టాలీవుడ్ సినీ నటి మాధవీలత వర్సెస్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ల మధ్య ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. జేసీపై మాధవీలత విమర్శలు చేయడం…ఆ తర్వాత మాధవీ లతపై జేసీ అభ్యంతరకర కామెంట్లు చేయడం వివాదానికి దారి తీసింది.
అయితే, ఆ తర్వాత ఒకరికి ఒకరు సారీ చెప్పడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, ఈ సారి కూడా నూతన సంవత్సరం సందర్భంగా జేసీ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే మాధవీలతనే చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నామని జేసీ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.
గతంలో మాధవీలత తమపై అభాండాలు వేశారని జేసీ అన్నారు. కానీ, ఆ తర్వాత మాధవీ లత, తాము కాంప్రమైజ్ అయ్యామని చెప్పారు. తాను మాధవీలతకు సారీ చెప్పానని, తనకు ఆమె సారీ చెప్పిందని అన్నారు. అందుకే ఈ సారి ఆమెను చీఫ్ గెస్ట్ గా పిలిచామని, వస్తుందో లేదో తెలీదని అన్నారు. మరి, మాధవీలత వస్తారా…లేదా అన్నది తేలాల్సి ఉంది.
మహిళలకు మాత్రమే అంటూ…జేసీ ప్రభాకర్ రెడ్డి గత ఏడాది న్యూ ఈయర్ సందర్భంగా ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ కు వెళ్లి వచ్చే మహిళలకు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ మాధవీలత చేసిన వ్యాఖ్యలు జేసీకి కోపం తెప్పించాయి. దీంతో, మాధవీలతను ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్స్ చేశారు జేసీ.
This post was last modified on December 26, 2025 9:53 pm
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…