టాలీవుడ్ సినీ నటి మాధవీలత వర్సెస్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ల మధ్య ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. జేసీపై మాధవీలత విమర్శలు చేయడం…ఆ తర్వాత మాధవీ లతపై జేసీ అభ్యంతరకర కామెంట్లు చేయడం వివాదానికి దారి తీసింది.
అయితే, ఆ తర్వాత ఒకరికి ఒకరు సారీ చెప్పడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, ఈ సారి కూడా నూతన సంవత్సరం సందర్భంగా జేసీ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే మాధవీలతనే చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నామని జేసీ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.
గతంలో మాధవీలత తమపై అభాండాలు వేశారని జేసీ అన్నారు. కానీ, ఆ తర్వాత మాధవీ లత, తాము కాంప్రమైజ్ అయ్యామని చెప్పారు. తాను మాధవీలతకు సారీ చెప్పానని, తనకు ఆమె సారీ చెప్పిందని అన్నారు. అందుకే ఈ సారి ఆమెను చీఫ్ గెస్ట్ గా పిలిచామని, వస్తుందో లేదో తెలీదని అన్నారు. మరి, మాధవీలత వస్తారా…లేదా అన్నది తేలాల్సి ఉంది.
మహిళలకు మాత్రమే అంటూ…జేసీ ప్రభాకర్ రెడ్డి గత ఏడాది న్యూ ఈయర్ సందర్భంగా ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ కు వెళ్లి వచ్చే మహిళలకు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ మాధవీలత చేసిన వ్యాఖ్యలు జేసీకి కోపం తెప్పించాయి. దీంతో, మాధవీలతను ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్స్ చేశారు జేసీ.
This post was last modified on December 26, 2025 9:53 pm
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…