ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ఇటీవల ‘కోటరీలు’, ‘వెనిజులా అధ్యక్షుడు’ అంటూ చేసిన ట్వీట్ ద్వారా వైఎస్ జగన్ను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది. కోటరీల ప్రస్తావన ఇది తొలిసారి కాకపోవడంతో, ఆయన ఎవరిని ఉద్దేశించారన్న దానిపై రాజకీయంగా విస్తృత చర్చ సాగింది.
ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబిన్కు అభినందనలు తెలుపుతూ విజయసాయి మరో ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడం గొప్ప బాధ్యత అని, కేంద్రంతో పాటు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకి ఆయన మార్గదర్శనం చేయనున్నారని పేర్కొన్నారు. బీజేపీకి ఇప్పటివరకు అతి పిన్న వయసు అధ్యక్షుడిగా నితిన్ నబిన్ పార్టీకి మేలు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే మరో రెండు రోజుల్లో లిక్కర్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోనున్న సమయంలో బీజేపీపై ప్రశంసల వర్షం కురిపించటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో విజయసాయి నిందితుడిగా ఉండటం గమనార్హం. ఇదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఇటీవల ఢిల్లీలో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో సంచలనాలు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో విజయసాయి ట్వీట్ వెనక అసలు ఉద్దేశం ఏమిటి? లిక్కర్ కేసుతో దీనికి ఏమైనా సంబంధముందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
This post was last modified on January 20, 2026 3:55 pm
విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…