Political News

ఫ్యాక్ట్ చెక్: ఇంద్రకీలాద్రికి కరెంట్ కట్?

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దేవస్థానానికి సంబంధించి విద్యుత్ బిల్లుల అంశంపై ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. లక్షల మంది భక్తులు సందర్శించుకునే ఈ ఆలయానికి బిల్లులు బకాయిలు ఉన్నాయనే కారణంతో గంటసేపు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం.. ఆ వెంటనే పునరుద్ధరించటం జరిగిపోయాయి.

దీనికి సంబంధించి దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు వివరణ ఇచ్చారు. రెండేళ్లుగా దుర్గ గుడి యాజమాన్యం అప్పారావుపేటలోని, పాముల కాలువ వద్ద గల తమ సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ 24 మెగావాట్ విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మండలికి ఉచితంగా అందిస్తోంది. ఇందుకు ప్రతిగా విద్యుత్ శాఖ వారు దేవస్థానానికి చెందిన 10 సర్వీసులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ఆ సర్వీసులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ కోరుతోంది. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరిగాయి. చర్చల అనంతరం విద్యుత్ ను పునరుద్ధరించారు. 

అంతకుముందు ఏం జరిగిందంటే గడువు ముగిసినా దుర్గగుడి అధికారులు దాదాపు 3.20 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదని విద్యుత్ శాఖ చెబుతోంది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని స్పష్టం చేసింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.

ఒకసారిగా విద్యుత్తు ఆగిపోవడంతో, అధికారులు వెంటనే జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేశారు. కొద్దిసేపు లిఫ్టులు, ఏసీలు పనిచేయకపోవడంతో భక్తులు కొంత అసౌకర్యానికి పోయారు. అధికారులు విద్యుత్ శాఖ ఉన్నతాధికారితో చర్చలు జరిపి విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా చేశారు. 

This post was last modified on December 27, 2025 6:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

1 hour ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

2 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

2 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

4 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

4 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

5 hours ago