“సర్.. ఉద్యోగం వదిలేసి వచ్చా. 25 ఏళ్లుగా పార్టీలో ఉన్నా.. నన్ను కొంచెం చూడండి సర్” అని ఒకరు. “గత ఎన్నికల్లో టికెట్ కూడా వదిలేశా. ఇప్పుడు కూడా మీరు పట్టించుకోకపోతే.. నియోజకవర్గంలో మొహం చూపించలేను.” అని మరొకరు!.. ఇలా.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు.. పలువురు నాయకులు.. గోడు వెళ్లబోసుకున్నారు. గత ఆదివారం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతిలో పాల్గొన్నారు.
అనంతరం పార్టీ సీనియర్లు.. ఆయనను అంతర్గతంగా వన్ – టు – వన్ కలుసుకున్నారు. తమ సమస్యలు చెప్పుకొచ్చారు. ఇదేసమయంలో తమ మనసులోని మాటను కూడా అధినేతకు వివరించారు. కొందరు నాయకులు నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావించారు. మరికొందరు వ్యక్తిగత డిమాండ్లను సునిశితంగా చంద్రబాబు ముందు ఉంచారు. ఇంతకీ.. వీరి ఆవేదన.. ఆకాంక్ష ఒక్కటే.. త్వరలోనే ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లను దక్కించుకోవడమే.
కానీ.. పైకి మాత్రం ఈ డిమాండ్ను నేరుగా చంద్రబాబు ముందు ఉంచరు. కానీ, పరోక్షంగా మాత్రం తమ ప్రతిభను వెలికి తీసి.. చంద్రబాబు ముందు పెట్టారు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. ఎవరికి వారు మౌనంగా చంద్రబాబును కలిసి .. బయటకు వచ్చారు. రెండు రోజుల తర్వాత.. ఈ వ్యవహారం వెలుగు చూసింది. రాజ్యసభ సీట్లు నాలుగు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగులో రెండు కనీసం టీడీపీకి దక్కే అవకాశం ఉంది.
వీటిని దక్కించుకునేందుకు ఇటు కమ్మ సామాజిక వర్గంలో నలుగురు కీలక నాయకులు పోటీలో ఉన్నారు. ఇదేసమయంలో మరో ఎస్సీ నాయకుడు, గతంలో పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి టీడీపీలోకి వచ్చిన వారు ఉన్నారు. ఈయన గతంలోనూ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అయినా.. తనకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ఇక, కమ్మ నేతల్లో మాజీ మంత్రి ఒకరు బలంగానే తన డిమాండ్ను వినిపించారు. కానీ, పైకి మాత్రం ఏమీ తెలియని నాయకులుగా వ్యవహరిస్తున్నారని టీడీపీలో చర్చ సాగుతోంది.
This post was last modified on January 21, 2026 1:00 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…