“సర్.. ఉద్యోగం వదిలేసి వచ్చా. 25 ఏళ్లుగా పార్టీలో ఉన్నా.. నన్ను కొంచెం చూడండి సర్” అని ఒకరు. “గత ఎన్నికల్లో టికెట్ కూడా వదిలేశా. ఇప్పుడు కూడా మీరు పట్టించుకోకపోతే.. నియోజకవర్గంలో మొహం చూపించలేను.” అని మరొకరు!.. ఇలా.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు.. పలువురు నాయకులు.. గోడు వెళ్లబోసుకున్నారు. గత ఆదివారం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతిలో పాల్గొన్నారు.
అనంతరం పార్టీ సీనియర్లు.. ఆయనను అంతర్గతంగా వన్ – టు – వన్ కలుసుకున్నారు. తమ సమస్యలు చెప్పుకొచ్చారు. ఇదేసమయంలో తమ మనసులోని మాటను కూడా అధినేతకు వివరించారు. కొందరు నాయకులు నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావించారు. మరికొందరు వ్యక్తిగత డిమాండ్లను సునిశితంగా చంద్రబాబు ముందు ఉంచారు. ఇంతకీ.. వీరి ఆవేదన.. ఆకాంక్ష ఒక్కటే.. త్వరలోనే ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లను దక్కించుకోవడమే.
కానీ.. పైకి మాత్రం ఈ డిమాండ్ను నేరుగా చంద్రబాబు ముందు ఉంచరు. కానీ, పరోక్షంగా మాత్రం తమ ప్రతిభను వెలికి తీసి.. చంద్రబాబు ముందు పెట్టారు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. ఎవరికి వారు మౌనంగా చంద్రబాబును కలిసి .. బయటకు వచ్చారు. రెండు రోజుల తర్వాత.. ఈ వ్యవహారం వెలుగు చూసింది. రాజ్యసభ సీట్లు నాలుగు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగులో రెండు కనీసం టీడీపీకి దక్కే అవకాశం ఉంది.
వీటిని దక్కించుకునేందుకు ఇటు కమ్మ సామాజిక వర్గంలో నలుగురు కీలక నాయకులు పోటీలో ఉన్నారు. ఇదేసమయంలో మరో ఎస్సీ నాయకుడు, గతంలో పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి టీడీపీలోకి వచ్చిన వారు ఉన్నారు. ఈయన గతంలోనూ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అయినా.. తనకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ఇక, కమ్మ నేతల్లో మాజీ మంత్రి ఒకరు బలంగానే తన డిమాండ్ను వినిపించారు. కానీ, పైకి మాత్రం ఏమీ తెలియని నాయకులుగా వ్యవహరిస్తున్నారని టీడీపీలో చర్చ సాగుతోంది.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…