Political News

లోకేష్ పుట్టిన రోజు.. ఓ మంచి పని

టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు ఈ నెల 23న. అప్పటికి ఆయనకు 42 ఏళ్లు నిండి, 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన పుట్టిన రోజులు ఎలా చేసుకున్నా, ఈ ఏడాది నిర్వహించుకునే పుట్టిన రోజు ప్రజలకు గుర్తుండిపోయేలా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్లాన్ చేసింది.

నారా లోకేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పట్టాలు అందించనున్నారు. ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం. ఇప్పటి వరకు కడు నిరుపేదలు ప్రభుత్వ భూములపై లేదా ఇతర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న భూములపై గూడు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అయితే వాటిపై వారికి ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేవు.

ఈ పరిస్థితిని మార్చే దిశగా ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఇలాంటి నిరుపేదలకు వారు నివసిస్తున్న స్థలాలనే క్ర‌మబద్ధీకరించి పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు అదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

అంటే, ఆసరాలేని పేదలు ఎక్కడో ఒక చోట చూసుకుని ఏర్పాటు చేసుకున్న గూళ్లను ఇక నుంచి అధికారికంగా క్ర‌మబద్ధీకరించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి పత్రాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. గత మూడు నెలలుగా నిర్వహించిన సర్వే ఆధారంగా పేదల వివరాలను పరిశీలించి దాదాపు రెండు లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు.

వారు నివసిస్తున్న స్థలం ప్రభుత్వానిదైనా, పోరంబోకు భూమైనా, అక్కడే ఇళ్లున్న పేదలకు ఇప్పుడు చట్టబద్ధ హక్కులు కల్పించనున్నారు. ఈ మొత్తం కార్యక్రమానికి జనవరి 23న నారా లోకేష్ పుట్టిన రోజున ముహూర్తంగా నిర్ణయించారు.

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొననున్నారు. మొదటి దశలో మడకశిర నియోజకవర్గంలోనే పది వేల మందికి పట్టాలు అందించనున్నారు. అనంతరం అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

This post was last modified on January 20, 2026 10:18 pm

Share
Show comments
Published by
Satya
Tags: Lokesh

Recent Posts

డబుల్ ట్రీట్ ఇవ్వనున్న శర్వానంద్

నారి నారి నడుమ మురారి సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న శర్వానంద్ మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ తనకు…

21 minutes ago

వర ప్రసాద్ గారు… అందరి రేట్లు పెరిగినట్లే

సంక్రాంతి బరిలో నిలిచిన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డ్ కలెక్షన్లు మేకర్స్ కి మంచి బూస్ట్…

1 hour ago

90 రోజుల కండీషన్ – టాలీవుడ్ టెన్షన్ టెన్షన్

టాలీవుడ్ వర్గాల్లో ఎక్కడ చూసినా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించిన చర్చే కనిపిస్తోంది. ఇకపై రాష్ట్రంలో టికెట్ ధరలు…

1 hour ago

సూర్య దుల్కర్ భలే తప్పించుకున్నారు

పొంగల్ పండగ సందర్భంగా సెన్సార్ వివాదాలను ఎదురుకుని తమిళంలో విడుదలైన పరాశక్తి ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. పేరుకు వంద…

2 hours ago

ఏపీలో 40 సంస్థలు ఏర్పాటు: బాబుకు దుబాయ్ హామీ

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు బలమైన హామీ లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ముందుకు వచ్చింది.…

2 hours ago

ప్రపంచ కుబేరులు… రాజకీయాలను శాసిస్తున్నారు

ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 3,000 మార్క్‌ను దాటేసింది. ఆశ్చర్యకరమైన విషయం…

2 hours ago