Political News

ఏపీకి రానున్న ధోనీ.. సీఎంతో భేటీకి కారణం?

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన అమరావతికి చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ సందర్భంగా ధోనీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు..ఈ సమావేశంలో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువ క్రీడాకారులకు శిక్షణ అవకాశాల విస్తరణపై చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా క్రికెట్ అకాడమీ ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ధోనీ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశం మళ్లీ చర్చకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గత పాలన సమయంలో 2018లో విశాఖపట్నంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు కోసం కుదిరిన అవగాహన ఒప్పందం ఇప్పుడు తిరిగి అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత జట్టుకు నాయకత్వం వహించి మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను అందించిన ధోనీ ప్రస్తుతం నాగ్‌పూర్, ఖతార్ వంటి ప్రాంతాల్లో క్రికెట్ అకాడమీలను నిర్వహిస్తున్నారు. క్రీడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించాలనే లక్ష్యంతో ధోనీతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదే సమయంలో 2027 జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో, ప్రతిపాదిత క్రికెట్ అకాడమీ రాష్ట్ర క్రీడా రంగానికి కీలకంగా మారనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on January 6, 2026 12:47 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago