Political News

‘తెలుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సింది ద్వేషం కాదు’

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పేరిట విద్వేషాలు పెంచుకోవడం సరికాదని, పరస్పర సయోధ్యతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు వేదికగా నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు పెంచుకోవడం సరికాదని, సయోధ్యతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల కోసం ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. జల వివాదాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

గోదావరి జలాలను వినియోగించుకోవడంపై తెలంగాణకు తాను ఎప్పుడూ అడ్డు చెప్పలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు కూడా నీళ్లు వస్తాయని భావించానన్నారు.

గంగా–కావేరి నదులు అనుసంధానమైతే దేశం మొత్తం సస్యశ్యామలంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సుమారు మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని గుర్తుచేశారు.

కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో తెలంగాణకు నీటిని అందించామని, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు ప్రాజెక్టులను కృష్ణా నదిపై తానే పూర్తి చేసినట్టు తెలిపారు. కృష్ణా డెల్టా మోడరైజేషన్‌లో భాగంగా 20 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్‌ను కూడా పూర్తి చేశామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పరస్పర సహకారంతోనే సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు.

This post was last modified on January 5, 2026 4:44 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

44 minutes ago

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…

1 hour ago

కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…

2 hours ago

తిరుమలలో పాము కాటు… నిజమెంత?

తిరుమ‌ల‌పై మ‌రో దుష్ప్ర‌చారం జ‌ర‌గ‌డంపై ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కార‌ణం ఎవ‌రు? ఎక్క‌డ నుంచి జ‌రిగింది?…

5 hours ago

అసెంబ్లీలో ల‌డ్డూపై చ‌ర్చ‌.. కానీ జగన్…

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దానికి త‌గిన విధంగా ప‌నిచే స్తున్నారా? అనేది…

8 hours ago

జగన్ వస్తే లోకేష్ టికెట్ ఇస్తారట

త‌న‌పై వైసీపీ నాయ‌కులు స‌హా.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…

9 hours ago