తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ తీరు, నాయకత్వ వైఖరిపై ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, సభలో భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. గత ఎనిమిదేళ్లుగా ప్రజల కోసం చేసిన తన ప్రయత్నాలను అడ్డుకున్నారని, పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానెళ్లు, పత్రికలు కూడా తనకు మద్దతుగా నిలవలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ తనను ఘోరంగా అవమానించిందని కవిత పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత గౌరవం లేకుంటే ఎలా కొనసాగాలని ప్రశ్నించారు. దురాగతాలపై బీఆర్ఎస్ అధిష్టానానికి పలుమార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పునకు తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. కేసీఆర్పై కక్షతోనే బీజేపీ తనను జైలుకు పంపిందని, ఈడీ, సీబీఐ కేసులపై పోరాడుతున్న సమయంలో కూడా బీఆర్ఎస్ తనకు అండగా నిలవలేదని విమర్శించారు.
అదే సమయంలో శాసనమండలిలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ సఫలమైందని వ్యాఖ్యలు వినిపించాయి. రాజ్యాంగ స్ఫూర్తితో బీఆర్ఎస్ పనిచేయడం లేదని కవిత ఆరోపించారు. లక్ష్మీనరసింహస్వామి, తన ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఇది ఆస్తుల పంచాయతీ కాదు.. ఆత్మగౌరవ పంచాయతీ అని స్పష్టం చేశారు. నైతికత లేని పార్టీలో తాను ఉండదల్చుకోలేదని, అందుకే తన రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నట్లు కవిత ప్రకటించారు.
This post was last modified on January 5, 2026 1:45 pm
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…