Political News

దీపక్ రెడ్డికి జీతం వచ్చింది!

కలెక్టర్లపై ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి కలెక్టర్లు గ్రహణం, దరిద్రం పట్టినట్లుగా పట్టారని ఆయన చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. 14 నెలలుగా తనకు జీతమివ్వడం లేదని, ఫైనాన్స్ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా తన జీతం ఫైల్ క్లియర్ చేయడం లేదని ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగానే విమర్శించారు.

14 నెలలుగా ఒక ఫైల్ క్లియర్ చేయలేని అధికారికి ఆ సీటులో కూర్చునే అర్హత లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. దొంగలు, టైమ్ పాస్ చేసే వ్యక్తులు ఐఏఎస్ వ్యవస్థలోనూ ఉన్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కలెక్టర్లిచ్చిన సమాచారంతోనే 2019లో చంద్రబాబు, 2024లో జగన్ ఓడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే దీపక్‌రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. దీంతో, దీపక్ రెడ్డి జీతం బకాయిలు విడుదల చేస్తూ తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది.

సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన దీపక్ రెడ్డి జీత బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. దీపక్ రెడ్డి కామెంట్లతో కూటమి ప్రభుత్వానికి కాస్త డ్యామేజీ జరిగింది. దీంతో, ప్రభుత్వం అలర్ట్ అయి ఆ ఇష్యూపై ఫోకస్ చేసింది.

వాస్తవానికి ఇటువంటి అసంతృప్తిని దీపక్ రెడ్డి బహిరంగంగా వెళ్లగక్కారు. కానీ, బయటపడని వారు ఇంకా చాలామంది ఉన్నారు అని టీడీపీ నేతలు కొందరు అనుకుంటున్నారు. ఓ పక్క బ్యూరోక్రాట్లను, మరో పక్క పొలిటిషియన్లను బ్యాలెన్స్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ, కొన్ని చోట్ల కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇలా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.

This post was last modified on January 6, 2026 12:50 pm

Share

Recent Posts

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

1 hour ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

1 hour ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

2 hours ago

కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్నీ… వదలమంటున్న బొద్దింకలు

ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…

2 hours ago

కలకలం… 140 కోట్ల మందిపై ‘డ్రాగన్’ నిఘా?

అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…

4 hours ago

హీరోపై విరుచుకుపడిన అత్తగారు

తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…

4 hours ago