Political News

లోకేష్ పుట్టిన రోజు.. ఓ మంచి పని

టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు ఈ నెల 23న. అప్పటికి ఆయనకు 42 ఏళ్లు నిండి, 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన పుట్టిన రోజులు ఎలా చేసుకున్నా, ఈ ఏడాది నిర్వహించుకునే పుట్టిన రోజు ప్రజలకు గుర్తుండిపోయేలా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్లాన్ చేసింది.

నారా లోకేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పట్టాలు అందించనున్నారు. ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం. ఇప్పటి వరకు కడు నిరుపేదలు ప్రభుత్వ భూములపై లేదా ఇతర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న భూములపై గూడు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అయితే వాటిపై వారికి ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేవు.

ఈ పరిస్థితిని మార్చే దిశగా ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఇలాంటి నిరుపేదలకు వారు నివసిస్తున్న స్థలాలనే క్ర‌మబద్ధీకరించి పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు అదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

అంటే, ఆసరాలేని పేదలు ఎక్కడో ఒక చోట చూసుకుని ఏర్పాటు చేసుకున్న గూళ్లను ఇక నుంచి అధికారికంగా క్ర‌మబద్ధీకరించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి పత్రాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. గత మూడు నెలలుగా నిర్వహించిన సర్వే ఆధారంగా పేదల వివరాలను పరిశీలించి దాదాపు రెండు లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు.

వారు నివసిస్తున్న స్థలం ప్రభుత్వానిదైనా, పోరంబోకు భూమైనా, అక్కడే ఇళ్లున్న పేదలకు ఇప్పుడు చట్టబద్ధ హక్కులు కల్పించనున్నారు. ఈ మొత్తం కార్యక్రమానికి జనవరి 23న నారా లోకేష్ పుట్టిన రోజున ముహూర్తంగా నిర్ణయించారు.

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొననున్నారు. మొదటి దశలో మడకశిర నియోజకవర్గంలోనే పది వేల మందికి పట్టాలు అందించనున్నారు. అనంతరం అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

This post was last modified on January 20, 2026 10:18 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

1 hour ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago