పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన పాలన. అదే పని చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పిఠాపురం కాలనీల్లో నడుచుకుంటూ వెళ్లి డ్రైనేజీ, చెత్త సమస్యలను స్వయంగా పరిశీలించారు. ప్రజలు చెప్పిన ఇబ్బందులను విని, వెంటనే పరిష్కారం కావాలని అధికారులకు స్పష్టం చేశారు.
పిఠాపురంలో కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, శుభ్రం కాని డ్రైనేజీ ప్రజల జీవనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పరిస్థితిని చూసి పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నన్ను చీపురు పట్టుకుని రోడ్లు తుడవమంటారా?” అన్న ఆయన మాటలు అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపించాయి.
ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అందించడంలో మున్సిపల్ యంత్రాంగం విఫలమైందని పవన్ స్పష్టం చేశారు. ‘గుడ్ మార్నింగ్ పిఠాపురం’ వంటి కార్యక్రమాలు ఉన్నా, అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని ప్రశ్నించారు. పిఠాపురం అభివృద్ధి కోసం పాడా ఏర్పాటు చేసినా, పనులు వేగంగా జరగకపోతే ప్రయోజనం ఉండదని చెప్పారు.
తన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికారులు బాధ్యతగా పనిచేయకపోతే ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుందని పవన్ హెచ్చరించారు.
This post was last modified on January 10, 2026 10:21 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…