దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. మార్గం మధ్యలో జ్యురిచ్లో ఆగారు. షెడ్యూల్లో భాగంగా జ్యూరిచ్లోనూ పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు పాల్గొంటారు. జ్యూరిచ్కు చేరుకోగానే.. సీఎం చంద్రబాబుకు స్థానిక తెలుగు వారి నుంచి భారీ స్వాగతం లభించింది. 20కి పైగా యూరప్ దేశాలకు చెందిన ఎన్నారైలు.. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక వాహనాల్లో తరలి వచ్చి.. సీఎంకు స్వాగతం పలికారు.
అనంతరం.. భారత అంబాసిడర్ మృదుల్ కుమార్ కూడా సీఎం చంద్రబాబుకు ప్రొటోకాల్ స్వాగతం పలి కారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు ఆయనతో ఏపీకి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంగా ఉందన్నారు. జ్యూరిచ్లో ఈ రోజు రేపు.. కీలక సమావేశం జరగనుంది. దీనిలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. దీనిలో సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు.
ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాపారం, విద్య, పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులపై ఆయ న దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా జ్యూరిచ్లో సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అమరావతి రాజధానిలో జరుగుతున్న పనులను ఆయనకు వివరించారు. 2028నాటికి తొలిదశ పనులు పూర్తయ్యేలా వేగం పెంచామని చెప్పారు. సింగపూర్ భాగస్వామ్యాన్ని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను చంద్రబాబు తన ఎక్స్లో పోస్టు చేశారు.
This post was last modified on January 19, 2026 3:06 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…