పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన పాలన. అదే పని చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పిఠాపురం కాలనీల్లో నడుచుకుంటూ వెళ్లి డ్రైనేజీ, చెత్త సమస్యలను స్వయంగా పరిశీలించారు. ప్రజలు చెప్పిన ఇబ్బందులను విని, వెంటనే పరిష్కారం కావాలని అధికారులకు స్పష్టం చేశారు.
పిఠాపురంలో కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, శుభ్రం కాని డ్రైనేజీ ప్రజల జీవనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పరిస్థితిని చూసి పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నన్ను చీపురు పట్టుకుని రోడ్లు తుడవమంటారా?” అన్న ఆయన మాటలు అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపించాయి.
ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అందించడంలో మున్సిపల్ యంత్రాంగం విఫలమైందని పవన్ స్పష్టం చేశారు. ‘గుడ్ మార్నింగ్ పిఠాపురం’ వంటి కార్యక్రమాలు ఉన్నా, అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని ప్రశ్నించారు. పిఠాపురం అభివృద్ధి కోసం పాడా ఏర్పాటు చేసినా, పనులు వేగంగా జరగకపోతే ప్రయోజనం ఉండదని చెప్పారు.
తన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికారులు బాధ్యతగా పనిచేయకపోతే ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుందని పవన్ హెచ్చరించారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…