Political News

‘కరెంటు బిల్లు’ మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూఅప్ భారాన్ని ప్రజలపై మోపబోమని కూటమి ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది.

మొత్తం రూ.4,498 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రజలపై ఒక్క పైసా కూడా పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆ లేఖలో పేర్కొంది. దీంతో విద్యుత్ చార్జీల పెంపుపై ఉన్న భయాలకు తెరపడింది. ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ట్రూడౌన్ అమలు ద్వారా యూనిట్ విద్యుత్ చార్జీలను తగ్గించి ఉపశమనం కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు వేల కోట్ల భారాన్ని కూడా ప్రజలపై పడకుండా భుజాన వేసుకోవడం ద్వారా ప్రజా హిత పాలనకు నిదర్శనంగా నిలిచింది.

This post was last modified on January 1, 2026 9:06 pm

Share

Recent Posts

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

1 hour ago

సుమంత్… ముందే మేల్కొని ఉండాల్సిందే

అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…

3 hours ago

టాక్ ఎలా ఉన్నా 200 కోట్లు పక్కా

స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…

4 hours ago

మోహన్ బాబుని మిస్ చేసిన మహేష్ బాబు

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…

4 hours ago

మహేష్ మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూసిన విజయ్

ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…

5 hours ago

జ‌న‌సేన ఎమ్మెల్యే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తారా ..?

తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన జ‌న‌సేన నాయ‌కుడు, సీనియ‌ర్ నేత ఆర‌ణి శ్రీనివాసులు రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఆస‌క్తిక‌ర…

6 hours ago