వచ్చే రెండేళ్లలో ఏపీ ముఖ చిత్రం మారనుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఏపీ ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే రెండేళ్లలోనే సమూలంగా ఏపీ ముఖ చిత్రం మారిపోతుందని అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధానంగా మూడు రీజన్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. 1) పెట్టుబడులు గ్రౌండ్ కావడం. 2) ప్రాజెక్టులు పూర్తి చేయడం. 3) పాలన పరంగా మరింత పారదర్శకతకు పెద్దపీట వేయడం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ల ఇమేజ్ మరింత పెరగడం.
1) పెట్టుబడులు: ఇప్పటి వరకు గత ఏడాది కాలంలో 23.5 లక్షల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఆయా కంపెనీలకు భూములు కూడా కేటాయించింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఒప్పందాలు చేసుకుంటుంది. ఇది ఎలా ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలు గ్రౌండ్ అయ్యేందుకు ఏడాదిన్నర సమయం పట్టనుంది. అప్పుడు భారీ ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి. ఇది ఏపీని ఉన్నత స్థాయికి చేరుస్తుంది.
2) ప్రాజెక్టులు పూర్తి: పోలవరం సహా.. ఇతర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు టైంబౌండ్తో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వీటిని రెండేళ్లలో పూర్తి చేసేందుకు సంకల్పం చెప్పుకొంది. ముఖ్యంగా పోలవరం, నల్లమల సాగర్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక, అమరావతి రాజధానికి 2028 నాటికి తొలి దశ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. తద్వారా.. వచ్చే రెండేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలని భావిస్తోంది. ఇవి సాకారం కావడం తథ్యమైతే.. ఇక, ఏపీ ఉనికి మరోస్థాయికి చేరుతుంది.
3) పాలన, ఇమేజ్: ఈ రెండు కూడా ఏపీని మరో లెవిల్కు తీసుకువెళ్లనున్నాయి. పాలన పరంగా మరింత పారదర్శకతకు పెద్దపీట వేయనున్నారు. ప్రజల ఇష్టానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తద్వారా.. ప్రజలపై భారాలు తగ్గించనున్నారు. ఇక, చంద్రబాబు, పవన్ కల్యాణ్ల ఇమేజ్ కూడా మరింత పెరగనుంది. గ్రామ స్థాయిలో పవన్, నగరాలు పట్టణాల స్థాయిలో చంద్రబాబు ఇమేజ్కు ఢోకా ఉండదన్న అంచనాలు వస్తున్నాయి. దీంతో వచ్చే రెండేళ్లలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు.
This post was last modified on January 21, 2026 10:24 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…