండ లేదనే సంకేతాలను ఇస్తున్నాయి. మరో ఏడాది పాటు ఏపీ రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Kumar

Recent Posts

ప్రేక్షకులకు నచ్చని కాక్ టైల్ రుచి

షాహిద్ కపూర్,కృతి సనన్, రష్మిక మందన్న కలయికలో రూపొందిన కాక్ టైల్ 2 వసూళ్లు బాగా పడిపోవడం నిర్మాతలను ఆందోళనకు…

24 seconds ago

సాహో హీరోయిన్ ‘ఈథ’కు టైటిల్ వివాదం

ఒకవేళ సాహో పెద్ద హిట్టయ్యింటే హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగులో వరసగా కనిపించేదేమో కానీ అనుకున్న ఫలితం అందుకోకపోవడంతో పూర్తిగా…

37 minutes ago

పవన్ అంటే అంత పగ ఎందుకు కవిత గారు?

అదేంటో గానీ… విషయం ఏదైనా జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు తీయాల్సిందే. ఆయనపై విమర్శలు…

51 minutes ago

ఘట్టమనేని వారసుడి వెనుకడుగు ఎందుకంటే

ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం జూలై 9 విడుదలని మొన్నటి దాకా టీమ్…

3 hours ago

మార్కెటింగ్ విద్యలో రాజమౌళిదే సింహాసనం

ఎన్ని వందల కోట్లు పెట్టి తీస్తున్నా తన సినిమా కథ ఎవరికీ తెలియకూడదనే ఆత్రం రాజమౌళికి ఉండదు. టైటిల్ లీక్…

3 hours ago

బుచ్చిబాబు అడుగులు ఎటు వెళ్తాయి

పెద్ది థియేటర్ రన్ ఈ సండేతో ముగిసినట్టే. నాలుగో వారంలో ఓ మోస్తరుగా ఆడుతోంది కానీ వీక్ డేస్ లో…

4 hours ago