రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూఅప్ భారాన్ని ప్రజలపై మోపబోమని కూటమి ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది.
మొత్తం రూ.4,498 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రజలపై ఒక్క పైసా కూడా పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆ లేఖలో పేర్కొంది. దీంతో విద్యుత్ చార్జీల పెంపుపై ఉన్న భయాలకు తెరపడింది. ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ట్రూడౌన్ అమలు ద్వారా యూనిట్ విద్యుత్ చార్జీలను తగ్గించి ఉపశమనం కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు వేల కోట్ల భారాన్ని కూడా ప్రజలపై పడకుండా భుజాన వేసుకోవడం ద్వారా ప్రజా హిత పాలనకు నిదర్శనంగా నిలిచింది.
This post was last modified on January 1, 2026 9:06 pm
సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న పోలీస్ అధికారుల్లో సజ్జనార్ ఒకరు. యువత ఆయనకు బాగా కనెక్ట్ అవుతారు. ఓవైపు…
న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు అభిమానులు భారీ నెంబర్లు ఆశించారు. మురారి, సీతమ్మ వాకిట్లో…
ఫిబ్రవరి 1 నుంచి ఒక్క సిగరెట్ ధర రూ.72కు పెరుగుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతం…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త రూటు పట్టాడు. పెద్దగా హడావిడి లేకుండా షూటింగ్ చేసుకుంటూ ఆల్రెడీ ఫస్ట్…
కేవలం పదకొండు రోజుల్లో మన శంకరవరప్రసాద్ గారు విడుదల కానుంది. నాలుగో తేదీ ట్రైలర్ లాంచ్, ఏడు లేదా మరో…
ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా దాదాపుగా అన్ని చోట్లా సెలవు వాతావరణం ఉండటంతో జనం థియేటర్లకు బాగానే వెళ్లారు. ఈ…