Political News

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం నేరుగా స్పందించారు. నదీగర్భంలో రాజధానిని నిర్మిస్తున్నారని, రెండో విడత భూములు సేకరిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తిప్పికొట్టారు.

జగన్‌కు నాగరికత తెలియదని మండిపడ్డ చంద్రబాబు, నదుల ఒడ్డునే నాగరికత విలసిల్లిందన్న కనీస జ్ఞానం కూడా ఆయనకు లేదన్నారు. అందుకే మిడిమిడి జ్ఞానంతో అమరావతిపై వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిపై జగన్ చేసే వ్యాఖ్యలను ఎవ్వరూ నమ్మబోరని, పైగా ప్రజలు నవ్వుతున్నారని చెప్పారు.

“సింధు నది నుంచే సింధు నాగరికత వచ్చింది. నైలు నది నుంచి నైలు నాగరికత వచ్చింది. ఈ విషయాలు కూడా తెలియకపోతే ఆ మనిషిని ఏమనాలి. ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో ఆయనే చెప్పాలి” అంటూ చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింధు నాగరికతపై జగన్ పాఠాలు నేర్చుకుంటే మంచిదని సూచించారు.

మన దేశ రాజధాని ఢిల్లీ కూడా యమునా నది పక్కనే ఉందని గుర్తు చేశారు. నదుల వెంబడి ఉండటమే ఆయా నగరాలకు, ప్రాంతాలకు గుర్తింపు తెచ్చిందని, అభివృద్ధి కూడా వేగంగా జరిగిందని చంద్రబాబు వివరించారు.

ఇదే సందర్భంలో జగన్‌పై మరో కీలక వ్యాఖ్య చేశారు. నదీగర్భం (రివర్ బెడ్), నదీ పరివాహక ప్రాంతం (రివర్ బేసిన్) మధ్య తేడా కూడా తెలియదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా జగన్‌కు జ్ఞానం రావడం లేదని విమర్శించారు. ఇంకా అమరావతిపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.

ఎంత మంది సైంధవులు, కీచకులు అడ్డుపడ్డా రాజధాని నిర్మాణాన్ని ఆపలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి రైతులకు మేలు చేయడం, వారి ఆకాంక్షలు తీర్చడం తన బాధ్యత అని తెలిపారు. ఈ విషయంలో రైతులను తప్పుదోవ పట్టించే వారిని రాజకీయంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.

ఇరు రాష్ట్రాలు..

జల వివాదాలపై సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించుకోవాలంటే కలిసి కూర్చుని చర్చించుకోవడం మంచిదని సూచించారు. ఇరు రాష్ట్రాలు తనకు ముఖ్యమేనని చెబుతూ, గోదావరి నుంచి వృథాగా పోతున్న నీటిని వినియోగించి రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు చేద్దామని అన్నారు.

రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుపై గతంలో అనేక విమర్శలు చేశారని, కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టు కారణంగా సీమ ప్రాంతాలకు నీరు అందుతోందని చెప్పారు. గోదావరి నీటిని సద్వినియోగం చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago