Political News

‘రాయ‌చోటి’ ర‌గ‌డ‌.. అస‌లు రీజ‌నేంటి?

ప్ర‌స్తుతం ఏపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా.. ‘రాయ‌చోటి’ గురించే పెద్దె ఎత్తున చ‌ర్చ సాగుతోంది. దీనిని అన్న‌మ‌య్య జిల్లా కేంద్రంగా తీసేయ‌డం.. త‌ర్వాత‌.. మంత్రి మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి క‌న్నీరు పెట్టుకోవ‌డం.. సీఎం చంద్ర‌బాబు.. ఆయ‌న‌ను ఓదార్చ‌డం వంటి అంశాలు ప్ర‌ముఖంగా మీడియాలో వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఏ ఇద్ద‌రుక‌లిసినా.. అస‌లు రాయ‌చోటిలో ఏం జ‌రిగింది? అనే అంశంపైనే చ‌ర్చిస్తున్నారు. ఇప్ప‌టి వ‌రకు రాయ‌చోటి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం.. అన్న‌మ‌య్య జిల్లాకు కేంద్రంగా ఉంది. వైసీపీ హ‌యాంలో 2022-23 మ‌ధ్య చేప‌ట్టిన జిల్లాల విభ‌జ‌న స‌మ‌యంలో దీనిని ఏర్పాటు చేశారు.

అయితే.. తాజాగా రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా త‌ప్పించ‌డంతోపాటు.. అన్న‌మ‌య్య జిల్లా నుంచి దీనిని తీసేసి… కొత్త గా ఏర్పాటు చేస్తున్న ‘మ‌ద‌న‌ప‌ల్లె’ జిల్లాలో రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గాన్ని చేర్చారు. ఇదీ.. వివాదానికి దారి తీసింది. ఇప్పటి వ‌ర‌కు జిల్లా కేంద్రంగా ఉన్న రాయ‌చోటిని మ‌ద‌న‌ప‌ల్లెలో క‌ల‌ప‌డాన్ని స్థానికులు ఒప్పుకోవ‌డం లేదు. కేవ‌లం స్థానికులే కాదు.. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కులు కూడా అంగీక‌రించ‌డం లేదు. అయినా.. కూడా పాల‌నా సౌల‌భ్యం కోసం.. రాయ‌చోటిని మ‌ద‌న‌ప‌ల్లె జిల్లాలో క‌ల‌పాల్సి వ‌చ్చింద‌ని సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు.

అప్ప‌ట్లోనూ వివాద‌మే!

వైసీపీ హ‌యాంలో చిత్తూరు జిల్లాను మూడుగా విభ‌జించి.. తిరుప‌తి, అన్న‌మ‌య్య‌, చిత్తూరు జిల్లాల‌ను ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలోనే అన్న‌మ‌య్య జిల్లాకు రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా నిర్ణ‌యించారు. దీనికి అప్ప‌టి ఎమ్మెల్యే, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహిత నేత‌, రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన పునాదులు ఉన్న గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి బ‌ల‌మైన ప్ర‌య‌త్నం చేయ‌డంతోనే రాయచోటి నియోజ‌వ‌ర్గాన్ని అన్న‌మ‌య్య జిల్లాకు కేంద్రంగా మార్చారు. అయితే.. అలా చేయొద్ద‌ని.. త‌మ‌కు ‘రాజంపేట‌’ నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్న‌మ‌య్య జిల్లా కేంద్రంగా మార్చాల‌ని వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున నెల‌ల త‌ర‌బ‌డి వివాదం చేశారు. ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేప‌ట్టారు. కానీ, జ‌గ‌న్ త‌న వైఖ‌రినే కొన‌సాగించారు. అప్ప‌టి నుంచి రాయ‌చోటి జిల్లా కేంద్రంగా ఉంది.

మంత్రికి చిక్కులు వ‌స్తాయా?

ఇక‌, రాయ‌చోటి నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకుని…వైసీపీ కంచుకోట‌లో టీడీపీ జెండాను ఎగుర‌వేసిన మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డికి ప్ర‌స్తుత ప‌రిణామాలు.. ఒకింత సెంటిమెంటుగా మారాయి. దీంతోనే ఆయ‌న రాయ‌చోటిని జిల్లా కేంద్రం నుంచి త‌ప్పిస్తుండ‌డంతో క‌న్నీరు పెట్టుకున్నారు. అయితే.. ఇది తాత్కాలిక‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల‌కు ఇంకా మూడేళ్ల స‌మ‌యం ఉంది కాబ‌ట్టి.. అప్ప‌టిలోగానే అన్ని ప‌రిస్థితులు సరిదిద్దుకుంటాయ‌ని చెబుతున్నారు.అయితే.. ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌జెప్ప‌డ‌మే.. ఇప్పుడు మంత్రి ముందున్న ప్ర‌ధాన క‌ర్త‌వ్య‌మ‌ని అంటున్నారు.

This post was last modified on December 30, 2025 2:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైదరాబాద్ ‘హై’ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని…

2 hours ago

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

7 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

9 hours ago

రాజ్యసభలో రచ్చ.. ఎవరీ రేణుక చౌదరి?

తెలంగాణ‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రి.. రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధత క‌ల్పించే…

9 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

10 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

10 hours ago