Political News

బీఆర్ఎస్ ఎమ్మెల్యే vs కాంగ్రెస్ ఎంపీ.. అసలేం జరిగింది?

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ పై ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నడిగడ్డ ప్రాంతంలో వసూల్ రాజాలు తిరుగుతున్నారని, సంపత్ కుమార్ ఇసుక దందాను కొనసాగిస్తున్నారని విజయుడు ఆరోపించారు.

అంతేకాదు, దీనికి అడ్డువచ్చిన మండల అధికారులను వెంటవెంటనే బదిలీలు చేయిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే నేడు విజయుడు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ తోపులాట సందర్భంగా విజయుడిని మల్లు రవి దుర్భాషలాడారని, దాడి చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు.

అధికార గర్వంతో కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలపై భౌతిక దాడులకు దిగి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీశారని ఆరోపించారు. సంపత్ అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకే విజయుడిపై మల్లు రవి దాడి చేశారని ఆరోపణలు గుప్పించారు. విజయుడిపై మల్లు రవి చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు ఇంతకు దిగజారారని, చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. విజయుడికి ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.

This post was last modified on January 21, 2026 3:23 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అమరావతికి చట్టబద్ధత తథ్యమేనా?

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. వచ్చే వారం ప్రారంభమయ్యే…

32 minutes ago

టైం వస్తే ఆంధ్రోళ్ల విగ్రహాలు తీయొచ్చన్న కవిత

తన సోదరుడు కేటీఆర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. సికింద్రాబాద్ ను…

49 minutes ago

శర్వా సంక్రాంతులు… ఏడాదిలో 4 సినిమాలు

నారి నారి నడుమ మురారి సక్సెస్ ని ఆస్వాదిస్తున్న శర్వానంద్ ముందులాగా గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు. ప్రేక్షకులకు కంటిన్యూగా…

2 hours ago

పాదయాత్రపై జగన్ అఫిషియల్ క్లారిటీ

మరో పాదయాత్రకు మాజీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారు. ఎన్నికలకు ముందు ఆయన ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్నారు. దీనిపై…

3 hours ago

మరో దావోస్ గా హైదరాబాద్?

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ప్రసంగించిన రేవత్ రెడ్డి కీలక సూచన చేశారు. ఇకపై, ప్రతి సంవత్సరం జూలై…

4 hours ago

‘చనిపోయిన తర్వాత కూడా వదలవా…’ చిన్మయికి కౌంటర్!

కేరళలో జరిగిన దీపక్ ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన…

5 hours ago