టాలీవుడ్ సినీ నటి మాధవీలత వర్సెస్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ల మధ్య ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. జేసీపై మాధవీలత విమర్శలు చేయడం…ఆ తర్వాత మాధవీ లతపై జేసీ అభ్యంతరకర కామెంట్లు చేయడం వివాదానికి దారి తీసింది.
అయితే, ఆ తర్వాత ఒకరికి ఒకరు సారీ చెప్పడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, ఈ సారి కూడా నూతన సంవత్సరం సందర్భంగా జేసీ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే మాధవీలతనే చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నామని జేసీ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.
గతంలో మాధవీలత తమపై అభాండాలు వేశారని జేసీ అన్నారు. కానీ, ఆ తర్వాత మాధవీ లత, తాము కాంప్రమైజ్ అయ్యామని చెప్పారు. తాను మాధవీలతకు సారీ చెప్పానని, తనకు ఆమె సారీ చెప్పిందని అన్నారు. అందుకే ఈ సారి ఆమెను చీఫ్ గెస్ట్ గా పిలిచామని, వస్తుందో లేదో తెలీదని అన్నారు. మరి, మాధవీలత వస్తారా…లేదా అన్నది తేలాల్సి ఉంది.
మహిళలకు మాత్రమే అంటూ…జేసీ ప్రభాకర్ రెడ్డి గత ఏడాది న్యూ ఈయర్ సందర్భంగా ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ కు వెళ్లి వచ్చే మహిళలకు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ మాధవీలత చేసిన వ్యాఖ్యలు జేసీకి కోపం తెప్పించాయి. దీంతో, మాధవీలతను ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్స్ చేశారు జేసీ.
This post was last modified on December 26, 2025 9:53 pm
కొన్ని సినిమాలు విడుదలకు ముందు నిర్మాతల్లో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ చూపిస్తాయి. గ్యారెంటీ హిట్టు కొడతామనే నమ్మకాన్ని బయట పెడతాయి.…
మరో నాలుగు రోజుల్లో క్యాలెండర్ మారుతోంది. 2025కు గుడ్బై చెబుతూ.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నాం. ఈ నేపథ్యంలో గడిచిన…
ఈ నెల రెండో వారంలో రిలీజైన మోగ్లీ సినిమా మీద టీం అంతా చాలా ఆశలే పెట్టుకుంది. ఇది తొలి…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీకి 2025లో ఏం జరిగింది? 2023లో ఎదురైన పరాభవం, పరాజయం తర్వాత పార్టీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో ‘మురారి’ ఒకటి. కృష్ణ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ…
విజయ్ దేవరకొండ కెరీర్ను మళ్లీ ఒక మలుపు తిప్పే సినిమా అవుతుందని ‘కింగ్డమ్’ మీద తన అభిమానులు ఎన్నో ఆశలు…