టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ త్వరలో ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన అమరావతికి చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ సందర్భంగా ధోనీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు..ఈ సమావేశంలో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువ క్రీడాకారులకు శిక్షణ అవకాశాల విస్తరణపై చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా క్రికెట్ అకాడమీ ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ధోనీ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశం మళ్లీ చర్చకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గత పాలన సమయంలో 2018లో విశాఖపట్నంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు కోసం కుదిరిన అవగాహన ఒప్పందం ఇప్పుడు తిరిగి అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత జట్టుకు నాయకత్వం వహించి మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను అందించిన ధోనీ ప్రస్తుతం నాగ్పూర్, ఖతార్ వంటి ప్రాంతాల్లో క్రికెట్ అకాడమీలను నిర్వహిస్తున్నారు. క్రీడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించాలనే లక్ష్యంతో ధోనీతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదే సమయంలో 2027 జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో, ప్రతిపాదిత క్రికెట్ అకాడమీ రాష్ట్ర క్రీడా రంగానికి కీలకంగా మారనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on January 6, 2026 12:47 pm
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…