కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు, వేగం పుంజుకున్నాయి. గత 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పనులు 13 శాతం మేర పూర్తికాగా, మొత్తం నిర్మాణం ఇప్పటివరకు 87.8 శాతానికి చేరుకుంది. 2014 నుంచి 2019 మధ్యకాలంలోనే సివిల్ పనులు 72 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు.
అయితే 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాలనలో కనీసం 2 శాతం పనులు కూడా ముందుకు సాగలేదని వెల్లడించారు. ఈ లోటును పూరించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్తో పాటు కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2 పనులను సీఎం ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.
అదే విధంగా నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతినీ ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు సైట్ వద్దనే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మిగిలిన పనులను వేగవంతం చేసే అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అధికారులు వెల్లడిస్తున్నారు.
This post was last modified on January 7, 2026 8:14 am
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…