ఏపీలో ఉద్యోగులు అలెర్ట్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. వచ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో పాలనను సంస్కరిస్తున్న కూటమి ప్రభుత్వం ఆదిశగా చేయాల్సిన ముందస్తు పనులను వేగంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉద్యోగుల సమయ పాలనతోపాటు.. ఫైళ్ల క్లియరెన్స్ వంటివిషయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి గుండెకాయ వంటి సచివాలయం నుంచే ఈ మార్పులు జరగనున్నాయి.
సచివాలయ సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు.. సచివాలయమే అద్దం పడుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ప్రధాన సమస్యలు సచివాలయానికే చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగులను సరైన సమయంలో పనిచేయించుకునే దిశగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉద్యోగుల సమయపాలనపై కఠిన నిబంధనలు అమ లు చేయనుంది.
తద్వారా పెండింగు ఫైళ్ల క్లియరెన్సుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం నెల రోజులకు సరిపడా ఫైళ్లు పెండింగులో ఉన్నాయి. దీంతో గ్రామీణ స్థాయిలో చేపట్టాల్సిన పనులు.. పెండింగులో పడుతున్నాయి. దీనికి సమయ పాలన పాటించని ఉద్యోగులే కారణమని అధికారులు నివేదిక ఇచ్చారు. దీంతో సచివాలయంలో సమయపాలనకు ప్రాధాన్యం పెంచుతున్నారు. అదేసమయంలో ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై విధులకు కచ్చితమైన సమయానికి హాజరుకావాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇక, ఉద్యోగుల సమయ పాలనకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది. ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులకు ఆ రోజు వేతనంలో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేసమయంలో లంచ్ బ్రేక్ సమయాన్ని కూడా కచ్చితంగా పాటించాలని పేర్కొంది. క్యాంటన్లలో ముచ్చట్లు పెట్టుకునే వారికి.. ఆఫీసు వేళల్లో సంఘాల సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ.. సుపరిపాలనలో భాగమేనని స్పష్టం చేసింది. మరోవైపు.. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను సంక్రాంతి సందర్భంగా సర్కారు క్లియర్ చేసింది.
This post was last modified on January 16, 2026 2:50 pm
ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య…
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి…
‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో వారంలో ఏపీకి రానున్నారు. ఆగస్టు 1వ తేదీన ఆయన విజయనగరం జిల్లా భోగాపురానికి…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అర్థరాత్రి సెల్ఫీ…
తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీకి ఆశించిన ఓపెనింగ్ దక్కింది. టాక్ పరంగా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఒకసారి…