తెలంగాణలో త్వరలోనే 117 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెలలోనే వీటికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ కూడా రానుంది. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో ఏపీకి చెందిన జనసేన కూడా వ్యూహాత్మకంగా ప్రయత్నాలు ప్రారంభించింది.
తెలంగాణ మునిసిపల్ ఎన్నికలే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న జనసేన పార్టీ అన్ని విభాగాల కమిటీలను రద్దు చేశారు. వీటి స్థానంలో కొత్తగా అభ్యర్థులను నియమించి కమిటీలను ఉత్తేజ పరచనున్నారు. అప్పటివరకు 30 రోజుల పాటు అమల్లో ఉండేలా తాత్కాలిక (అడహాక్) కమిటీలను నియమించారు. ఈ కమిటీలకు కొన్ని కీలక బాధ్యతలు కూడా అప్పగించారు.
ఇవీ కమిటీలు:
ఈ కమిటీలకు ప్రస్తుతం ఉన్న అభ్యర్థులను తొలగించారు. వారి స్థానంలో తాత్కాలికంగా ఈ కమిటీలను నియమించారు. వచ్చే 15 రోజుల్లో ఈ తాత్కాలిక కమిటీలు వార్డుల వారిగా పర్యటించి బలమైన ఆకాంక్ష ఉన్న యువతను వెతికి పట్టుకోవాలని సూచించారు.
ప్రస్తుతం నియమించిన కమిటీలలోని యాక్టివ్ సభ్యులతో పాటు కొత్తగా నమోదు అయ్యే సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి వార్డు నుంచి కనీసం ఐదుగురు సభ్యులను ఎంపిక చేయనున్నారు. వీరిని అన్ని విధాలా పరిశీలించిన తర్వాత కమిటీలను ఖరారు చేస్తారు. తద్వారా స్థానిక సంస్థల్లో విజయం లక్ష్యంగా జనసేన అడుగులు వేయనుంది.
This post was last modified on January 5, 2026 2:29 pm
తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సీజన్లో మొత్తం 5 రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలు…
టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఆట తీరు గురించి సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్…
నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారులను, పోలీసులను కూడా బెదిరించిన విషయం తెలిసిందే. తాట…
పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030…
ఏపీ రాజధాని అమరావతి రైతుల విషయంలో మరోసారి సీఎం చంద్రబాబు తన మనసు చాటుకున్నారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను…
ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకోవడం, ఎవరో ఒకరు టికెట్ రేట్లు అన్యాయమంటూ కోర్టుకు వెళ్లడం, తర్వాత సదరు మంత్రులు ఇకపై…