Political News

దీపక్ రెడ్డికి జీతం వచ్చింది!

కలెక్టర్లపై ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి కలెక్టర్లు గ్రహణం, దరిద్రం పట్టినట్లుగా పట్టారని ఆయన చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. 14 నెలలుగా తనకు జీతమివ్వడం లేదని, ఫైనాన్స్ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా తన జీతం ఫైల్ క్లియర్ చేయడం లేదని ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగానే విమర్శించారు.

14 నెలలుగా ఒక ఫైల్ క్లియర్ చేయలేని అధికారికి ఆ సీటులో కూర్చునే అర్హత లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. దొంగలు, టైమ్ పాస్ చేసే వ్యక్తులు ఐఏఎస్ వ్యవస్థలోనూ ఉన్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కలెక్టర్లిచ్చిన సమాచారంతోనే 2019లో చంద్రబాబు, 2024లో జగన్ ఓడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే దీపక్‌రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. దీంతో, దీపక్ రెడ్డి జీతం బకాయిలు విడుదల చేస్తూ తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది.

సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన దీపక్ రెడ్డి జీత బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. దీపక్ రెడ్డి కామెంట్లతో కూటమి ప్రభుత్వానికి కాస్త డ్యామేజీ జరిగింది. దీంతో, ప్రభుత్వం అలర్ట్ అయి ఆ ఇష్యూపై ఫోకస్ చేసింది.

వాస్తవానికి ఇటువంటి అసంతృప్తిని దీపక్ రెడ్డి బహిరంగంగా వెళ్లగక్కారు. కానీ, బయటపడని వారు ఇంకా చాలామంది ఉన్నారు అని టీడీపీ నేతలు కొందరు అనుకుంటున్నారు. ఓ పక్క బ్యూరోక్రాట్లను, మరో పక్క పొలిటిషియన్లను బ్యాలెన్స్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ, కొన్ని చోట్ల కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇలా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.

This post was last modified on January 6, 2026 12:50 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Deepak Reddy

Recent Posts

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

5 minutes ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

39 minutes ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

2 hours ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

3 hours ago

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…

4 hours ago

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…

6 hours ago