Political News

బీఆర్ఎస్ ఎమ్మెల్యే vs కాంగ్రెస్ ఎంపీ.. అసలేం జరిగింది?

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ పై ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నడిగడ్డ ప్రాంతంలో వసూల్ రాజాలు తిరుగుతున్నారని, సంపత్ కుమార్ ఇసుక దందాను కొనసాగిస్తున్నారని విజయుడు ఆరోపించారు.

అంతేకాదు, దీనికి అడ్డువచ్చిన మండల అధికారులను వెంటవెంటనే బదిలీలు చేయిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే నేడు విజయుడు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ తోపులాట సందర్భంగా విజయుడిని మల్లు రవి దుర్భాషలాడారని, దాడి చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు.

అధికార గర్వంతో కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలపై భౌతిక దాడులకు దిగి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీశారని ఆరోపించారు. సంపత్ అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకే విజయుడిపై మల్లు రవి దాడి చేశారని ఆరోపణలు గుప్పించారు. విజయుడిపై మల్లు రవి చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు ఇంతకు దిగజారారని, చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. విజయుడికి ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.

This post was last modified on January 21, 2026 3:23 pm

Share

Recent Posts

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

2 hours ago

ఆంధ్రా పాపకార్న్… నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్!

పాప్ కార్న్‌.. ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. కాల‌క్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్క‌జొన్న లోని…

2 hours ago

ఆదర్శ కుటుంబం ఇంక ఆలస్యం చేయొద్దు

ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…

2 hours ago

`సెల్ఫీ ప్లీజ్`… అంటూ ముద్దు పెట్టేసింది!

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీకి ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న యువ‌త‌ను చేర‌దీసే ప‌నిలో ప‌డిన విష‌యం…

3 hours ago

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

3 hours ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

3 hours ago