Political News

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం నేరుగా స్పందించారు. నదీగర్భంలో రాజధానిని నిర్మిస్తున్నారని, రెండో విడత భూములు సేకరిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తిప్పికొట్టారు.

జగన్‌కు నాగరికత తెలియదని మండిపడ్డ చంద్రబాబు, నదుల ఒడ్డునే నాగరికత విలసిల్లిందన్న కనీస జ్ఞానం కూడా ఆయనకు లేదన్నారు. అందుకే మిడిమిడి జ్ఞానంతో అమరావతిపై వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిపై జగన్ చేసే వ్యాఖ్యలను ఎవ్వరూ నమ్మబోరని, పైగా ప్రజలు నవ్వుతున్నారని చెప్పారు.

“సింధు నది నుంచే సింధు నాగరికత వచ్చింది. నైలు నది నుంచి నైలు నాగరికత వచ్చింది. ఈ విషయాలు కూడా తెలియకపోతే ఆ మనిషిని ఏమనాలి. ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో ఆయనే చెప్పాలి” అంటూ చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింధు నాగరికతపై జగన్ పాఠాలు నేర్చుకుంటే మంచిదని సూచించారు.

మన దేశ రాజధాని ఢిల్లీ కూడా యమునా నది పక్కనే ఉందని గుర్తు చేశారు. నదుల వెంబడి ఉండటమే ఆయా నగరాలకు, ప్రాంతాలకు గుర్తింపు తెచ్చిందని, అభివృద్ధి కూడా వేగంగా జరిగిందని చంద్రబాబు వివరించారు.

ఇదే సందర్భంలో జగన్‌పై మరో కీలక వ్యాఖ్య చేశారు. నదీగర్భం (రివర్ బెడ్), నదీ పరివాహక ప్రాంతం (రివర్ బేసిన్) మధ్య తేడా కూడా తెలియదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా జగన్‌కు జ్ఞానం రావడం లేదని విమర్శించారు. ఇంకా అమరావతిపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.

ఎంత మంది సైంధవులు, కీచకులు అడ్డుపడ్డా రాజధాని నిర్మాణాన్ని ఆపలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి రైతులకు మేలు చేయడం, వారి ఆకాంక్షలు తీర్చడం తన బాధ్యత అని తెలిపారు. ఈ విషయంలో రైతులను తప్పుదోవ పట్టించే వారిని రాజకీయంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.

ఇరు రాష్ట్రాలు..

జల వివాదాలపై సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించుకోవాలంటే కలిసి కూర్చుని చర్చించుకోవడం మంచిదని సూచించారు. ఇరు రాష్ట్రాలు తనకు ముఖ్యమేనని చెబుతూ, గోదావరి నుంచి వృథాగా పోతున్న నీటిని వినియోగించి రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు చేద్దామని అన్నారు.

రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుపై గతంలో అనేక విమర్శలు చేశారని, కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టు కారణంగా సీమ ప్రాంతాలకు నీరు అందుతోందని చెప్పారు. గోదావరి నీటిని సద్వినియోగం చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Satya

Recent Posts

పేరు చెబితే ల‌క్ష… స‌ర్కారు బంప‌ర్ ఆఫ‌ర్‌!

ప్ర‌భుత్వాలు చేప‌ట్టే కీల‌క కార్య‌క్ర‌మాల‌కు పేర్లు సూచించే వారికి బ‌హుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుక‌లు కూడా ఇస్తాయి. గ‌తంలో స్వ‌చ్ఛ…

2 hours ago

జ‌గ‌న్ నాన్చారు.. చంద్ర‌బాబు తేల్చారు: ఉద్యోగుల‌కు పండ‌గ‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ఐదేళ్లు పాలించిన జ‌గ‌న్‌.. నానుస్తూ వ‌చ్చి.. చివ‌ర‌కు త‌న‌కు సాధ్యంకాద‌ని…

2 hours ago

కళ్యాణ్ రామ్ మీద నవ్వించే బరువు

వెంకటేష్, అనిల్ రావిపూడి అయిదోసారి చేతులు కలిపిన మల్టీస్టారర్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. వెంకీకి తోడుగా కళ్యాణ్ రామ్…

4 hours ago

కోటీశ్వరుడితో పెళ్ళి, కానీ ప్రేమికుడి కోసం….

పెళ్ల‌యిన త‌ర్వాత‌.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం కామ‌న్‌. ఈ క్ర‌మంలో ఒక‌ప్పుడు భార్య‌ల‌ను చంపే భ‌ర్త‌ల వ్య‌వ‌హారాలు పెద్ద…

9 hours ago

తెప్ప త‌గ‌లేసిన త‌మ‌న్నా

కెరీర్ తొలి నాళ్ల‌లో పెద్ద‌గా అవ‌కాశాలు లేన‌పుడు ద‌క్షిణాదిన వ‌చ్చే ప్ర‌తి ఛాన్సునూ మ‌హా ప్ర‌సాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…

9 hours ago

పెద్ది ఈవెంట్ లో పవన్ హవా

మెగా హీరోల సినిమాల‌కు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్క‌డో ఒక చోట ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

11 hours ago