నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో ఇద్దరూ గత 79 రోజులుగా విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్నారు. అయితే మరో కేసు పెండింగ్లో ఉండటంతో, బెయిల్ వచ్చినప్పటికీ జైలు నుంచి వెంటనే విడుదలయ్యే పరిస్థితి లేదు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నమోదైన మరో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఇంకా నిందితుడిగా ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 3న ఎక్సైజ్ అధికారులు అక్కడ దాదాపు రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం, 40 స్పిరిట్ క్యాన్లు, 17,224 మద్యం సీసాలు, ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు, మూతలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కూడా బెయిల్ లభించినప్పుడే జోగి రమేష్ జైలు నుంచి విడుదల అవుతారని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో ఏ1 నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు, జోగి రమేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం దందా ప్రారంభించినట్లు విచారణలో వెల్లడించినట్టు సిట్ పేర్కొంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడం, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కుట్ర జరిగిందని ఆరోపించింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో 2025 నవంబర్ 2న జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
This post was last modified on January 20, 2026 5:25 pm
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…