ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు శుభవార్త చెప్పారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, ఈ నెల 6వ తేదీ వరకు తీసుకున్న రూ.1.50 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు.
రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ చేసిన విజ్ఞప్తిపై సీఎంతో చర్చించగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే రైతులకు చెల్లించే కౌలు పెంపుపై కూడా సీఎం ప్రాథమికంగా అంగీకరించినట్లు వెల్లడించారు.
అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు. తుళ్లూరు మండలం వడ్డమానులో జరిగిన కార్యక్రమంలో తమ భూములను ల్యాండ్ పూలింగ్కు ఇవ్వడానికి సమ్మతి తెలుపుతూ పలువురు గ్రామస్తులు ఫారం–1ను మంత్రికి అందజేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు ఇచ్చిన సహకారాన్ని ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
రాజధాని అభివృద్ధి కోసం సేకరించిన భూములను అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులకు వినియోగించనున్నట్లు మంత్రి చెప్పారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. రైతులకు కేటాయించే స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు.
This post was last modified on January 7, 2026 2:15 pm
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…