కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు, వేగం పుంజుకున్నాయి. గత 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పనులు 13 శాతం మేర పూర్తికాగా, మొత్తం నిర్మాణం ఇప్పటివరకు 87.8 శాతానికి చేరుకుంది. 2014 నుంచి 2019 మధ్యకాలంలోనే సివిల్ పనులు 72 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు.
అయితే 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాలనలో కనీసం 2 శాతం పనులు కూడా ముందుకు సాగలేదని వెల్లడించారు. ఈ లోటును పూరించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్తో పాటు కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2 పనులను సీఎం ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.
అదే విధంగా నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతినీ ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు సైట్ వద్దనే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మిగిలిన పనులను వేగవంతం చేసే అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అధికారులు వెల్లడిస్తున్నారు.
This post was last modified on January 7, 2026 8:14 am
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…