Political News

సీమ సెంటిమెంటు… ఏ పార్టీకి సొంతం..!

రాయలసీమను రత్నాల సీమ చేస్తామని ఒకరు, రాయలసీమ కష్టాలు నావి, నేను వాటిని పరిష్కరిస్తానని మరొకరు… ఇలా ఏపీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇద్దరూ సీమ సమస్యలపై స్పందిస్తూనే ఉన్నారు. కానీ సీమ సమస్యలు మాత్రం ముందుకు సాగడం లేదు.

ఒకటి కాదు, రెండు కాదు… అనేక ప్రాజెక్టులు మూలనపడ్డాయి. గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు నీరు అందుతుంది. ఈ విషయంలో కూడా ప్రభుత్వాలు ఉదాసీనంగానే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదేసమయంలో, పూర్తి కాని ప్రాజెక్టులను భుజాన వేసుకుని ప్రజలను ప్రకటనలతో మురిపిస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఈ క్రమంలో సీమ సెంటిమెంటును పట్టుకునే విషయంలో రాజకీయ నాయకులు విఫలమవుతున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

వాస్తవానికి భారీ ప్రాజెక్టులు చేపట్టకపోయినా ఫర్వాలేదని, కనీసం ఉన్న ప్రాజెక్టులను అయినా పూర్తి చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. వలసలు లేని సీమ గ్రామాలు కావాలని అంటున్నారు.

ఈ నేపథ్యంలో సీమ సెంటిమెంటును గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం పార్టీలపై ఉంది. కర్నూలు జిల్లా కోసిగి సహా అనేక ప్రాంతాల్లో ఏటా ఎనిమిది నెలల పాటు జనాలు ఉండరంటే ఆశ్చర్యమే. నంద్యాలలో రైతుల దుస్థితి కూడా ఇలాగే ఉందంటే విస్మయం కలుగుతుంది.

తక్షణ అవసరంగా రైతులకు అవసరమైన చిన్నపాటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే నీరు వచ్చి రైతులు ఆనందిస్తారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. వైసీపీ అయినా, టీడీపీ అయినా భారీ ప్రాజెక్టులకే మొగ్గు చూపుతున్నాయి.

ఇక తుంగభద్ర నుంచి వచ్చే నీటిపై కర్ణాటక పెత్తనం పెరుగుతోంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి రిజర్వాయర్ ఎత్తును పెంచుతోంది. ఈ సమస్యలను ముందుగా పరిష్కరించాలని సీమ ప్రజలు కోరుతున్నారు.

ఇవి పరిష్కరిస్తే ప్రస్తుతం బీళ్లుగా మారుతున్న పొలాలకు నీరు చేరుతుందని, దాంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు అంటున్నారు. ఈ దిశగా నిజమైన ప్రయత్నం చేస్తే సీమ సెంటిమెంటును పార్టీలు నిజంగా అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది.

This post was last modified on January 7, 2026 6:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి సినిమాలకు ‘కేసరి’ కనెక్షన్

కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైనపుడు ఫ్లాప్ అవుతుంటాయి. కానీ టీవీల్లో, ఓటీటీల్లో వాటికి మంచి స్పందన వస్తుంటుంది. కాల క్రమంలో అవి కల్ట్ స్టేటస్…

3 hours ago

మెగా జోష్ తీసుకొచ్చిన వరప్రసాద్ వేడుక

మన శంకరవరప్రసాద్ గారు ప్రమోషన్లలో చివరి ఘట్టం పూర్తయ్యింది. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్…

7 hours ago

వింటేజ్ చిరుని బయటికి తెచ్చిన హుక్ స్టెప్

మన శంకరవరప్రసాదుగారులోని చివరి పాట వచ్చేసింది. ముందు నుంచి దీని గురించి ఓ రేంజ్ లో చెబుతూ వచ్చిన టీమ్…

8 hours ago

రాజాసాబ్‌కు జాక్‌పాట్!

ప్ర‌భాస్ హీరోగా మారుతి రూపొందించిన రాజాసాబ్ డిసెంబ‌రు 5నే రిలీజ్ కావాల్సింది. కానీ సంక్రాంతి సీజ‌న్ అయితే బాగుంటుంద‌ని ఈ…

11 hours ago

‘రాజా సాబ్’తో ఎందుకు బంగారం

చాలా గ్యాప్ తర్వాత సమంతా ఫుల్ లెన్త్ మూవీతో రాబోతోంది. తనే నిర్మించిన శుభంలో చిన్న క్యామియో చేసినప్పటికీ అది…

11 hours ago

ఇరు పార్టీలకు ప్రవీణ్ ప్రకాష్ ఒక రిక్వెస్ట్

ఏపీ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత ఇటీవల తరచుగా…

11 hours ago