నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో ఇద్దరూ గత 79 రోజులుగా విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్నారు. అయితే మరో కేసు పెండింగ్లో ఉండటంతో, బెయిల్ వచ్చినప్పటికీ జైలు నుంచి వెంటనే విడుదలయ్యే పరిస్థితి లేదు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నమోదైన మరో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఇంకా నిందితుడిగా ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 3న ఎక్సైజ్ అధికారులు అక్కడ దాదాపు రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం, 40 స్పిరిట్ క్యాన్లు, 17,224 మద్యం సీసాలు, ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు, మూతలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కూడా బెయిల్ లభించినప్పుడే జోగి రమేష్ జైలు నుంచి విడుదల అవుతారని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో ఏ1 నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు, జోగి రమేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం దందా ప్రారంభించినట్లు విచారణలో వెల్లడించినట్టు సిట్ పేర్కొంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడం, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కుట్ర జరిగిందని ఆరోపించింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో 2025 నవంబర్ 2న జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
This post was last modified on January 20, 2026 5:25 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…