Political News

2025: ఏపీకి పెట్టుబ‌డుల సంవత్సరమే.. !

సాధార‌ణంగా.. ఏ రాష్ట్రానికైనా పెట్టుబ‌డులు వ‌స్తాయి. కానీ.. ఏపీ విష‌యాన్ని గ‌మ‌నిస్తే.. 2025లో మెజారిటీ పార్ట్ అంతా కూడా.. పెట్టుబ‌డుల చుట్టూనే తిరిగింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి.. న‌వంబ‌రు వ‌ర‌కు ప్ర‌ధానంగా పెట్టుబ‌డుల కోసం సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు విస్తృతంగా ప‌ర్య‌టించారు. రాష్ట్రం లో 20 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగాల క‌ల్ప‌న‌ను ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న ద‌రిమిలా..దానిని సాధించేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. పెట్టుబ‌డుల‌పై ప‌ట్టు సాధించారు.

ప్ర‌ధానంగా విశాఖ‌లో గూగుల్ డేటా కేంద్రంతోపాటు.. టీసీఎస్ కేంద్రాల‌కు అంకురార్ప‌ణ జ‌రిగింది కూడా ఈ సంవ‌త్స‌రంలోనే. త‌ద్వారా ల‌క్ష మందికి ఉపాధి ల‌భించ‌నుంది. అదేవిధంగా అమెరికా, స్విట్జ‌ర్లాండ్, సింగ‌పూర్‌, దుబాయ్‌లకు చెందిన ప‌లు ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌ను ఆహ్వానించి పెట్టుబ‌డులు పెట్టే క్ర‌మంలో దూసుకుపోయారు. ఈ క్ర‌మంలోనే దుబాయ్‌కు చెందిన లూలూ కంపెనీ విశాఖ‌లో మాల్ నిర్మించేందుకు గ‌తంలో చేసుకున్న ఒప్పందాన్ని తిరిగి గాడిలో పెట్టింది.

అలానే.. పెట్టుబ‌డులు పెట్టి.. ఉపాధి, ఉద్యోగాలు క‌ల్పించే సంస్థ‌ల‌కు ఈ ఏడాది భారీ రాయితీలు ఇచ్చా రు. అంతేకాదు.. వారికి ఎస్క్రో అకౌంట్ సౌల‌భ్యాన్ని క‌ల్పించిన ఏకైన రాష్ట్రంగా కూడా.. ఏపీ అవ‌త‌రించింది. ఇక‌, క్వాంట‌మ్ కంప్యూటింగ్ స‌హా బ్యాంకుల ఏర్పాటు విష‌యంలోనూ ఈ ఏడాది కీల‌క అడుగులు ప‌డ్డాయ‌నే చెప్పాలి. ప్ర‌ధానంగా డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌తో ఉద్యోగాల క‌ల్ప‌న‌, ఆరు వేల మంది కానిస్టేబుళ్ల నియామ‌కంతో హోం శాఖ బ‌లోపేతం వంటివిఈ ఏడాది క‌లిసి వ‌చ్చిన అంశాలు.

ప్ర‌ధానంగా ఈ ఏడాది జ‌రిగిన అన్ని కేబినెట్ స‌మావేశాల్లోనూ పెట్టుబ‌డుల‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చించారు. పెట్టుబ‌డి సంస్థ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు భారీ రాయితీలు కూడా ప్ర‌క‌టించారు. టీసీఎస్ స‌హా.. ప‌లు సంస్థ‌ల‌కు అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే భూములు కేటాయించారు. త‌ద్వారా.. పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోతాయ‌ని అనుకున్న సంస్థ‌లు కూడా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయి. మొత్తంగా ఈ ఏడాది 23 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు సాధించిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఇక‌, వీటిని ఏర్పాటు చేసేందుకు కూడా ప్ర‌భుత్వం స్వ‌యంగా చ‌ర్య‌లు ప్రారంభించింది.

This post was last modified on December 27, 2025 1:29 pm

Share
Show comments

Recent Posts

ఒక్కొక్క పార్టీకీ `3 గంట‌లు`…

పార్ల‌మెంటులో డీలిమిటేష‌న్ స‌హా.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై చ‌ర్చించేందుకు.. ఎంత‌స‌మ‌య‌మైనా ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రెడీ అయింది. ఈ వ్య‌వ‌హారంపై…

39 minutes ago

జగన్ మకాం మార్పు.. సెంటిమెంటా? రాజకీయ వ్యూహమా?

అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై…

2 hours ago

తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. ముమ్మాటీకీ సైకోయిజ‌మే..

వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ…

2 hours ago

ప్రతాప్ కష్టాలు పగవాడికి కూడా వద్దు

రేపు విడుదల కాబోతున్న  పాపం ప్రతాప్ కు టైటిల్ కు తగ్గట్టే చివరి నిమిషం వరకు అయ్యో పాపం అనిపించే…

2 hours ago

డీలిమిటేష‌న్‌… అంద‌రిలోనూ ఒకే భ‌యం!

దేశంలో పార్ల‌మెంటు, అసెంబ్లీ స్థానాల‌ను పున‌ర్విభ‌జించే డీలిమిటేష‌న్‌,  అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే 2023నాటి నారీ…

3 hours ago

‘సంభవం’… క్రేజీ ఐడియా ఇది

గత కొన్నేళ్లలో మలయాళ దర్శకులు బాగా డెవలప్ అయ్యారు. క్రైమ్, హారర్, సస్పెన్స్ ఈ మూడు అంశాలను తీసుకుని వాటికి…

4 hours ago