నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో ఇద్దరూ గత 79 రోజులుగా విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్నారు. అయితే మరో కేసు పెండింగ్లో ఉండటంతో, బెయిల్ వచ్చినప్పటికీ జైలు నుంచి వెంటనే విడుదలయ్యే పరిస్థితి లేదు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నమోదైన మరో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఇంకా నిందితుడిగా ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 3న ఎక్సైజ్ అధికారులు అక్కడ దాదాపు రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం, 40 స్పిరిట్ క్యాన్లు, 17,224 మద్యం సీసాలు, ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు, మూతలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కూడా బెయిల్ లభించినప్పుడే జోగి రమేష్ జైలు నుంచి విడుదల అవుతారని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో ఏ1 నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు, జోగి రమేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం దందా ప్రారంభించినట్లు విచారణలో వెల్లడించినట్టు సిట్ పేర్కొంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడం, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కుట్ర జరిగిందని ఆరోపించింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో 2025 నవంబర్ 2న జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
This post was last modified on January 20, 2026 5:25 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…