టాలీవుడ్ సినీ నటి మాధవీలత వర్సెస్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ల మధ్య ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. జేసీపై మాధవీలత విమర్శలు చేయడం…ఆ తర్వాత మాధవీ లతపై జేసీ అభ్యంతరకర కామెంట్లు చేయడం వివాదానికి దారి తీసింది.
అయితే, ఆ తర్వాత ఒకరికి ఒకరు సారీ చెప్పడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, ఈ సారి కూడా నూతన సంవత్సరం సందర్భంగా జేసీ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే మాధవీలతనే చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నామని జేసీ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.
గతంలో మాధవీలత తమపై అభాండాలు వేశారని జేసీ అన్నారు. కానీ, ఆ తర్వాత మాధవీ లత, తాము కాంప్రమైజ్ అయ్యామని చెప్పారు. తాను మాధవీలతకు సారీ చెప్పానని, తనకు ఆమె సారీ చెప్పిందని అన్నారు. అందుకే ఈ సారి ఆమెను చీఫ్ గెస్ట్ గా పిలిచామని, వస్తుందో లేదో తెలీదని అన్నారు. మరి, మాధవీలత వస్తారా…లేదా అన్నది తేలాల్సి ఉంది.
మహిళలకు మాత్రమే అంటూ…జేసీ ప్రభాకర్ రెడ్డి గత ఏడాది న్యూ ఈయర్ సందర్భంగా ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ కు వెళ్లి వచ్చే మహిళలకు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ మాధవీలత చేసిన వ్యాఖ్యలు జేసీకి కోపం తెప్పించాయి. దీంతో, మాధవీలతను ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్స్ చేశారు జేసీ.
This post was last modified on December 26, 2025 9:53 pm
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…
టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…
ఏప్రిల్ 30 ఎంతో దూరం లేదు. కేవలం నలభై నాలుగు రోజులే బ్యాలన్స్. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్,…
నైజామ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ఇంకా…
గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కోలీవుడ్ హీరో సూర్య ఈసారి తెలుగు టీమ్ తో చేతులు…